Weather Update : పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఈ తేదీల్లో మరింత పెరిగే అవకాశం
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇప్పటికే మధ్యాహ్నం బయటకు వెళ్లాలి అంటే ఎండ వేడితో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని రోజుల్లో ఉష్ణోగ్రతల్లో మరింత మార్పు ఉండనుంది.
మార్చి 1 ఆదివారం నుండి హైదరాబాద్ తీవ్రమైన వేసవిని చూడబోతోంది. అయితే భారత వాతావరణ శాఖ(IMD) ప్రకారం కొన్ని ప్రాంతాల్లో ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు కూడా ఉంటాయని అంచనా వేసింది. మార్చి 3-7 మధ్య ఉష్ణోగ్రతలలో పెరుగుదల ఉండే అవకాశం ఉంది.

తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకారం.. తెలంగాణలో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉంది. మార్చి 3-7 మధ్య, హైదరాబాద్లో వేసవి ఉష్ణోగ్రతలు 36–37 డిగ్రీల పరిధిలో ఉండే అవకాశం ఉంది. భద్రాద్రి, ఖమ్మం, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ వంటి తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 39–41 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ఇతర జిల్లాల్లో 37–39 డిగ్రీల సెల్సియస్ పరిధిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ సిటీతోపాటుగా రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నందున జనాలు పగటిపూట బయటకు వెళ్లేప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
తెలంగాణలో ఆగ్నేయం నుండి తక్కువ స్థాయి గాలులు రాష్ట్రవ్యాప్తంగా వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది. ఈ గాలులు రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం అంతటా పొడి వాతావరణ పరిస్థితులను కొనసాగిస్తాయని భావిస్తున్నారు.
రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాలలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. యానంతో సహా ఉత్తర తీరంలో సోమ, మంగళవారాల్లో పొడి వాతావరణం ఉంటుందని అంచనా. దక్షిణ తీరంలో కూడా పొడి వాతావరణం ఉంటుంది. రాయలసీమలోనూ పొడి పరిస్థితులు కొనసాగుతాయి. మరికొన్ని రోజుల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది.
రాబోయే మూడు రోజుల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


