...
...
Next Story

అల్లూరి జిల్లాలో తీవ్ర విషాదం..! సెల్ఫీ సరదాకు ముగ్గురు బాలికల ప్రాణాలు బలి - వీడియో

అల్లూరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అనంతగిరి మండలంలో మలంగుమ్మి వాటర్‌ఫాల్స్ వద్దకు సరదాగా వెళ్లిన ఐదుగురు బాలికలు సెల్ఫీ వీడియో తీసుకుంటూ నీటిలో మునిగిపోయారు. వీరిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

Published on: Apr 10, 2026, 09:52:14 IST
Advertisement

సెల్ఫీ సరదాకు ముగ్గురు మైనరల్ బాలికల ప్రాణాలు బలయ్యాయి. ఈ విషాద ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగింది. సరదాగా వాటర్ ఫాల్స్ లో దిగి అప్పటివరకు సంతోషంగా గడిపిన ఆ బాలికలు… అంతలోనే ప్రాణాలు కోల్పోయారు. లోతును అంచనా వేయకపోవటంతో… ఉన్నట్టుండి నీళ్లలోకి జారుకుని దుర్మరణం చెందారు.

సరదాగా ఎంజాయ్ చేద్దామని వెళ్లి…

సెల్ఫీ సరదాకు ముగ్గురు బాలికల ప్రాణాలు బలి (representative image ) (image source istock)
సెల్ఫీ సరదాకు ముగ్గురు బాలికల ప్రాణాలు బలి (representative image ) (image source istock)

ప్రాథమిక వివరాల ప్రకారం…. అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలోని మూలగుమ్మి గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇదే గ్రామానికి చెందిన ఐదుగురు మైనర్ బాలికలు వేసవి సెలవుల నిమిత్తం సొంతూరుకు వచ్చారు. అయితే జలపాతం దగ్గర సరదాగా ఎంజాయ్ చేద్దామని వెళ్లారు.

జలపాతంలో కాసేపు నీళ్లలో గడిపారు. ఫొటోలు, సెల్ఫీలతో సరదాగా గడిపారు. అంతలోనే ఒక అమ్మాయి నీళ్ల లోపలికి జారుకుంది. ఆ తర్వాత మరో ఇద్దరు ఆమెను కాపాడడానికి వెళ్లి వాళ్ళు కూడా మునిగిపోయారు. మరో ఇద్దరు బయటనే ఉండగా…. వాళ్లు తీసిన వీడియోలో ఇదంతా కూడా రికార్డు అయింది. ఓ వైపు అరుపులు అరుస్తుండగా… కాపాడవారు లేక ఆ ముగ్గురు నీళ్లలోనే చనిపోయారు. చనిపోయిన వారిలో త్రిష (17), రత్నకుమారి (16), పవిత్ర (16) ఉన్నారు. వీరంతా ఇంటర్మీడియట్, పదో తరగతి చదువుతున్నట్లు తెలిసింది.

జలపాతం ఒడ్డున ఉన్న మరో అమ్మాయి వెంటనే గ్రామస్థులకు సమాచారం ఇచ్చింది. వారు వెంటనే జలపాతంలోకి దిగి ముగ్గురు అమ్మాయిలను బయటకు తీశారు. కానీ అప్పటికే వారు మృతి చెందారు. వీళ్లంతా ఒకే కుటుంబానికి చెందిన వారు అవ్వడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe