అమెరికాలో ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఓ రోడ్డు ప్రమాదంలో రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంపతులు మృతి చెందారు. వాషింగ్టన్లో జరిగిన కారు ప్రమాదంలో కొటికలపూడి కృష్ణ కిశోర్ (45), ఆశ (40) ప్రాణాలు కోల్పోయారు. వారి కుమారుడు, కుమార్తె తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.

కృష్ణ కిశోర్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా చాలా ఏళ్లుగా పని చేస్తున్నారు. 10 రోజుల క్రితమే కృష్ణ కిశోర్, ఆశ పాలకొల్లు వచ్చి వెళ్లారు. ఇటీవలే దుబాయ్లో న్యూఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు. తాజాగా రోడ్డు ప్రమాదంలో కిశోర్, ఆశ దంపతులు మృతి చెందారు. దీంతో పాలకొల్లులో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇటీవలే అమెరికాలోని కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువతులు మరణించారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన మీసేవ కేంద్రం నిర్వాహకుడు నాగేశ్వరరావు కూతురు మేఘన, ముల్కనూరుకు చెందిన కడియాల కోటేశ్వరరావు కూతురు భావన మృతిచెందారు.
మేఘన, భావన మూడేళ్ల క్రితం అమెరికాకు వెళ్లారు. ఎమ్మెస్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఉద్యోగం కోసం వెతుకుతున్నారు. తాజాగా మెుత్తం 8 మంది స్నేహితులు రెండు కార్లలో కాలిఫోర్నియాలో టూర్ వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో కారు అలబామా హిల్స్ రోడ్డులో మలుపు వద్ద లోయలో పడిపోయింది. ఈ ఘటనలో మేఘన, భావన మృతి చెందారు.
మేరీల్యాండ్లో తెలుగు యువతి హత్య
మరోవైపు మేరీల్యాండ్లోని కొలంబియాలోని ఒక అపార్ట్మెంట్లో నికితా గొడిషాల అనే తెలుగు యువతి హత్యకు గురైంది. దీనిపై అమెరికా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మ ఈ హత్య కేసులో నిందితుడని పోలీసులు అనుమానిస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల తర్వాత నికితా కనిపించడం లేదు. ఈ మేరకు ఫిర్యాదు అందింది.
{{/usCountry}}మరోవైపు మేరీల్యాండ్లోని కొలంబియాలోని ఒక అపార్ట్మెంట్లో నికితా గొడిషాల అనే తెలుగు యువతి హత్యకు గురైంది. దీనిపై అమెరికా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మ ఈ హత్య కేసులో నిందితుడని పోలీసులు అనుమానిస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల తర్వాత నికితా కనిపించడం లేదు. ఈ మేరకు ఫిర్యాదు అందింది.
{{/usCountry}}దర్యాప్తు సంస్థల ప్రకారం, డిసెంబర్ 31న ఎల్లికాట్ సిటీలోని ఆమె అపార్ట్మెంట్లో తాను చివరిసారిగా నికితాను చూశానని శర్మ పోలీసులకు చెప్పాడు. జనవరి 2న భారతదేశానికి వచ్చాడు. అమెరికా పోలీసులు అపార్ట్మెంట్లో సోదాలు నిర్వహించగా నికితా మృతదేహం దొరికింది. ఆమె శరీరంపై గాయాల గుర్తులు కనిపించాయని, ఇది హత్య కేసుగా నిర్ధారించామని అధికారులు తెలిపారు. ఈ సంఘటన తర్వాత భారతదేశానికి వచ్చిన శర్మపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నికితా మూలాలు సికింద్రాబాద్లో ఉన్నట్టుగా తెలుస్తోంది.