పవన్ కల్యాణ్ పెద్ద మనసు.. కష్టాల్లో ఉన్న సీనియర్ నటి పాకీజాకు సాయం.. ఆయన కాళ్లు మొక్కుతానంటూ..
నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెద్ద మనసు చాటుకున్నాడు. కష్టాల్లో ఉన్న సీనియర్ నటికి సాయం చేశాడు. దీంతో భావోద్వేగానికి గురైన ఆమె.. ఆయన కాళ్లు మొక్కుతానంటూ కామెంట్ చేసింది.
తెలుగు సినిమాల్లో ఒకప్పుడు పాకీజాగా పేరుగాంచిన తమిళ నటి వాసుకి. జయలలిత పిలుపు మేరకు ఆమె ఏఐఏడీఎంకేలో చేరి అధికార ప్రతినిధి స్థాయికి చేరింది. కానీ కొన్నాళ్లుగా సంపాదించిన డబ్బంతా కోల్పోయి బిచ్చమెత్తే స్థాయికి పతనమైంది. ఇప్పుడామె పరిస్థితి తెలుసుకున్న నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆమెకు సాయం చేయడం గమనార్హం.

పాకీజాకు పవన్ కల్యాణ్ సాయం
తెలుగు సినిమాల్లో పాకీజాగా పేరుగాంచిన నటి వాసుకి దుస్థితి తెలుసుకున్న పవన్ కల్యాణ్ ఆమెకు రూ. 2 లక్షల సాయం అందించాడు. మంగళవారం (జులై 1) మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఈ మొత్తాన్ని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పి. హరిప్రసాద్, పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాకీజాకు అందజేశారు.
పవన్ కల్యాణ్ చేసిన సాయానికి పాకీజా కృతజ్ఞతలు తెలిపింది. చిన్నవాడైనా ఎదురుగా ఉంటే కాళ్లు మొక్కుతానంటూ ఆమె భావోద్వేగానికి లోనయింది. తన ఆర్థిక పరిస్థితి గురించి నిన్ననే పవన్ కల్యాణ్ కార్యాలయానికి తెలియజేశాననీ, తక్షణం స్పందించి తగిన విధంగా ఆర్థిక సాయం అందించారని తెలిపింది. పవన్ కల్యాణ్ కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటానని పాకీజా చెప్పింది.
ఎవరీ పాకీజా?
పాకీజా అసలు పేరు వాసుకి. ఆమె తమిళనాడుకు చెందిన నటి. అయితే 1990ల్లో తెలుగు సినిమాలో పాకీజాగా ఆమె పేరుగాంచింది. మోహన్ బాబు నటించిన అసెంబ్లీ రౌడీ సినిమాలో పాకీజాగా వాసుకి పరిచయమైంది. ఆ తర్వాత రౌడీ గారి పెళ్లాం, మామగారు, రౌడీ ఇన్స్పెక్టర్, చిట్టెమ్మ మొగుడు, బ్రహ్మ, పెదరాయుడు, రౌడీ ఎమ్మెల్యే, అమ్మా రాజీనామా, సీతారత్నంగారి అబ్బాయి, అన్నమయ్యలాంటి సినిమాల్లో నటించింది.
ఆమె సినిమాల తర్వాత ఏఐఏడీఎంకే పార్టీలో చేరింది. అధికార ప్రతినిధి స్థాయికి చేరింది. ఆ తర్వాత రాజ్కుమార్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచే ఆమె కష్టాలు మొదలయ్యాయి. ఆ తర్వాత మెల్లగా ఆర్థికంగా కూడా చితికిపోయింది. చివరికి మందుకు బానిసై భిక్షమెత్తుకునే దుస్థితికి చేరుకుంది. అలాంటి నటికి ఇప్పుడు పవన్ కల్యాణ్ రూ.2 లక్షల సాయం అందించడం గమనార్హం.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper













