మార్చి 18 తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఉన్న జువ్వలదిన్నె మత్స్యకార రేవు నుండి ముగ్గురు వ్యక్తులు నాలుగు యాంత్రిక పడవలను (mechanised boats) విడిపించారు. తమిళనాడులోని కడలూరు, పుదుచ్చేరిలోని కారైకల్కు చెందిన మత్స్యకారుల యాజమాన్యంలో ఉన్న ఈ పడవలను, కొన్ని నెలల క్రితం నెల్లూరు జిల్లాలోని కృష్ణపురం, చెన్నాయపాలెం గ్రామాల మత్స్యకారులు స్వాధీనం చేసుకున్నారు.

దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈ రెండు రాష్ట్రాలకు చెందిన మత్స్యకారుల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర సముద్ర సరిహద్దులను దాటినప్పుడు ఒకరి పడవలను మరొకరు స్వాధీనం చేసుకోవడం తరచుగా జరుగుతోంది. కొన్ని నెలల క్రితం జువ్వలదిన్నె మత్స్యకారులు ఆ పడవలను స్వాధీనం చేసుకున్న తర్వాత, వాటిని గ్రామంలోని మత్స్యకార రేవు వద్ద లంగరు వేసి ఉంచారు. ఆ పడవలను పర్యవేక్షించే బాధ్యత ముగ్గురు వ్యక్తులపై ఉంది.
అయితే తాజాగా జువ్వలదిన్నె మత్స్య రేవు నుంచి హై-స్పీడ్ ఫిషింగ్ బోట్లను విడుదల చేసిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తమ పాత్రను అంగీకరించిన ముగ్గురు నిందితులైన మత్స్యకారులపై మత్స్యకారుల సంఘ పెద్దలు రూ. 2.25 కోట్ల జరిమానా విధించారు. ఉలవపాడు మండలం, చాకిచెర్ల-పెద్దా పట్టపుపాలెం గ్రామంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర జలాల్లో మత్స్యకారుల భద్రతకు సంబంధించిన అంశాలతో పాటు ఈ సమస్యపై చర్చించేందుకు ప్రకాశం, బాపట్ల, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, తిరుపతి జిల్లాల నుంచి 164 మంది గ్రామ పెద్దలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
మొదట నిందితులైన మత్స్యకారులను రూ. 5 కోట్ల జరిమానా చెల్లించమని కోరారు. అయితే ఆర్థిక ఇబ్బందులను పేర్కొంటూ అంత భారీ మొత్తాన్ని చెల్లించలేమని వారు విన్నవించుకున్నారు. వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న సంఘ నాయకులు జరిమానాను రూ. 2.40 కోట్లకు తగ్గించారు. చివరకు ఆ మొత్తాన్ని రూ. 2.25 కోట్లకు తగ్గించారు.
ముగ్గురు నిందితుల కుటుంబాలు జరిమానాలో భాగంగా అక్కడికక్కడే రూ.1 కోటి చెల్లించాయని, మిగిలిన మొత్తాన్ని త్వరలో చెల్లిస్తామని సంఘ పెద్దలకు హామీ ఇచ్చాయని తెలుస్తోంది. జరిమానా అంశంతో పాటు ఈ సమావేశం ఏకగ్రీవంగా పలు తీర్మానాలను కూడా ఆమోదించింది.
{{/usCountry}}ముగ్గురు నిందితుల కుటుంబాలు జరిమానాలో భాగంగా అక్కడికక్కడే రూ.1 కోటి చెల్లించాయని, మిగిలిన మొత్తాన్ని త్వరలో చెల్లిస్తామని సంఘ పెద్దలకు హామీ ఇచ్చాయని తెలుస్తోంది. జరిమానా అంశంతో పాటు ఈ సమావేశం ఏకగ్రీవంగా పలు తీర్మానాలను కూడా ఆమోదించింది.
{{/usCountry}}తమ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను ప్రభుత్వం ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని మత్స్యకార సంఘ నాయుకుడు డిమాండ్ చేశారు. పట్టపు కాపు మత్స్యకారుల వర్గాన్ని షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ST) కేటగిరీలో చేర్చాలన్న తమ అభ్యర్థన ఏళ్లుగా పెండింగ్లో ఉందని పేర్కొ్న్నారు. తమ హక్కులను పరిరక్షించాలని, పొరుగు ప్రాంతాల నుంచి పడవలు ఆంధ్రప్రదేశ్ జలాల్లోకి ప్రవేశించకుండా నిరోధించాలని కోరారు. చొరబాట్లను అరికట్టడానికి చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కోరారు.
అంతేకాకుండా పడవలు, ఇంజన్లు, చేపల వలలపై 75 శాతం రాయితీ ఇవ్వాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు. ప్రత్యేక బడ్జెట్ కేటాయింపుతో ఒక ప్రత్యేక పట్టపు కాపు కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.