AP Rajya Sabha Elections 2026 : రాజ్యసభ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లను తమ అభ్యర్థులుగా టీడీపీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని అధికార ఎన్డీయే కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ కీలక ప్రకటన వెలువడింది. కూటమి ఒప్పందంలో భాగంగా మొత్తం నాలుగు స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ మూడు స్థానాల్లో, జనసేన పార్టీ ఒక స్థానంలో పోటీ చేయాలని నిర్ణయించారు.

ఈ ఎన్నికల్లో భాగంగా శనివారం జనసేన పార్టీ తరఫున ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. దీంతో ఏపీ నుంచి కూటమి తరఫున బరిలో నిలిచే నలుగురు అభ్యర్థులపై స్పష్టత వచ్చేసింది. అసెంబ్లీలో కూటమికి ఉన్న భారీ బలం దృష్ట్యా ఈ నలుగురి ఎన్నిక కేవలం ఏకగ్రీవ ప్రక్రియే కానుంది.
సామాజిక సమీకరణాలు, పార్టీ విధేయతలకు ప్రాధాన్యం ఇస్తూ అభ్యర్థులను ఎంపిక చేసింది. ముందునుంచి ప్రముఖంగా వినిపించిన చింతకాయల విజయ్ పేరు తుది జాబితాలో ఉంది. ఈయన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారుడు. గత కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ డిజిటల్ విభాగాన్ని, సోషల్ మీడియా వ్యూహాలను విజయ్ వెనుకుండి నడిపించారు. గత కొన్ని ఎన్నికల నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ లభించకపోయినప్పటికీ…. పార్టీ పట్ల ఆయన చూపిన నిబద్ధత, సంస్థాగత సేవల దృష్ట్యా ఈసారి పెద్దల సభకు వెళ్లే అవకాశం దక్కిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఏపీలో రాజ్యసభ ఎన్నికలు - అభ్యర్థులు
- భాష్యం రామకృష్ణ - టీడీపీ
- సానా సతీశ్ - టీడీపీ
- చింతకాయల విజయ్ - టీడీపీ
- లింగమనేని రమేష్ - జనసేన
రాజ్యసభ సీట్ల కోసం పలువురు సీనియర్ నేతలు ప్రయత్నాలు చేసినప్పటికీ ఈసారి… భాష్యం రామకృష్ణ పేరు ఖరారైంది. అంతేకాకుండా ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సనా సతీష్ బాబుకి మరోసారి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. దీంతో ఆయన రెండోసారి కూడా రాజ్యసభకు ఎన్నిక కానున్నారు.
{{/usCountry}}రాజ్యసభ సీట్ల కోసం పలువురు సీనియర్ నేతలు ప్రయత్నాలు చేసినప్పటికీ ఈసారి… భాష్యం రామకృష్ణ పేరు ఖరారైంది. అంతేకాకుండా ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సనా సతీష్ బాబుకి మరోసారి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. దీంతో ఆయన రెండోసారి కూడా రాజ్యసభకు ఎన్నిక కానున్నారు.
{{/usCountry}}జూన్ 18వ తేదీన దేశంలోని 10 రాష్ట్రాల పరిధిలో ఉన్న 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఎగువ సభలో పార్టీల బలాబలాలను మార్చివేయనున్నాయి.
ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 24 రాజ్యసభ స్థానాల్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల నుంచి నాలుగు చొప్పున స్థానాలు ఉన్నాయి. అలాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి మూడు చొప్పున, జార్ఖండ్ నుంచి రెండు స్థానాలు ఉన్నాయి. వీటితో పాటు అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, మణిపూర్, మేఘాలయ రాష్ట్రాల నుంచి ఒక్కో స్థానానికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు.