MJPTBCWREIS Results : బీసీ గురుకుల ఇంటర్, డిగ్రీ ప్రవేశాల ఫలితాలు విడుదల - రిజల్ట్ లింక్స్, రిపోర్టింగ్ తేదీలివే
MJPTBCWREIS Results 2026 : తెలంగాణ బీసీ గురుకుల జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి మొదటి విడత సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదలయ్యాయి. ఎంపికైన విద్యార్థులు మే 25 నుంచి 30వ తేదీ లోపు కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
MJPTBCWREIS Results 2026 : తెలంగాణ రాష్ట్ర బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (MJPTBCWREIS) ఆధ్వర్యంలో నడుస్తున్న జూనియర్, డిగ్రీ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా మొదటి దశ (First Phase) సీట్ల కేటాయింపు ఫలితాలను సొసైటీ కార్యదర్శి శ్రీ బడుగు సైదులు (IFS) ఆదివారం అధికారికంగా విడుదల చేశారు. మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాల్లో జూనియర్ ఇంటర్మీడియట్ (RJC) మరియు డిగ్రీ కోర్సుల్లో చేరడానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో ఆ వివరాలను ఆన్లైన్ ద్వారా తెలుసుకోవచ్చు.

ఈ ఏడాది ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండా…. కేవలం విద్యార్థులు తమ పదో తరగతి (SSC) లో సాధించిన మార్కుల (మెరిట్) ఆధారంగానే ఇంటర్మీడియట్ సీట్లను కేటాయించినట్లు కార్యదర్శి స్పష్టం చేశారు. అలాగే డిగ్రీ సీట్లను కూడా ఇంటర్ మార్కుల ఆధారంగా కేటాయించడం జరిగింది.
ఫలితాలు ఎక్కడ చెక్ చేసుకోవాలంటే..?
- ఇంటర్మీడియట్ ఫలితాల కోసం అభ్యర్థులు: https://mjptbcwreis.telangana.gov.in (లేదా) https://mjptbcadmissions.org/MJP-Inter వెబ్సైట్లను సందర్శించాలి.
- డిగ్రీ కాలేజీ అడ్మిషన్ల ఫలితాల కోసం : https://mjptbcadmissions.org/MJP-Degree/ వెబ్సైట్ ద్వారా సీట్ల కేటాయింపు వివరాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
రిపోర్టింగ్ గడువు…
మొదటి విడత ఫలితాలలో సీట్లు దక్కించుకున్న విద్యార్థులకు అడ్మిషన్ల గడువును కూడా అధికారులు ప్రకటించారు. ఎంపికైన అభ్యర్థులు తమకు కేటాయించిన సీట్లను ఖరారు చేసుకోవడానికి అవసరమైన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను (విద్యార్హత పత్రాలు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తదితర డాక్యుమెంట్లు) సిద్ధం చేసుకోవాలి.
ఆయా పత్రాలతో ఈనెల 25 (మే 25) నుంచి మే 30వ తేదీ లోపు సంబంధిత కాలేజీలకు నేరుగా వెళ్లి ప్రవేశ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రవేశాలకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా లేదా మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా అభ్యర్థులు కార్యాలయం హెల్ప్లైన్ నంబర్ 040-23328266 లో సంప్రదించవచ్చని కార్యదర్శి బడుగు సైదులు సూచించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

