వాతావరణ శాఖ నుంచి బిగ్ అప్డేట్.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి వాతావరణ శాఖ అప్డేట్ ఇచ్చింది. ఏపీ, తెలంగాణలో వర్షాలు కురవనున్నాయని హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రాబోయే మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రాబోయే రోజుల్లో నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రం, బంగాళాఖాతం, లక్షద్వీప్ ప్రాంతంలోని కొన్ని భాగాలలోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. నైరుతి బంగాళాఖాతం, తమిళనాడు తీరంపై సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఒక స్థిరమైన ఉపరితల వాయు ప్రసరణ వ్యవస్థ విస్తరించి ఉండటం వల్ల, ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో రాబోయే మూడు రోజుల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం కూడా ఉంది. గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీయవచ్చు.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే అంచనా వేసింది వాతావరణ శాఖ. అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉంది. రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా మారే అవకాశం లేనప్పటికీ 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు రెండు వారాల పాటు కొనసాగిన తీవ్రమైన ఎండల తర్వాత ఆదివారం నుండి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడతాయని భారత వాతావరణ శాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపాయి.
శుక్రవారం నాడు 10 జిల్లాల్లోని 51 మండలాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలోని కొమ్మిపాడు వద్ద అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాతి స్థానాల్లో తూర్పు గోదావరి జిల్లాలోని దేవరపల్లి వద్ద 44.6 డిగ్రీలు, పార్వతీపురం మన్యం జిల్లాలోని భామిని, విజయనగరం జిల్లాలోని రాజం వద్ద 43.9 డిగ్రీలు, నెల్లూరు జిల్లాలోని కరేడు, తిరుపతి జిల్లాలోని వెంకటగిరి వద్ద 43.8 డిగ్రీలు; అలాగే శ్రీకాకుళం జిల్లాలోని లక్ష్మీనరసుపేట వద్ద 43 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు, చుట్టుపక్కల ప్రాంతాలకు మరింతగా విస్తరించే అవకాశం ఉంది. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40–50 కి.మీ వేగంతో వీచే ఈదురు గాలులతో కూడిన అక్కడక్కడా చిరుజల్లులు కురిసే అవకాశం ఇంకా ఉంది. తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతాయని అంచనా. అయితే తెలంగాణలోని ఉత్తర, తూర్పు జిల్లాల్లో వడగాలుల ప్రభావం ఉండవచ్చు.
నైరుతీ రుతుపవనాలు.. లక్షద్వీప్, ఆగ్నేయ, నైరుతీ అరేబియా సముద్రం, నైరుతీ, తూర్పు, మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతంలోని మిగతా ప్రాంతాలకు, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు వచ్చే రెండు, మూడు రోజుల్లో విస్తరించడానికి అనుకూలమైన అవకాశాలు ఉన్నాయని ఐఎండీ పేర్కొంది. కేరళను మే 31 లేదా జూన్ 1న తాకవచ్చని చెబుతున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


