సెప్టెంబర్ 15 నుండి 23వ తేది వరకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ 9 రోజుల పాటు ఆర్జిత సేవలైన అష్టదళ పాదపద్మారాధన సేవ, తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలు టీటీడీ రద్దు చేసింది. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ, దాతల దర్శనాలను కూడా రద్దు చేశారు. ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేసింది.
ఆగస్టు 17 నుంచి 19 వరకు టీటీడీలో వస్త్రాల ఈ-వేలం

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను ఆగస్టు 17 నుంచి 19 వరకు ఈ-వేలం ద్వారా వేలం వేయనున్నారు. ఈ వేలంలో 177 లాట్లలో కొత్తవి, ఉపయోగించినవి, పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు అందుబాటులో ఉంటాయి. టర్కీ టవళ్లు, ఆర్డినరీ టవళ్లు, లుంగీలు, శాలువాలు, బెడ్షీట్లు, దిండుకవర్లు, న్యాప్కిన్లు, హ్యాండ్కర్చీఫ్లు, పిల్లో కవర్లు, బ్లౌజ్పీస్లు, దుపట్టాలు, పరదాలు, హుండీ గలీబులు, ఈర్వాడాలు తదితర వస్త్రాలను ఈ-వేలంలో విక్రయిస్తారు.
వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయం(వేలములు) 0877-2264429ను సంప్రదించవచ్చు. అలాగే www.konugolu.ap.gov.in మరియు www.tirumala.org వెబ్సైట్లలో వివరాలు తెలుసుకోవచ్చు.
తిరుపతి, 2026 ఆగస్టు 04: టీటీడీ ఆధ్వర్యంలోని కార్వేటినగరం శ్రీ రుక్మిణీ–సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో ఆగస్టు 25 నుంచి 27వ తేదీ వరకు భక్తి పారవశ్యాన్ని పంచే శ్రీ స్వామివారి తెప్పోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు.
వేణుగోపాలస్వామివారి దివ్య తెప్పోత్సవాలు
తెప్పోత్సవాల్లో భాగంగా ఆగస్టు 25న శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు, ఆగస్టు 26, 27 తేదీల్లో శ్రీ రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారు రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు పుష్కరిణిలో అలంకరించిన తెప్పపై విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు. మూడు రోజుల పాటు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం, సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక ప్రసంగాలు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించి భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తనున్నారు. ఈ దివ్యోత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ వేణుగోపాలస్వామివారి కృపకు పాత్రులు కావాలని టీటీడీ ఆహ్వానిస్తోంది.
{{/usCountry}}ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక ప్రసంగాలు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించి భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తనున్నారు. ఈ దివ్యోత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ వేణుగోపాలస్వామివారి కృపకు పాత్రులు కావాలని టీటీడీ ఆహ్వానిస్తోంది.
{{/usCountry}}