వియత్నాం బోటు ప్రమాదంలో మరణించిన ఆంధ్రప్రదేశ్ పర్యాటకుల భౌతికకాయాలను స్వదేశానికి తీసుకువచ్చే ప్రక్రియ వేగవంతమైంది. ఈ ఘోర ప్రమాదంలో గాయపడిన పర్యాటకుడు గెల్లా కిషోర్ ప్రస్తుతం వియత్నాంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆయన ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోందని న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడిన తెలుగు పర్యాటకులు ఆదివారం (జూలై 12, 2026) రాత్రికల్లా భారతదేశానికి చేరుకోనున్నారు. ఫు క్వాక్ ద్వీపంలో చిక్కుకుపోయిన పర్యాటకులందరూ ఇప్పటికే హనోయిలోని నోయి బాయి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరంతా స్థానిక సమయం ప్రకారం రాత్రి 7.05 గంటలకు వియత్నాం ఎయిర్లైన్స్ విమానంలో బయలుదేరి, భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో హైదరాబాద్ చేరుకుంటారని అధికారులు వెల్లడించారు. బాధితుల ప్రయాణానికి సంబంధించిన విమాన టిక్కెట్లను సదరు మొబైల్ సేవా సంస్థ సమకూర్చింది.
ఈ ప్రమాదంలో మరణించిన 15 మంది భారతీయ పర్యాటకుల భౌతికకాయాలను హో చి మిన్ సిటీకి తరలిస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి మృతదేహాలు అక్కడికి చేరుకుంటాయి. వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం (ఎంబసీ) భౌతికకాయాల తరలింపు ప్రక్రియను పర్యవేక్షించడానికి ఒక అథరైజ్డ్ ఏజెన్సీ ఖరారు చేసింది.
భౌతికకాయాలను భారతదేశానికి తరలించేందుకు అవసరమైన అధికారిక పత్రాలు, అనుమతుల కోసం ఈ సంస్థ బాధిత కుటుంబాలను సంప్రదించనుంది. హో చి మిన్ సిటీలో అన్ని ఫార్మాలిటీస్ పూర్తికాగానే, మృతదేహాలను వారి స్వగ్రామాలకు చేర్చడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.
వియత్నాంలోని భారత రాయబార కార్యాలయంతో ఏపీ భవన్ అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. బాధితులందరూ సురక్షితంగా స్వదేశానికి చేరుకునే వరకు, మృతదేహాల తరలింపు ప్రక్రియ ముగిసే వరకు బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని అధికారులు స్పష్టం చేశారు. భారత విదేశాంగ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, న్యూఢిల్లీలోని ఏపీ భవన్ సంయుక్తంగా బాధితులకు సేవలను అందిస్తున్నాయి.
{{/usCountry}}వియత్నాంలోని భారత రాయబార కార్యాలయంతో ఏపీ భవన్ అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. బాధితులందరూ సురక్షితంగా స్వదేశానికి చేరుకునే వరకు, మృతదేహాల తరలింపు ప్రక్రియ ముగిసే వరకు బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని అధికారులు స్పష్టం చేశారు. భారత విదేశాంగ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, న్యూఢిల్లీలోని ఏపీ భవన్ సంయుక్తంగా బాధితులకు సేవలను అందిస్తున్నాయి.
{{/usCountry}}ఓ మొబైల్ కంపెనీ భారత్ నుంచి తమ డిస్ట్రిబ్యూటర్లను కుటుంబాలను వియత్నాం ట్రిప్కు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఎంపిక చేసిన వారిలో ఏపీ, తెలంగాణ నుంచి కూడా పలువురు ఉన్నారు. ట్రిప్లో భాగంగా వీరు మూడు పడవల్లో సముద్రంలో విహార యాత్రకు వెళ్లారు. చనిపోయినవారిలో పలువురు తెలుగు వారు ఉన్నారు.