ఇటీవలి కాలంలో ఎవరు.. ఎందుకు.. ఎలా చంపుతున్నారో అర్థంకాని పరిస్థితి. చిన్న చిన్న విషయాలకే ప్రాణాలను తీసేస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోనూ అలాంటి ఘరోమైన ఘటనే జరిగింది. కేవలం టీవీ సౌండ్ విషయంలో భార్యాభర్తల మధ్య వివాదం చెలరేగింది. ఈ ఘటనలో భర్త ప్రాణాలు పోయాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మంగళగిరిలో షేక్ అహ్మద్ అనే 27 ఏళ్ల వ్యక్తి ఏసీ మెకానిక్గా పనిచేస్తు్న్నాడు. కొన్ని నెలల కిందట క్రాంతి అనే యువతిని కులాంతర వివాహం చేసుకున్నాడు.

గురువారం రాత్రి క్రాంతి ఇంట్లో టీవీ సౌండ్ పెంచింది. మరీ అంత సౌండ్ అవసరమా.. తగ్గించు అంటూ అహ్మద్ చెప్పాడు. నన్ను టీవీ సౌండ్ తగ్గించమంటావా అంటూ క్రాంతి గట్టిగా అరిచింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో భార్యపై అహ్మద్ చేయిచేసుకున్నాడు. కాసేపు ఇద్దరి మధ్య గొడవ జరిగింది. పక్కనే ఉన్న ఉల్లిపాయలు కోసే కత్తితో భర్త అహ్మద్ను క్రాంతి పొడించింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించి అహ్మద్ చనిపోయాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విడాకులు ఇవ్వలేదని భార్యను చంపిన భర్త
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం రంగాపురంలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. దుర్గయ్య అనే వ్యక్తి 12 సంవత్సరాల కిందట సొంత అక్క కూతురు జ్యోతిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. దుర్గయ్య వ్యవసాయం చేస్తున్నాడు. పెద్దాపురంలోని ఒక రొయ్యల కంపెనీలో జ్యోతి పని చేస్తుంది. కొన్ని రోజులుగా భార్య జ్యోతిపై దుర్గయ్య అనుమానం పెచుకున్నాడు. ఇక అప్పటి నుంచి తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి.
మూడు నెల కిందట గొడవలు ఎక్కువ అయ్యాయి. గొడవలతో అలసిపోయిన జ్యోతి.. పుట్టింటికి వెళ్లిపోయింది. తనతో కలిసి ఉండాలని లేదంటే వెంటనే విడాకులు ఇవ్వాలని జ్యోతిని దుర్గయ్య బలవంతం చేస్తున్నాడు. చేసేదేమీ లేక పుట్టింటిలోనే ఉంటుంది జ్యోతి. భార్యపై దుర్గయ్య ద్వేషం పెంచుకున్నాడు. ఆమెను చంపేయాలని ప్లాన్ వేశాడు.
{{/usCountry}}మూడు నెల కిందట గొడవలు ఎక్కువ అయ్యాయి. గొడవలతో అలసిపోయిన జ్యోతి.. పుట్టింటికి వెళ్లిపోయింది. తనతో కలిసి ఉండాలని లేదంటే వెంటనే విడాకులు ఇవ్వాలని జ్యోతిని దుర్గయ్య బలవంతం చేస్తున్నాడు. చేసేదేమీ లేక పుట్టింటిలోనే ఉంటుంది జ్యోతి. భార్యపై దుర్గయ్య ద్వేషం పెంచుకున్నాడు. ఆమెను చంపేయాలని ప్లాన్ వేశాడు.
{{/usCountry}}ఇటీవల పని ముగించుకుని గ్రామానికి వచ్చిన జ్యోతిపై దుర్గయ్య దాడి చేశాడు. ఎక్కవగా రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. తనను అరెస్ట్ చేస్తారనే భయంతో దుర్గయ్య పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగానే ఉంది. బిక్కవోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.