మార్చి 3వ తేదీ మంగళవారం రోజున చంద్రగ్రహణం సందర్భంగా తిరుపతి, తిరుచానూరులోని తిరుమల తిరుపతి దేవస్థానాలు(టీటీడీ) ఆధ్వర్యంలోని అన్నప్రసాద వితరణ కేంద్రాలను మూసివేయనున్నారు. ఇందులో భాగంగా తిరుచానూరులోని తోళ్లప్ప గార్డెన్స్లో గల ఎస్వీ నిత్య అన్నప్రసాద భవనం, తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలోని ఉద్యోగుల క్యాంటీన్, శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలోని క్యాంటీన్, అలాగే శ్రీనివాసం, విష్ణునివాసం వసతి సముదాయాల్లో భక్తులకు అందించే ఉచిత అన్నప్రసాద వితరణను తాత్కాలికంగా నిలిపివేస్తారు.

అదేవిధంగా తిరుపతిలోని ప్రభుత్వ వైద్యశాలలు, వివిధ ప్రథమ చికిత్స కేంద్రాల్లో రోగులు, వారి సంరక్షకులకు అందించే అన్నప్రసాదాలను ముందస్తుగా పంపిణీ చేయనున్నారు.
నకిలీ వెబ్సైట్ల మోసం
తిరుమలలో వసతి గదులు ఇప్పిస్తామంటూ భక్తులను మోసం చేస్తున్న దళారులు, నకిలీ వెబ్సైట్లపై టీటీడీ అప్రమత్తమైంది. కేరళకు చెందిన భక్తుడు సి.కె. సురేష్ బాబు తిరుమలలో కర్ణాటక ప్రవాసి సౌధ పేరుతో గదులు ఏర్పాటు చేస్తామని చెప్పిన వ్యక్తి చేతిలో మోసపోయాడు. ఈ ఘటనపై ప్రభుత్వానికి ఫిర్యాదు అందిన నేపథ్యంలో, టీటీడీ విజిలెన్స్ విభాగం సమగ్ర విచారణ చేపట్టింది.
విచారణలో తిరుమల శ్రీవారి ఆలయ చిత్రాలు, టీటీడీ పేరును అనధికారికంగా వినియోగిస్తూ నకిలీ వెబ్సైట్లు రూపొందించి భక్తులను తప్పుదారి పట్టిస్తున్నట్టు గుర్తించారు. గూగుల్ సెర్చ్లలో ఈ ఫేక్ వెబ్సైట్లు కనిపిస్తూ, భక్తుల నుంచి ఆన్లైన్ పేమెంట్ల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నట్టు తేలింది.
ఈ నేపథ్యంలో నకిలీ వెబ్సైట్లపై చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు టీటీడీ ఐటీ విభాగం ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే టీటీడీ చిహ్నాలు, ఆలయ చిత్రాలను అనధికారికంగా ఉపయోగిస్తున్న వెబ్సైట్లపై కాపీరైట్ చట్టం కింద కేసులు నమోదు చేశారు.
దర్శనం, వసతి గదులు, సేవా టికెట్లను టీటీడీ అధికారిక వెబ్సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారానే మాత్రమే బుకింగ్ చేసుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. భక్తులు మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వెబ్సైట్లు, ఫోన్ కాల్స్ను వెంటనే టీటీడీ దృష్టికి తీసుకురావాలని కోరింది.
{{/usCountry}}దర్శనం, వసతి గదులు, సేవా టికెట్లను టీటీడీ అధికారిక వెబ్సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారానే మాత్రమే బుకింగ్ చేసుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. భక్తులు మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వెబ్సైట్లు, ఫోన్ కాల్స్ను వెంటనే టీటీడీ దృష్టికి తీసుకురావాలని కోరింది.
{{/usCountry}}