విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం.. సెలవు దినాల్లోనూ క్యాష్ కౌంటర్లు

Tax Collection : విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. సెలవు దినాల్లోనూ క్యాష్ కౌంటర్లు పనిచేయనున్నాయి.

Updated on: Mar 19, 2026, 19:40:57 IST
By , Vijayawada
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పన్ను చెల్లింపులను సులభతరం చేసేందుకు సిటిజన్ ఇన్షియేటివ్‌లో భాగంగా నగరవ్యాప్తంగా సెలవు దినాల్లో కూడా పన్ను వసూలు చేసే నగదు కౌంటర్లు పనిచేస్తాయని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్(వీఎంసీ) కమిషనర్ హెచ్.ఎం. ధ్యానచంద్ర ప్రకటించారు. ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీలో 50 శాతం మాఫీని అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ఈ చర్య మెుదలుపెట్టారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

విజయవాడ నివాసితులు ఈ ప్రయోజనాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా, వీఎంసీ పనివేళలను పొడిగించడంతో పాటు, పలు ప్రదేశాలలో చెల్లింపు సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూసింది.

కమిషనర్ ప్రకారం, నగర పరిధిలోని కీలక కేంద్రాలలో అన్ని సెలవు దినాలలో ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నగదు కౌంటర్లు పనిచేస్తాయి. వీటిలో చిట్టినగర్ కలరా ఆసుపత్రి, హెచ్‌బీ కాలనీ, వీఎంసీ ప్రధాన కార్యాలయం, సత్యనారాయణపురంలోని ఏకేటీపీ పాఠశాల, సింగ్‌నగర్ రైతు బజార్, పైకాపురంలోని అప్నా బజార్, ఇఎస్ఐ ఆసుపత్రి సమీపంలోని పటమట సర్కిల్ కార్యాలయం, పటమటలోని బీవీఆర్ కాంప్లెక్స్, సాయిబాబా ఆలయ ప్రాంగణం, కృష్ణలంకలోని ఏపీఎస్ఆర్ఎం పాఠశాల ఉన్నాయి.

ముఖ్యంగా కొనసాగుతున్న డిస్కౌంట్ పథకం దృష్ట్యా, పన్ను చెల్లింపుదారులకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించడానికి, చివరి నిమిషంలో తొందరపాటును నివారించడానికి పని గంటలను, అదనపు పనిదినాలను కేటాయించినట్లు అధికారులు తెలిపారు. వడ్డీ మాఫీని పొందేందుకు, పౌరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, నిర్దేశించిన సమయంలోగా తమ బకాయి ఉన్న ఆస్తి పన్నులను చెల్లించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More