...
...
Next Story

Aamir Khan Love Jihad: ఆమిర్ ఖాన్ మూడో పెళ్లిపై భజరంగ్ దళ్ రచ్చ.. లవ్ జిహాద్ అంటూ దిష్టిబొమ్మల దహనం

Aamir Khan Love Jihad: బాలీవుడ్ సీనియర్ నటుడు ఆమిర్ ఖాన్ పై భజరంగ్ దళ్ తీవ్రంగా మండిపడింది. ముచ్చటగా మూడోసారి మళ్లీ ఓ హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్న అతడిపై లవ్ జిహాద్ ఆరోపణలు చేస్తూ దిష్టిబొమ్మ దహనం చేశారు.

Published on: Jul 11, 2026, 10:35:32 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Aamir Khan Love Jihad: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రీసెంట్‌గా గౌరీ స్ప్రాట్‌ను పెళ్లాడిన ఆమిర్ ఖాన్ పై హిందూ సంఘాలు, ముఖ్యంగా భజరంగ్ దళ్ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ పెళ్లిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రోడ్లపైకి వచ్చి ఆమిర్ ఖాన్ దిష్టిబొమ్మను దహనం చేయడమే కాకుండా, అతనిపై 'లవ్ జిహాద్' ఆరోపణలు చేయడం బాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

హిందూ సమాజాన్ని అవమానించడమే..

Aamir Khan Love Jihad: ఆమిర్ ఖాన్ మూడో పెళ్లిపై భజరంగ్ దళ్ రచ్చ.. లవ్ జిహాద్ అంటూ దిష్టిబొమ్మల దహనం
Aamir Khan Love Jihad: ఆమిర్ ఖాన్ మూడో పెళ్లిపై భజరంగ్ దళ్ రచ్చ.. లవ్ జిహాద్ అంటూ దిష్టిబొమ్మల దహనం

కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా సింపుల్‌గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు ఆమిర్ ఖాన్. సోషల్ మీడియాలో ఈ పెళ్లి ఫొటోలు, వీడియోలు వైరల్ అయిన వెంటనే భజరంగ్ దళ్ నేతలు సీరియస్ అయ్యారు.

భజరంగ్ దళ్ లీడర్ మనోజ్ సోని ఒక అధికారిక ప్రకటన జారీ చేస్తూ.. "ఆమిర్ ఖాన్ వరుసగా హిందూ ఆడపడుచులను పెళ్లి చేసుకుంటూ ఒక లైన్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇది ముమ్మాటికీ హిందూ సమాజాన్ని అవమానించడమే" అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు.

ముస్లిం అమ్మాయిలు దొరకలేదా అంటూ వార్నింగ్

ఈ వివాదం అంతటితో ఆగలేదు. ఆమిర్ ఖాన్ తన పద్ధతి మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని మనోజ్ సోని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో మనోజ్ సోని మాట్లాడుతూ.. "ఆయనకు ముస్లిం మహిళలు ఎందుకు నచ్చరు? కేవలం హిందూ అమ్మాయిలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?" అంటూ సూటిగా ప్రశ్నించాడు. అంతేకాకుండా ఈ వ్యవహారంపై కోర్టులు, ప్రభుత్వం వెంటనే స్పందించి ఆమిర్ ఖాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.

గౌరీ స్ప్రాట్ బ్యాక్‌గ్రౌండ్.. ఆమిర్ పాత పెళ్లిళ్ల కథేంటి?

ఆమిర్ ఖాన్ వివాహ జీవితం మొదటి నుంచి వార్తల్లో ఉంటూనే ఉంది. 1986లో తన చిన్ననాటి స్నేహితురాలు రీనా దత్తాను పెళ్లాడిన ఆమిర్.. 2002లో ఆమెతో విడిపోయాడు. వీరికి జునైద్, ఐరా అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. రీసెంట్‌గానే జునైద్ 'మహారాజ్' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వగా, ఐరా పెళ్లి కూడా గ్రాండ్‌గా జరిగింది. ఆ తర్వాత 2005లో కిరణ్ రావును పెళ్లి చేసుకున్నాడు ఆమిర్. వీరికి ఆజాద్ అనే బాబు పుట్టాడు. దాదాపు 16 ఏళ్ల తర్వాత 2021లో కిరణ్ రావుతో కూడా విడిపోయిన ఆమిర్, ఇప్పుడు మూడోసారి గౌరీతో కొత్త లైఫ్ స్టార్ట్ చేశాడు.

బాక్సాఫీస్ దగ్గర ఆమిర్ నెక్స్ట్ ప్లాన్స్ ఇవే..

ప్రొఫెషనల్ లైఫ్ విషయానికి వస్తే, ఆమిర్ ఖాన్ రీసెంట్‌గా నటించిన 'సితారే జమీన్ పర్' మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. మంచి కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. యాక్టర్‌గా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనేది ఇంకా అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు.

కానీ నిర్మాతగా మాత్రం బాలీవుడ్‌లో ఒక బారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడు. సన్నీ డియోల్, ప్రీతి జింటా, కరణ్ డియోల్ లీడ్ రోల్స్‌లో 'బట్వారా 1947' అనే భారీ పాన్ ఇండియా సినిమాను నిర్మిస్తున్నాడు. లెజెండరీ డైరెక్టర్ రాజ్ కుమార్ సంతోషి డైరెక్ట్ చేస్తున్న ఈ ఎమోషనల్ పీరియాడిక్ డ్రామా, 2026 ఆగస్టు 14న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe