విజయవాడ కనక దుర్గమ్మ గుడికి వచ్చే భక్తులకు అలర్ట్. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఘాట్ రోడ్డును మే 28వ తేదీ (గురువారం) నుంచి పూర్తిగా మూసివేస్తున్నట్లు ఆలయ ఈఓ వి.కె. సీనా నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఘాట్ రోడ్డులో అత్యవసర మరమ్మతు పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో ఈ ఘాట్ రోడ్డు మరమ్మతు పనులు జరగనున్నాయి. ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వచ్చే 15 రోజుల పాటు ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఈఓ స్పష్టం చేశారు. అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఘాట్ రోడ్డు మూసివేసిన నేపథ్యంలో భక్తులు ఇంద్రకీలాద్రి పైకి చేరుకోవడానికి శ్రీ కనకదుర్గ నగర్ వైపు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అనుమతించనున్నారు.
ఘాట్ రోడ్డులో ఉన్న ప్రస్తుత ప్రోటోకాల్ కార్యాలయాన్ని తక్షణమే కొండ దిగువన కొత్తగా నిర్మించిన శ్రీ కనకదుర్గ నగర్ భవనంలోకి మారుస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ఈ కొత్త ప్రోటోకాల్ ఆఫీస్ నుండి దేవస్థానం ఉచిత బ్యాటరీ వాహనాలను నడపనుంది.
భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి, తోపులాటలు జరగకుండా ప్రోటోకాల్ ఆఫీస్ నుండి మహా మండపం వరకు అదనపు సిబ్బందిని, సెక్యూరిటీ గార్డులను నియమించారు. ప్రోటోకాల్ భక్తుల కోసం మహా మండపం వద్ద ప్రత్యేక దర్శన పాయింట్ను ఏర్పాటు చేశారు. అలాగే నిత్య పూజలు, సేవలకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఘాట్ రోడ్డు మూసివేత, ప్రత్యామ్నాయ మార్గాలపై భక్తులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు ఆలయ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ (మైకుల) ద్వారా నిరంతరం అనౌన్స్మెంట్స్ చేయనున్నారు.
{{/usCountry}}ఘాట్ రోడ్డు మూసివేత, ప్రత్యామ్నాయ మార్గాలపై భక్తులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు ఆలయ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ (మైకుల) ద్వారా నిరంతరం అనౌన్స్మెంట్స్ చేయనున్నారు.
{{/usCountry}}భక్తుల వాహనాల కోసం మున్సిపల్ ఆఫీస్ ప్రాంగణంలో ప్రత్యామ్నాయ పార్కింగ్ సౌకర్యం కల్పించారు. సీతమ్మవారి పాదాలు, కుమ్మరిపాలెం సెంటర్, పున్నమి ఘాట్ల నుండి భక్తులను ఆలయానికి చేరవేసేందుకు దుర్గగుడి ఉచిత బస్సులు నిరంతరాయంగా నడుస్తాయి.
ఇంద్రకీలాద్రిపై ఉన్న లిఫ్ట్ సౌకర్యాన్ని కేవలం వృద్ధులు, దివ్యాంగులు, పసిపిల్లలతో ఉన్న తల్లులకు మాత్రమే పరిమితం చేస్తున్నట్లు ఈఓ సీనా నాయక్ స్పష్టం చేశారు. మిగిలిన సాధారణ భక్తులందరూ మహా మండపం మెట్ల మార్గం ద్వారానే కొండపైకి వెళ్లాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు.