వెనెజువెలాపై అమెరికా దాడి- ఈ రోజు స్టాక్​ మార్కెట్​ పరిస్థితేంటి? చమురు ధర పెరిగిందా?

జనవరి 5, ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jan 05, 2026 8:15 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 573 పాయింట్లు పెరిగి 85,762 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 182 పాయింట్లు వృద్ధిచెంది 26,329 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 439 పాయింట్లు పెరిగి 60,151 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..
స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..

శనివారం తెల్లవారుజామున వెనెజువెలాపై అమెరికా మెరుపు దాడి చేసి, ఆ దేశాధ్యక్షుడు నికొలస్​ మదురోను అరెస్ట్​ చేసింది. దీని ప్రభావం ప్రపంచ స్టాక్​ మార్కెట్​లపై ప్రతికూలంగా ఉంటుందని అందరు భావించారు. కానీ ఆసియా స్టాక్​ మార్కెట్​లు, గిఫ్ట్​ నిఫ్టీపై వెనెజువెలా అనిశ్చితి ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిజర్వ్​ ఉన్న వెనెజువెలాలో సంక్షోభం కారణంగా.. ముడిచమురు ధర మాత్రం స్వల్పంగా పెరిగింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 544.36 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 534.24 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 80 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50 తన కీలక రెసిస్టెన్స్​ 26,200 ని దాటింది. ప్రస్తుతం సూచీకి 226,450- 26,500 లెవల్స్​ వద్ద రెసిస్టెన్స్​ ఉంది. 26,150- 26,200 వద్ద సపోర్ట్​ ఉంది,” అని ఛాయిస్​ బ్రోకింగ్​కి చెందిన ఎగ్జిక్యూటివ్​ డైరక్టర్​ సుమిత్​ బగాడియా తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.66 శాతం వృద్ధిచెందింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.19శాతం పెరిగింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.03 శాతం డౌన్​ అయ్యింది

ఆసియా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి.

చమురు ధరలు..

వెనెజువెలాపై అమెరికా దాడులు నేపథ్యంలో ముడిచమురు ధరలు స్వల్పంగా పెరిగాయి. బ్రెంట్​ క్ రూడ్​ 17 సెంట్లు పెరిగి బ్యారెల్​కి 60.92 డాలర్లకు చేరింది.

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

జేబీఎం ఆటో- బై రూ. 666.6, స్టాప్​ లాస్​ రూ. 634, టార్గెట్​ రూ. 720

అనంత్​ రాజ్​- బై రూ. 584.05, స్టాప్​ లాస్​ రూ. 554, టార్గెట్​ రూ. 640

సీఈఎస్​సీ- బై రూ. 175.3, స్టాప్​ లాస్​ రూ. 167, టార్గెట్​ రూ. 192

ఎలెకాన్​ ఇంజినీరింగ్​ కంపెనీ- బై రూ. 501, స్టాప్​ లాస్​ రూ. 478, టార్గెట్​ రూ. 550

యూనో మిండా- బై రూ. 1321.2, స్టాప్​ లాస్​ రూ. 1260, టార్గెట్​ రూ. 1450

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)