అమరావతికి చట్టపరమైన హోదా కల్పించే బిల్లు కోరాం : లావు శ్రీకృష్ణ దేవరాయలు
అమరావతికి చట్టపరమైన హోదాపై పార్లమెంటులో బిల్లు తేవాలని కోరినట్టుగా లావు శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు. ఏపీకి చెందిన పలు అంశాలపై చర్చించాలని కోరినట్టుగా వెల్లడించారు.
కేంద్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఆ తర్వాత మీడియాతో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడారు. టీడీపీ మూడు జాతీయ సమస్యలు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పలు అంశాలను పార్లమెంటులో చర్చించాలని కోరామన్నారు. అమరావతికి చట్టపరమైన హోదా ఇవ్వాలని, ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి చట్టపరమైన మద్దతు ఇవ్వడానికి ఒక బిల్లు అవసరం కావచ్చు అని అన్నారు.

భారత ఎఫ్టీఏలు(స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు), 16 ఏళ్లలోపు విద్యార్థుల కోసం సోషల్ మీడియా నిబంధనలు, అమరావతి రాజధాని బిల్లు వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. 'మూడు జాతీయ సమస్యలు, ఏపీకి సంబంధించి పలు అంశాలపై చర్చించాలని కోరాం. భారత్-యూరోపియన్ యూనియన్ ఎఫ్టీఏతో సహా భారత్ సంతకం చేసిన ఎఫ్టీఏలకు సంబంధించిన మొదటి జాతీయ సమస్య. మరో సమస్య 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధం. ఆస్ట్రేలియా చేయగలిగితే భారత్ ఎందుకు చేయలేదు? మేం చర్చించాలని చెప్పిన ప్రధాన రాష్ట్ర సమస్య అమరావతి రాజధాని బిల్లు సమస్య.' అని లావు శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు.
ప్రధాని, ముఖ్యమంత్రి సహా కీలక నేతలు 30 రోజులపాటు జైలులో ఉంటే పదవిని కోల్పోయే.. బిల్లుపై చర్చించాలని కోరామన్నారు లావు శ్రీకృష్ణ దేవరాయలు. పూర్వోదయ పథకం కింద వీలైనన్ని ఎక్కువ నిధులు ఇవ్వాలని కోరామన్నారు. నదుల అనుసంధానికి సహకరించాలని విజ్ఞప్తి చేశామన్నారు.
జనవరి 28 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగనున్న బడ్జెట్ సమావేశాలకు ముందు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాజ్ నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా, కాంగ్రెస్ నేతలు జైరాం రమేష్, ప్రమోద్ తివారీ, ఏఐటీసీ నేత శతాబ్ది రాయ్, ఎంఎన్ఎం వ్యవస్థాపకుడు కమల్ హాసన్, తమిళ మనీలా కాంగ్రెస్ నేత జీకే వాసన్, ఎస్పీ నేత రాంగోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
పార్లమెంట్ ప్రధాన కమిటీ గదిలో జరిగిన ఈ సమావేశంలో రాబోయే బడ్జెట్ సమావేశాల ఎజెండాను వివరించారు. బడ్జెట్ సమావేశాలు జనవరి 28 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగనున్నాయి. మొదటి దశ జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు, రెండో దశ మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగనుంది. బడ్జెట్ సమావేశాల్లో 30 సిట్టింగ్లు ఉంటాయి. 2026-27 కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1న సమర్పిస్తారు. బుధవారం లోక్సభ, రాజ్యసభ సంయుక్త సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


