ఉమ్మడి విజయనగరం జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ జిల్లా అధ్యక్షుడు, విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

మజ్జి శ్రీనివాసరావుతో పాటు ఆయన కుమార్తె సిరి సహస్ర కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు. సీఎం చంద్రబాబు నాయుడు వారికి పార్టీ పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. విజయనగరం జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న చిన్న శ్రీను రాకతో ఉత్తరాంధ్రలో టీడీపీ మరింత బలపడనుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
వైసీపీ ఆవిర్భావం నుంచి జిల్లాలో ఆ పార్టీ బలోపేతానికి మజ్జి శ్రీనివాసరావు కీలక భూమిక పోషించారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు మేనల్లుడు అయిన శ్రీను… జిల్లా వ్యాప్తంగా బలమైన నాయకత్వ నెట్వర్క్ను కలిగి ఉన్నారు. గత కొంతకాలంగా వైసీపీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న ఆయన… తన అనుచరులతో చర్చించిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
ఈ చేరిక ద్వారా విజయనగరం జిల్లా పరిషత్పై కూడా స్పష్టమైన రాజకీయ ప్రభావం పడనుంది. చిన్న శ్రీనుతో పాటు పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వైసీపీ కీలక నాయకులు కూడా త్వరలోనే పసుపు కండువా కప్పుకోవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఉత్తరాంధ్రలో వైసీపీకి అనుకూలంగా ఉన్న విజయనగరంలో ఈ పరిణామం ఆ పార్టీ ఉనికికి పెద్ద దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రజాసంక్షేమం, జిల్లా సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడానికి తాను టీడీపీలో చేరినట్లు చిన్న శ్రీను సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. రాబోయే రోజుల్లో విజయనగరం జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు.
పార్టీకి రాజీనామా లేఖ…
{{/usCountry}}ప్రజాసంక్షేమం, జిల్లా సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడానికి తాను టీడీపీలో చేరినట్లు చిన్న శ్రీను సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. రాబోయే రోజుల్లో విజయనగరం జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు.
పార్టీకి రాజీనామా లేఖ…
{{/usCountry}}అంతకుముందు వైసీపీకి, పదవులకు చిన్న శ్రీను రాజీనామా చేశారు. వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, విజయనగరం జిల్లా అధ్యక్ష పదవికి, భీమిలి నియోజకవర్గం ఇంఛార్జి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నానని తెలుపుతూ…. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖను పంపించారు.
మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ వీరి చేరిక చర్చనీయాంశంగా మారింది. అయితే రాబోయే రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి.