...
...
Next Story

తిరుపతి లడ్డూ వివాదం : టీటీడీకి రూ.250 కోట్ల విలువైన నకిలీ నెయ్యిని ఎలా సరఫరా చేశారు?

తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ప్రసాద తయారీకి ఉపయోగించిన నెయ్యి కల్తీదేనని సీబీఐ గుర్తించింది.

Published on: Nov 10, 2025, 20:26:55 IST
Advertisement

తిరుమల తిరుపతి దేవస్థానానికి లడ్డూ తయారీ కోసం కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్టుగా సీబీఐ గుర్తించింది. ఉత్తరాఖండ్‌కు చెందిన ఒక పాల సంస్థ 2019 నుంచి 2024 మధ్య ఐదేళ్లపాటు టీటీడీకి రూ.250 కోట్ల విలువైన 68 లక్షల కిలోల నకిలీ నెయ్యిని సరఫరా చేసిందని సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది.

తిరుపతి లడ్డూ వివాదం
తిరుపతి లడ్డూ వివాదం

నిందితుల్లో ఒకరైన అజయ్ కుమార్ సుగంధ్ అరెస్టు తర్వాత సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఈ వివరాలను సేకరించింది. నెల్లూరు కోర్టుకు సమర్పించిన రిమాండ్ నివేదికలో సిట్ ఈ విషయాలను పేర్కొంది. టీటీడీకి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యిని సరఫరా చేసే భోలే బాబా ఆర్గానిక్ డెయిరీకి సుగంధ్ మోనోడిగ్లిజరైడ్స్, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ వంటి రసాయనాలను సరఫరా చేశారు. వీటితోనే నెయ్యిని తయారు చేశారని సీబీఐ గుర్తించింది.

డెయిరీ ప్రమోటర్లు పోమిల్ జైన్, విపిన్ జైన్ నకిలీ దేశీ నెయ్యి తయారీ యూనిట్‌ను స్థాపించారని సీబీఐ దర్యాప్తులో తేలింది. మరో కీలక విషయం ఏంటంటే.. పాలను కొనుగోలు చేయకుండానే కెమికల్స్ ద్వారానే నెయ్యి తయారు చేసి.. టీటీడీకి సరఫరా చేశారు.

2022లో భోలే బాబా ఆర్గానిక్ డెయిరీని అనర్హులుగా ప్రకటించి, నెయ్యి సరఫరా చేయకుండా బ్లాక్ లిస్ట్ చేశారు. అయితే డెయిరీ ఇతర డెయిరీల ద్వారా కాంట్రాక్టుల కోసం బిడ్డింగ్ చేయడం ద్వారా తిరుపతి ఆలయ ట్రస్ట్‌కు కల్తీ నెయ్యిని సరఫరా చేస్తూనే ఉంది . వీటిలో తిరుపతిలోని వైష్ణవి డెయిరీ, యూపీకి చెందిన మాల్ గంగా, తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ ఫుడ్స్ ఉన్నాయి. వీటి ద్వారా సరఫరా చేశారు. ఈ డెయిరీలు భోలే బాబా ప్రమోటర్ల చేతుల్లోనే ఉన్నాయని, బినామీ కంపెనీలుగా ఉపయోగించారని సిట్ దర్యాప్తులో తేలింది. మొత్తం 68 లక్ష కేజీల కల్తీ నెయ్యి విలువ రూ. రూ. 250 కోట్లుగా ఉంది. టీటీడీ ప్రసాదాలు, పూజా సామగ్రి తయారీలో దీనిని ఉపయోగించారు.

దర్యాప్తు సమయంలో FSSAI, SIT ​​బృందం అధికారులు దిండిగల్‌లోని ఏఆర్ డెయిరీ ప్లాంట్‌ను తనిఖీ చేశారు. దీని ఫలితంగా నాలుగు కల్తీ నెయ్యి ట్యాంకర్లు ఏఆర్ డెయిరీకి తిరిగి రాలేదని, వైష్ణవి డెయిరీ ప్లాంట్ సమీపంలోని స్థానిక రాతి క్రషింగ్ యూనిట్‌కు మళ్లించారని నివేదిక తెలిపింది. ఆగస్టు 2024లో వైష్ణవి డెయిరీ ఈ ట్రక్కులపై లేబుల్‌లను మార్చి, కల్తీ నెయ్యి నాణ్యత, స్థిరత్వాన్ని మెరుగుపరిచి అదే నెయ్యిని తిరిగి టీటీడీకి సరఫరా చేసింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe