తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మార్చి నుంచి ఆంధ్రప్రదేశ్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్, మే నెలల్లో దీని తీవ్రత ఎప్పటిలాగే గరిష్ట స్థాయికి చేరుకుంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ(APSDMA) హెచ్చరించింది. మార్చి ప్రారంభం నుండి వేడి పరిస్థితులు తీవ్రం కావడం ప్రారంభించాయని APSDMA మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖార్ జైన్ అన్నారు.

'రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఏప్రిల్, మే నెలలు తీవ్రంగా ఉండవచ్చు. వేడిగాలులు వచ్చే అవకాశం ఉంది.' అని ప్రఖార్ జైన్ వెల్లడించారు.
శ్రీకాకుళం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో మార్చిలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా. గుంటూరు, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు వీచే అవకాశం ఉంది. అధికారులు పరిస్థితిని 24 గంటలూ పర్యవేక్షిస్తున్నారు. జిల్లా యంత్రాంగాలను రెండు రోజుల ముందుగానే వడగాలుల పరిస్థితుల గురించి అప్రమత్తం చేస్తున్నారు. ప్రాణనష్టం జరగకుండా చూసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
వేడి సంబంధిత సమాచారం, సహాయం కోసం ప్రజలు రాష్ట్ర కంట్రోల్ రూమ్ నంబర్లు - 112, 1070, 18004250101లను సంప్రదించాలని అధికారులు సూచించారు. APSDMA కాలానుగుణంగా వేడిగాలుల హెచ్చరికలను జారీ చేస్తుంది. మధ్యాహ్నం సమయంలో వేడిగాలులకు గురికాకుండా ఉండాలని, తేలికపాటి కాటన్ దుస్తులను ధరించాలని, గొడుగులు తీసుకెళ్లాలని, నీరు, ఓఆర్ఎస్, మజ్జిగ లేదా కొబ్బరి నీటితో హైడ్రేటెడ్ గా ఉండాలని పౌరులను కోరింది. గర్భిణులు, శిశువులు, పిల్లలు, వృద్ధులు వీలైనంత వరకు ఇంటి లోపల ఉండాలని అధికారులు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40కి చేరువయ్యాయి.
తెలంగాణలోనూ ఎండలు
తెలంగాణలోనూ ఎండలు మార్చి మెుదట్లోనే భయపెడుతున్నాయి. సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం 25 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలకు పైగా నమోదు అయ్యాయి. హైదరాబాద్- 36.6 డిగ్రీలు, అత్యధికంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 37.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రెండుమూడు రోజుల్లో 40 డిగ్రీలను ఉష్ణోగ్రతలు తాకే అవకాశం ఉంది. ఏప్రిల్, మే నెలలో ఎండల తీవ్రత సాధారణంగా పెరుగుతుంది. అయితే ఈసారి మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు కానున్నాయి.
{{/usCountry}}తెలంగాణలోనూ ఎండలు మార్చి మెుదట్లోనే భయపెడుతున్నాయి. సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం 25 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలకు పైగా నమోదు అయ్యాయి. హైదరాబాద్- 36.6 డిగ్రీలు, అత్యధికంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 37.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రెండుమూడు రోజుల్లో 40 డిగ్రీలను ఉష్ణోగ్రతలు తాకే అవకాశం ఉంది. ఏప్రిల్, మే నెలలో ఎండల తీవ్రత సాధారణంగా పెరుగుతుంది. అయితే ఈసారి మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు కానున్నాయి.
{{/usCountry}}