తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో పలువురిని సిట్ అరెస్ట్ చేయగా… తాజాగా టీటీడీలో కూడా తొలి అరెస్ట్ నమోదైంది. అప్పట్లో కొనుగోళ్ల విభాగం జనరల్ మేనేజర్గా ఉన్న ఆర్ఎస్ఎస్వీఆర్ సుబ్రహ్మణ్యాన్ని సిట్ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు.

రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత నెల్లూరులోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. అతనికి కోర్టు… డిసెంబరు 10 వరకు రిమాండ్ విధించింది. ఈ కేసులో సుబ్రహ్మణ్యం 29వ నిందితుడిగా ఉన్నాడు. టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్న అప్పన్న (ఏ24)కు సుబ్రహ్మణ్యం సహకరించారని సిట్ ఇప్పటికే గుర్తించింది.
తాజాగా అరెస్ట్ అయిన ఆర్ఎస్ఎస్వీఆర్ సుబ్రహ్మణ్యం గతంలో టీటీడీలో జనరల్ మేనేజర్ (ప్రొక్యూర్మెంట్) గా పనిచేశారు.లడ్డూల తయారీకి ఉపయోగించే నెయ్యితో సహా కీలక సామగ్రిని సేకరించే విధుల్లో కీలకంగా ఉన్నారని గుంటూరు రేంజ్ ఐజి సర్వశ్రేష్టి త్రిపాఠి తెలిపారు.
ప్రస్తుతం ఆర్ఎస్ఎస్వీఆర్ సుబ్రహ్మణ్యం టీటీడీలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా బాధ్యతలు చూస్తున్నారు. తిరుపతి ఎన్జీవో కాలనీలోని ఆయన నివాసం నుంచి గురువారం మధ్యాహ్నం సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ, ఏపీ పోలీసు సిట్గా ఏర్పడి సంయుక్తంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నసంగతి తెలిసిందే.
ఈ కేసులో రాజకీయ పార్టీలకు చెందిన వారితో పాటు ఇతర వ్యక్తులు అరెస్ట్ అయినప్పటికీ… టీటీడీలో కీలకంగా ఉన్న అధికారిలెవరూ అరెస్ట్ కాలేదు. అంతేకాకుండా కేసులో ఇద్దరు కిందిస్థాయి ఉద్యోగులు కూడా ఉన్నప్పటికీ ఇంతవరకూ అరెస్టు కాలేదు. అనూహ్యంగా సీనియర్ అధికారి అయిన సుబ్రహ్మణ్యాన్ని సిట్ అరెస్ట్ చేయటం సంచలన పరిణామంగా మారింది.
టీటీడీ పరిధిలో అరెస్టులు సుబ్రమణ్యం ఒక్కరితోనే ఆగుతాయా లేక మరికొందరు కూడా ఈ లిస్టులో ఉంటారా అనేది చర్చనీయాంశంగా మారింది. రానున్న రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి.
{{/usCountry}}టీటీడీ పరిధిలో అరెస్టులు సుబ్రమణ్యం ఒక్కరితోనే ఆగుతాయా లేక మరికొందరు కూడా ఈ లిస్టులో ఉంటారా అనేది చర్చనీయాంశంగా మారింది. రానున్న రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి.
{{/usCountry}}