తిరుమల శ్రీవారి భక్తులకు కీలక అప్డేట్ వచ్చేసింది. శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి 2026 జనవరి 8వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. ఈ మేరకు టీటీడీ ఆలయ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఇందుకోసం ఆఫ్లైన్, ఆన్ లైన్ టోకెన్ల జారీ విధి విధానాలు త్వరలో తెలియజేస్తామన్నారు.

శనివారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ ఈవో…. 17 మంది భక్తులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. శ్రీవారి భక్తుల విజ్ఞప్తి మేరకు అంగప్రదక్షిణ టోకెన్ల జారీని డిప్ విధానం నుంచి మార్చినట్లు వివరించారు. ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఆన్లైన్ కోటా విడుదల చేయనున్నట్లు తెలిపారు.
తిరుపతిలో రోజుకు 20 వేల సర్వదర్శనం టోకెన్లు అందుబాటులో ఉంటాయని ఈవో తెలిపారు. ఆన్ లైన్ లో కోటా పెంచడం వీలు పడదని ఓ భక్తుడు అడిగిన ప్రశ్నకు ఈవో జవాబునిచ్చారు. 2023లో ఇంజినీరింగ్ విభాగంలో ఉద్యోగాలకు నియామాకాలపై స్పందించిన ఈవో… 15 రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామని క్లారిటీ ఇచ్చారు.
ఎస్ఎస్ డి టోకెన్ల జారీ సమయం మార్పుపై కమిటీ పరిశీలిస్తుందని ఈవో సింఘాల్ వివరించారు. హోమం టికెట్లు మొత్తం కుటుంబానికి కేటాయించే విషయం పరిశీలిస్తామన్నారు. విఐపి లకు కేటాయించే దర్శన సమయం తక్కువ, సామాన్య భక్తులకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నామని మరో ప్రశ్నకు జవాబునిచ్చారు. శ్రీవారి సేవకురాలిగా కాల్ సెంటర్ లో సేవలు అందించేందుకు త్వరలో విధివిధానాలు రూపొందిస్తున్నామని చెప్పారు.
రాష్ట్రంలోని వెనకబడిన ప్రాంతాల్లో రూ.750 కోట్ల శ్రీవాణి ట్రస్టు నిధులతో 5 వేల భజన మందిరాలు నిర్మిస్తామని ఈవో తెలిపారు.టీటీడీ ఆలయాల్లోని ఆయా ప్రాంతాల్లో భక్తుల రద్దీకి తగ్గట్లుగా అన్నప్రసాదాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
{{/usCountry}}రాష్ట్రంలోని వెనకబడిన ప్రాంతాల్లో రూ.750 కోట్ల శ్రీవాణి ట్రస్టు నిధులతో 5 వేల భజన మందిరాలు నిర్మిస్తామని ఈవో తెలిపారు.టీటీడీ ఆలయాల్లోని ఆయా ప్రాంతాల్లో భక్తుల రద్దీకి తగ్గట్లుగా అన్నప్రసాదాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
{{/usCountry}}