ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల నెరవేరే సమయం ఆసన్నమైంది. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పనులను పూర్తి చేసి, ఆగస్టు 31న ప్రాజెక్టును ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రావడం ద్వారా ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప, మార్కాపురం జిల్లాల్లోని లక్షల ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా లక్షలాది మందికి తాగునీటి ఎద్దడి తీరనుంది.

వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు మూడో విడత పరిహారం కింద రూ.250 కోట్లను సీఎం చంద్రబాబు తన క్యాంప్ కార్యాలయంలో శనివారం అందజేశారు. 1996లో తానే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశానని, 30 ఏళ్ల స్వప్నం ఇప్పుడు సాకారమవుతోందని సీఎం ఆనందం వ్యక్తం చేశారు. గత రెండేళ్లలో ఫేజ్-1 కోసం రూ.2,250 కోట్లు వెచ్చించి పనులను శరవేగంగా పూర్తి చేసినట్లు వెల్లడించారు.
దివంగత ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు శంకుస్థాపన చేసిన పలు ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రారంభించే అదృష్టం తనకు దక్కడం ఎంతో సంతోషాన్నిస్తోందని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం వల్ల 50 శాతం వర్షపాతం లోటు నమోదైందని, దీనివల్ల శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో నీటి లభ్యత తగ్గి తీవ్ర కొరత ఏర్పడిందని సీఎం పేర్కొన్నారు. అందుకే ఉన్న నీటిని అత్యంత జాగ్రత్తగా, పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కృష్ణా డెల్టా, శ్రీశైలం, రాయలసీమ ప్రాంతాలకు సమృద్ధిగా నీరు అందుతుందన్నారు చంద్రబాబు. గంగ, గోదావరి, కావేరి నదుల అనుసంధానం ద్వారా నాలుగు రాష్ట్రాల్లో ఉన్న నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని నొక్కి చెప్పారు.
రాయలసీమ ప్రాంతాన్ని ఉద్యానవన హబ్గా మార్చేందుకు సెప్టెంబర్లో రాయలసీమ హార్టికల్చర్ హబ్కు శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. త్వరలోనే రామాయపట్నం పోర్టు ద్వారా స్థానిక రైతులు తమ పంట ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసుకునే గొప్ప అవకాశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
{{/usCountry}}రాయలసీమ ప్రాంతాన్ని ఉద్యానవన హబ్గా మార్చేందుకు సెప్టెంబర్లో రాయలసీమ హార్టికల్చర్ హబ్కు శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. త్వరలోనే రామాయపట్నం పోర్టు ద్వారా స్థానిక రైతులు తమ పంట ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసుకునే గొప్ప అవకాశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
{{/usCountry}}900 కోట్ల పరిహారంలో జగన్ ప్రభుత్వం పైసా కూడా చెల్లించలేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. నిర్వాసితులను మోసం చేసిన ఘనత జగన్కు దక్కుతుందన్నారు. ప్రాజెక్టు పనులే కాదని, సంక్షేమానికి ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మెుత్తం 7 నిర్వాసిత కాలనీల్లో 4 కాలనీల్లో 100 శాతం మౌలిక వసతులు పూర్తయ్యాయన్నారు.
'40 రోజుల్లో మూడు విడతలుగా రూ.768 కోట్లు నిర్వాసితుల ఖాతాల్లో వేశాం. వెలిగొండ ప్రాజెక్ట్ అందుబాటులోకి రావడంతోపాటు దీనికోసం భూములు ఇచ్చిన, ఆస్తులు కోల్పోయినవారికి న్యాయం చేయడానికి సమ ప్రాధాన్యం ఇచ్చాం.' అని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు.