హిందూపురం నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి జరగటాన్ని ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కార్యాలయం అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి.
ఖండించిన వైఎస్ జగన్…

హిందూపురంలో వైసీపీ ఆఫీసు మీద జరిగిన దాడిని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ తీవ్రంగా ఖండించారు. టీడీపీ నేతలు, బాలకృష్ణ అభిమానులు దాడి చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంపై జరిగిన ప్రత్యక్ష దాడిగా వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఇలాంటి అనాగరిక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని ట్వీట్ చేశారు. ఆఫీసులపై దాడులు చేయటం, ఫర్నీచర్ ధ్వంసం చేయడం, అద్దాలు పగలగొట్టడం, కార్యకర్తలపై భౌతిక దాడులను రాజకీయ పార్టీలు మొదలుపెడితే అది ప్రజాస్వామ్య పతనానికి నిదర్శనమన్నారు.
పోలీసులు ఎలాంటి చర్య తీసుకోకుండా పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించడం మరింత ఆందోళన కలిగిస్తోంది.చంద్రబాబు నాయకత్వ మద్దతుతో టీడీపీ నేతలు, రౌడీ మూకలు హింసాత్మక చర్యల ద్వారా ప్రత్యర్థులను భయపెట్టి, రాజకీయ వ్యతిరేకతను అణచి వేయాలనే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది.ప్రత్యర్థి పార్టీల ప్రాథమిక హక్కులను రక్షించలేని ప్రభుత్వానికి పాలన గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ప్రజాస్వామ్యాన్ని, రాజకీయ స్వేచ్ఛను నమ్మే ప్రతి పౌరుడిపై ఈ దాడి జరిగినట్లే’ అని వైఎస్ జగన్ తన పోస్టులో రాసుకొచ్చారు.
ప్రశ్నిస్తే ఇలా చేస్తారా..? - వైసీపీ సమన్వయకర్త దీపిక
హిందూపురం వైసీపీ సమన్వయకర్త దీపిక మాట్లాడుతూ…. “శనివారం మధ్యాహ్నం టీడీపీ గూండాలు మా పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. మా కార్యాలయాన్ని ధ్వంసం చేయడమే కాదు అందులో ఉన్న దేవుడి విగ్రహాన్ని, భక్త కనకదాస ఫోటోలు కూడా ధ్వంసం చేశారు. దేవుడనే భయం కూడా లేదు. మా పార్టీ బూత్ కమిటీ లీడర్ లోకేష్ షర్ట్ చించేశారు, పైగా అతన్ని చంపుతామని బెదిరించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గంలో ఉన్నప్పుడే ఇదంతా చేశారు. బాలకృష్ణ గారు మిమ్మల్ని ప్రశ్నిస్తే ఇలా చేస్తారా…? మీ గూండాయిజంకు, రౌడీ ఇజం కు ఎవరూ భయపడరు. మేం ప్రజా సమస్యలపై నిలదీస్తే మీరు తట్టుకోలేరా. మీ దాడులకు భయపడం, బెదరం, ఇంకా పోరాడతాం” అని స్పష్టం చేశారు.
{{/usCountry}}హిందూపురం వైసీపీ సమన్వయకర్త దీపిక మాట్లాడుతూ…. “శనివారం మధ్యాహ్నం టీడీపీ గూండాలు మా పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. మా కార్యాలయాన్ని ధ్వంసం చేయడమే కాదు అందులో ఉన్న దేవుడి విగ్రహాన్ని, భక్త కనకదాస ఫోటోలు కూడా ధ్వంసం చేశారు. దేవుడనే భయం కూడా లేదు. మా పార్టీ బూత్ కమిటీ లీడర్ లోకేష్ షర్ట్ చించేశారు, పైగా అతన్ని చంపుతామని బెదిరించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గంలో ఉన్నప్పుడే ఇదంతా చేశారు. బాలకృష్ణ గారు మిమ్మల్ని ప్రశ్నిస్తే ఇలా చేస్తారా…? మీ గూండాయిజంకు, రౌడీ ఇజం కు ఎవరూ భయపడరు. మేం ప్రజా సమస్యలపై నిలదీస్తే మీరు తట్టుకోలేరా. మీ దాడులకు భయపడం, బెదరం, ఇంకా పోరాడతాం” అని స్పష్టం చేశారు.
{{/usCountry}}శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షులు ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ… ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. మా పార్టీ ఆఫీస్ పై టీడీపీ వాళ్లు దాడి చేసి.. అద్దాలు, ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారని ఆరోపించారు. అడ్డొచ్చిన పార్టీ కార్యకర్తలను కొట్టారని చెప్పారు. టీడీపీ వాళ్లు ఎందుకు ఇంత నీచ రాజకీయాలు చేస్తున్నారు? అని ప్రశ్నించారు. కనీసం పోలీసులు పట్టించుకోకుండా వెళ్లిపోయారని ఆరోపించారు.