10 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గురువారం లోక్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ కు కోటి మందికి పైగా సంతకాలను సమర్పించారు. కోటి సంతకాల ఉద్యమాన్ని గవర్నర్కు వివరించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలను సేకరించినట్లు తెలిపారు.

వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ గత కొంతకాలంగా పోరాడుతోంది. ఇందులో భాగంగా ప్రజల నుంచి కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి సేకరణకు శ్రీకారం చుట్టింది. జగన్ ఆదేశాల మేరకు… ఈ కార్యక్రమం పూర్తికాగా సేకరించిన కాపీల వివరాలను గవర్నర్ కు అందజేశారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్…. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయాలను గవర్నర్ దృష్టికి తీసుకొచ్చామన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించితే కలిగే నష్టాలను వివరించామని తెలిపారు.అక్టోబర్ 10 నుంచి డిసెంబర్ 10 వరకు జరిగిన సంతకాల సేకరణకు అద్భుతమైన స్పందన వచ్చందన్నారు.
దేశంలోనే అతిపెద్ద కుంభకోణం - వైఎస్ జగన్
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ దేశంలో అతిపెద్ద కుంభకోణం అని వైెఎస్ ఆరోపించారు. ప్రభుత్వ నిధులతో జీతాలు చెల్లిస్తూనే వైద్య కళాశాలలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం మరో పెద్ద కుంభకోణమన్నారు.
“మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం పెద్ద స్కామ్. ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వమే జీతం చెల్లిస్తుంది.. కానీ నిర్వహణ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటుంది. ఏడాదికి రూ.వెయ్యి కోట్లు ఖర్చు పెట్టలేరా?.. ఖర్చు చేయకపోతే మెడికల్ కాలేజీలను అలానే వదిలేయండి.. మేం అధికారంలోకి వచ్చాక పూర్తిచేస్తాం. మాకు క్రెడిట్ వస్తుందేమోనని పేదలకు నష్టం చేయడం సరికాదు. సీఎం చంద్రబాబు కొత్త స్కామ్లు సృష్టిస్తున్నారు. వైజాగ్కు తలమానికంగా రిషికొండ భవనాన్ని రూ.250 కోట్లతో నిర్మించాం. చంద్రబాబు ఒక్కరోజు యోగా కార్యక్రమానికి రూ.300 కోట్లు ఖర్చు చేశారు” వైఎస్ జగన్ ఆరోపించారు.
ఇక సంతకాల సేకరణను పూర్తి చేయటంలో కీలకంగా పని చేసిన పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, కన్వీనర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్య కర్తలు, గ్రామస్థాయి కార్యకర్తలను వైఎస్ అభినందించారు. "1.4 కోట్లకు పైగా సంతకాల సేకరించటం ఓ చరిత్ర అని… ఈ సంతకాలు లోక్ భవన్ కు సమర్పించాం" అని చెప్పారు
{{/usCountry}}ఇక సంతకాల సేకరణను పూర్తి చేయటంలో కీలకంగా పని చేసిన పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, కన్వీనర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్య కర్తలు, గ్రామస్థాయి కార్యకర్తలను వైఎస్ అభినందించారు. "1.4 కోట్లకు పైగా సంతకాల సేకరించటం ఓ చరిత్ర అని… ఈ సంతకాలు లోక్ భవన్ కు సమర్పించాం" అని చెప్పారు
{{/usCountry}}2019 నుంచి 2024 మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని వైఎస్ జగన్ ఆరోపించారు. "ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అన్న వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయి. పాఠశాలలు ఆసుపత్రులను కూడా నడపలేని పరిస్థితులు ఉన్నాయి. ఫలితంగా ప్రైవేట్ దోపిడీ పెరుగుతోంది "అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల ఆందోళనలను అధికారికంగా నమోదు చేసేలా సంతకాలను కూడా కోర్టుకు సమర్పిస్తామని వైఎస్సార్ సీపీ అధినేత జగన్ తెలిపారు. 2019 నుంచి 2024 మధ్య వైసీపీ ప్రభుత్వం ఒక్కో జిల్లాలో ఒక్కొక్కటిగా… మొత్తం 17 మెడికల్ కాలేజీలను ప్రారంభించి ఏడు మెడికల్ కాలేజీలను పూర్తి చేసిందని జగన్ గుర్తు చేశారు. ప్రస్తుత ఎన్డీయే కూటమి అధికారంలోకి రాకముందే ఐదు కళాశాలల్లో ప్రవేశాలు ప్రారంభమయ్యాయని చెప్పారు.