టీటీడీ : తిరుపతిలో మూడు రోజులు సర్వదర్శన టోకెన్ల జారీ నిలిపివేత

తిరుమలలో రథ సప్తమి వేడుకలకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. రథసప్తమి సందర్భంగా తిరుపతిలో మూడు రోజులు సర్వదర్శన టోకెన్లు జారీ నిలిపివేయనున్నారు.

Published on: Jan 22, 2026, 12:34:03 IST
By , Tirupati
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రథ సప్తమి సందర్భంగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి అంటే జనవరి 23వ తేదీ నుంచి తిరుపతిలో మూడు రోజుల పాటు సర్వ దర్శన టోకెన్ల జారీని నిలిపివేసింది. ఈ టోకెన్లు జారీచేసే మూడు ప్రాంతాల్లో నిలిపివేయాలని నిర్ణయించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. దీనిప్రకారం.. తిరుపతిలోని మూడు కేంద్రాల్లో మరుసటి రోజు దర్శనాలకు జారీ చేసే సర్వదర్శనం టోకెన్లు జనవరి 23, 24, 25వ తేదీల్లో జారీ చేయరు.

తిరుమల
తిరుమల

మరోవైపు ఈ నెల 23వ తేదీ దర్శనానికి సంబంధించి టోకెన్లను గురవారం జారీ చేస్తారు. మళ్లీ రథ సప్తమి ముగిసిన తర్వాత 26వ తేదీ నుంచి మరుసటి రోజు సర్వదర్శన టోకెన్లు ఇస్తారు. ఈ మేరకు టీటీడీ భక్తులకు తెలిపింది. సూచిక బోర్డులను కూడా ఏర్పాటు చేసింది.

జనవరి 25వ తేదీన రథ సప్తమి కోసం టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాద‌శిని విజ‌య‌వంతం చేసిన స్ఫూర్తితో జ‌న‌వ‌రి 25వ తేదిన జ‌ర‌గ‌నున్న ర‌థ స‌ప్తమిని కూడా వైభ‌వంగా నిర్వహించాల‌ని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారుల‌ను ఆదేశించారు.

రథ సప్తమికి ఏర్పాట్లు

ర‌థ స‌ప్తమి రోజున శ్రీ‌వారి ఆల‌య నాలుగు మాడ వీధులు, క్యూలైన్లు, బ‌య‌ట ప్రాంతాల్లో నిరంత‌రాయంగా భ‌క్తుల‌కు అన్న ప్రసాదాలు అందించేందుకు ఏర్పాట్లు చేయాల‌ని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. భ‌ద్రత‌కు పెద్ద పీట వేయాల‌ని, టీటీడీ భ‌ద్రత విభాగం, జిల్లా పోలీసు యంత్రాంగం స‌మ‌న్వంయంతో ప‌టిష్టమైన భ‌ద్రతా ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు.

అధికారులు, సిబ్బంది, శ్రీ‌వారి సేవ‌కుల‌తో క‌లిసి క్రమ‌శిక్షణ‌తో భ‌క్తుల‌కు ఇబ్బంది లేకుండా సేవ‌లు అందించాలని అనిల్ సింఘాల్ అన్నారు. ర‌థ స‌ప్తమి రోజున భ‌క్తుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా అద‌నంగా 5 ల‌క్షల ల‌డ్డూల‌ను బ‌ఫ‌ర్ స్టాక్‌గా నిల్వ ఉంచుకోవాలన్నారు. పార్కింగ్‌కు ఇబ్బంది లేకుండా అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ట్రాఫిక్ అంత‌రాయం లేకుండా ముంద‌స్తు చ‌ర్యలు తీసుకోవాలన్నారు.. పోలీసులు, టీటీడీ భ‌ద్రత సిబ్బంది స‌మ‌న్వయంతో మాక్ డ్రిల్ నిర్వహించాలని ఈవో సింఘాల్ తెలిపారు.

రథ సప్తమి వేళ వాహ‌న సేవ‌లు

  • తెల్లవారుజామున‌ 5.30 నుంచి 8 గంటల వరకు (సూర్యోద‌యం ఉద‌యం 6.45 గంట‌ల‌కు) – సూర్యప్రభ వాహనం.
  • ఉదయం 9 నుంచి 10 గంటల వరకు – చిన్నశేష వాహనం.
  • ఉదయం 11 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు – గరుడ వాహనం.
  • మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు – హనుమంత వాహనం.
  • మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు – చక్రస్నానం.
  • సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు – కల్పవృక్ష వాహనం.
  • సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహనం.
  • రాత్రి 8 నుంచి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనం.

ఈ సేవలు రద్దు

మరోవైపు రథ సప్తమి వేళ కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దు చేశారు. ఎన్ఆర్ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాల ఉండవు. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు అయ్యాయి. బ్రేక్ దర్శనాలకు సంబంధించి జ‌న‌వ‌రి 24న‌ ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించరు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More