కల్తీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన అనుచరుడు ఆరేపల్లి రామును కూడా అధికారులు తీసుకెళ్లారు. అయితే తాజాగా జోగి రమేష్ మీద టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న విమర్శలు గుప్పించారు. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు. జోగి రమేష్ గురించి ఆలోచన చేయడం సీఎం చంద్రబాబుకు అనవసరం అని వెంకన్న చెప్పారు. జనార్ధన్ రావు ఇచ్చిన సమాచారంతో జోగి రమేష్ అరెస్ట్ అయ్యారని తెలిపారు. విచారణలో మాజీ సీఎం జగన్ పేరు బయటకు వస్తుందన్నారు.

'చంద్రబాబు, లోకేశ్లకు అరెస్టుతో సంబంధం లేదు. జోగి రమేష్ బీసీ కార్డు వేసుకోవడానికి సిగ్గు ఉండాలి. దోచిన ఆస్తులను బీసీలకు పంచి పెట్టాలి. జగన్కు కూడా ఈ నకిలీ మద్యం కేసులో పాత్ర ఉంది. మద్యం కుంభకోణం కేసులో కూడా తాడేపల్లి ప్యాలెస్కు డబ్బు చేరిందని అధికారులు తెలుసుకున్నారు. అసలు ఈ నకిలీ మద్యం వ్యవహారం గత ప్రభుత్వంలో ఎందుకు బయటపెట్టలేదు.' అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు.
డైవర్షన్ పాలిటిక్స్, దొంగ ప్రమాణాలు, దోచుకోవడం లాంటివి జగన్కు తెలుసు అని బుద్దా వెంకన్న అన్నారు. జగన్ పెద్ద దొంగ అని, జోగి రమేష్ లాంటి వారు చిన్న దొంగలు అని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉంటే రంకెలు వేసే రమేష్.. ఇప్పుడు పోలీసులు వచ్చాక బాత్రూమ్లో దాక్కున్నారన్నారు. అంతకుముందు దమ్ముంటే అరెస్ట్ చేయండి అని చెప్పిన రమేష్.. ఇప్పుడు చంద్రబాబు కారణంగానే అరెస్ట్ అనడం ఏంటన్నారు.
'జనార్ధన్ రావుతో జోగి రమేష్కు లింకు ఉంది. ఈ విషయం విచారణలో తేలింది. ఇప్పుడు జోగి రమేష్, జగన్కు ఉన్న లింకు బయటకు రాబోతుంది. ఈ కేసు విచారణ పూర్తి కాగానే.. ఇంకా పెద్ద వాళ్ల పేర్లు బయటకు వస్తాయి. వైసీపీ నేతలు.. కల్తీ మద్యం పేరుతో ప్రజలకు స్లో పాయిజన్ ఇచ్చారు. వారి ప్రాణాలు తీసి.. డబ్బులు దోచుకున్నారు. జోగి రమేష్ ఇందులో కీలక నిందితుడు.' అని బుద్దా వెంకన్న ఆరోపించారు.
జగన్ డైవెర్షన్ పాలిటిక్స్ చేయడంలో దిట్ట అని బుద్దా వెంకన్న కామెంట్ చేశారు. మద్యం షాపుల్లో ఆన్లైన్ లావాదేవీలు లేకుండా చేసి కోట్లు దోచేసిన వ్యక్తి జగన్ అన్నారు. దొంగతనాలు, దోపిడీలు, హత్యలు వారికి అలవాటేనన్నారు. టీడీపీ డీఎన్ఏలో ఎలాంటి మోసాలు లేవన్నారు. కల్తీ మద్యం కేసులో పాత్రధారులు, సూత్రధారులు జైలుకు వెళ్లడం ఖాయమని వెంకన్న పేర్కొన్నారు.
{{/usCountry}}జగన్ డైవెర్షన్ పాలిటిక్స్ చేయడంలో దిట్ట అని బుద్దా వెంకన్న కామెంట్ చేశారు. మద్యం షాపుల్లో ఆన్లైన్ లావాదేవీలు లేకుండా చేసి కోట్లు దోచేసిన వ్యక్తి జగన్ అన్నారు. దొంగతనాలు, దోపిడీలు, హత్యలు వారికి అలవాటేనన్నారు. టీడీపీ డీఎన్ఏలో ఎలాంటి మోసాలు లేవన్నారు. కల్తీ మద్యం కేసులో పాత్రధారులు, సూత్రధారులు జైలుకు వెళ్లడం ఖాయమని వెంకన్న పేర్కొన్నారు.
{{/usCountry}}