రాయలసీమ వ్యాప్తంగా చిల్లర మార్కెట్లలో టమాటా ధరలు పెరిగాయి. కిలోకు సుమారు రూ. 40కి పెరగడంతో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ధరల పతనం తర్వాత రైతులకు ఊరట లభించింది. ధరలు పెట్టుబడి ఖర్చుల కంటే తక్కువకు పడిపోవడంతో దాదాపు మూడు నెలల పాటు రైతులు నష్టాలను చూశారు. దీంతో కొందరు తమ పంటను పొలాల్లోనే వదిలివేయవలసి వచ్చింది.

ఏప్రిల్-మే సీజన్లో దిగుబడులు తగ్గడమే ఇటీవలి పెరుగుదలకు కారణమని భావిస్తున్నారు. సోమవారం కర్నూలులో టోకు ధర కిలోకు సుమారు రూ. 25గా ఉందని మార్కెట్ అధికారులు తెలిపారు. చిల్లర మార్కెట్లో టమాట ధరలు కిలోకు రూ.40 వరకు పలుకుతున్నాయి. స్థానిక ఉత్పత్తి తగ్గుతున్న నేపథ్యంలో డిమాండ్ను తీర్చడానికి వ్యాపారులు మదనపల్లె నుండి టమోటాలను తెప్పిస్తున్నారు.
అనంతపురం జిల్లాలోని మార్కెట్లలో కూడా ఇలాంటి ధోరణులే కనిపించాయి. ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే పెట్టుబడిని తిరిగి పొందిన తర్వాత కనీసం 30 శాతం లాభం ఆశించవచ్చని రైతులు చెబుతున్నారు. అయితే ఈ సీజన్లో దిగుబడి తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందన్నారు.
మార్కెట్కు టమోట రాకలు తక్కువగా ఉంటే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు సూచించారు. ప్రస్తుతం పంచ రాక తక్కువగా ఉందని, డిమాండ్ స్థిరంగా ఉందన్నారు. ఈ ధోరణి కొనసాగితే, టమాటా ధరలు మరింత పెరగవచ్చు అని చెప్పారు.
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మార్కెట్లో గత రెండు రోజులుగా టమాటా ధరలు భారీగా పెరిగాయి. కిలో ధర సుమారు రూ.15 మేర వృద్ధి చెందింది. మొదటి రకం టమాటాలు కిలో రూ.25 చొప్పున, రెండో రకం టమాటాలు కిలో రూ.19 చొప్పున విక్రయించారు.
మార్చి మూడవ వారం వరకు ధరలు కిలో రూ.10 కంటే తక్కువగానే ఉండి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొన్నామని రైతులు చెబుతున్నారు. ప్రస్తుత ధరల పెరుగుదల కొంత ఆర్థిక అండగా నిలుస్తోందన్నారు. మదనపల్లెతో పాటు, చిత్తూరులోని పాలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ, కర్ణాటకలోని చింతామణి, శ్రీనివాసపురం వ్యవసాయ మార్కెట్ కమిటీల వంటి వ్యాపార కేంద్రాల్లోనూ టమాటా క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి.
{{/usCountry}}మార్చి మూడవ వారం వరకు ధరలు కిలో రూ.10 కంటే తక్కువగానే ఉండి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొన్నామని రైతులు చెబుతున్నారు. ప్రస్తుత ధరల పెరుగుదల కొంత ఆర్థిక అండగా నిలుస్తోందన్నారు. మదనపల్లెతో పాటు, చిత్తూరులోని పాలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ, కర్ణాటకలోని చింతామణి, శ్రీనివాసపురం వ్యవసాయ మార్కెట్ కమిటీల వంటి వ్యాపార కేంద్రాల్లోనూ టమాటా క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి.
{{/usCountry}}మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల వంటి పరిస్థితులు నెలకొనడంతో కొనుగోలుదారులు ఇప్పుడు మదనపల్లె, చింతామణి మార్కెట్ల వైపు మొగ్గు చూపుతున్నారు.