...
...
Next Story

చాలా టైమ్ వేస్ట్ చేస్తున్నాననిపిస్తోంది.. ఒక్కో సినిమాకు చాలా ఎక్కువ టైమ్ తీసుకుంటున్నాం.. కానీ తప్పడం లేదు: నిఖిల్

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ తన కెరీర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. హిందుస్థాన్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాట్లాడాడు. ఒక్కో సినిమాకు చాలా ఎక్కువ టైమ్ తీసుకుంటూ విలువైన సమయాన్ని వేస్ట్ చేస్తున్నట్లు అనిపిస్తోందని అనడం విశేషం.

Published on: Nov 27, 2025 07:21 PM IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

నటుడు నిఖిల్ సిద్ధార్థ తన మొదటి పీరియడ్ యాక్షన్ మూవీ 'స్వయంభు' షూటింగ్‌ను ఎట్టకేలకు పూర్తి చేశాడు. రెండు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఈ సినిమా షూటింగ్ అనుభవాలను అతడు 'హిందుస్థాన్ టైమ్స్‌'తో పంచుకున్నాడు. ఈ సందర్భంగా అతడు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించాడు.

స్వయంభు షూటింగ్‌పై..

చాలా టైమ్ వేస్ట్ చేస్తున్నాననిపిస్తోంది.. ఒక్కో సినిమాకు చాలా ఎక్కువ టైమ్ తీసుకుంటున్నాం.. కానీ తప్పడం లేదు: నిఖిల్
చాలా టైమ్ వేస్ట్ చేస్తున్నాననిపిస్తోంది.. ఒక్కో సినిమాకు చాలా ఎక్కువ టైమ్ తీసుకుంటున్నాం.. కానీ తప్పడం లేదు: నిఖిల్

తన నెక్ట్స్ మూవీ స్వయంభుపై అతడు స్పందించాడు. "ఈ సంవత్సరం నా సినిమా ఎందుకు విడుదల కాలేదని చాలా మంది అడుగుతున్నారు. కానీ నేను ఏదో పెద్ద దాని కోసం ఎదురు చూస్తున్నాను. ఆ పెద్ద విషయమే 'స్వయంభు'. రెండు సంవత్సరాల వ్యవధిలో 170 రోజులు ఈ సినిమా షూటింగ్ కోసం కేటాయించాం. అదే సమయంలో నేను 'కార్తికేయ 2'ని కేవలం 80 రోజుల్లో పూర్తి చేశాను" అని నిఖిల్ తెలిపాడు.

నిఖిల్ సిద్ధార్థ్ 'కృష్ణన్ రామన్' పాత్రలో..

11వ శతాబ్దంలో కృష్ణన్ రామన్ అనే చోళ యోధుడు ఉన్నాడని నిఖిల్ చెప్పాడు. ఆ సేనాపతి గురించి విన్నప్పుడు, అతని కథను తప్పకుండా చెప్పాలని అనిపించిందని నిఖిల్ పేర్కొన్నాడు.

"నేను 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' లేదా మన 'బాహుబలి' వంటి పీరియడ్ కంటెంట్‌కి పెద్ద అభిమానిని. మనం తరచుగా గ్రీక్ హీరో అకిలెస్ గురించి చర్చిస్తాం. కానీ కృష్ణన్ రామన్ వంటి భారతీయ హీరో గురించి కొద్ది మందికే తెలుసు" అని నిఖిల్ అన్నాడు.

"నేను ఈ కథ గురించి, నా పాత్ర గురించి విన్నప్పుడు చాలా నచ్చింది. అతని కథను చెప్పాల్సిందేనని అనుకున్నాను. అతను కింగ్‌మేకర్. ఆ పాత్రను పోషించడం నాకు సంతోషంగా ఉంది" అని నిఖిల్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

యుద్ధ వీరుడి పాత్రలో సవాళ్లు

"చారిత్రక కచ్చితత్వం ఉండేలా మేము జాగ్రత్తలు తీసుకున్నాము. నా పాత్రకు నేను న్యాయం చేశానని నాకు తెలుసు. నా పాత్ర సెంగోల్‌ను (రాజదండం) ఉపయోగించడం వంటి అంశాలను కూడా గౌరవంతో చూపించారు. ఫోన్లు లేని ఆ ప్రపంచంలోకి పూర్తిగా వెళ్లడానికి, నేను ఆ మైండ్ సెట్ లో ఉండి, ఆ సమయానికి సరిపోయేలా ఉండటానికి నా వంతు కృషి చేశాను" అని నిఖిల్ వివరించాడు.

అయితే అత్యంత సవాలుగా అనిపించిన అంశం ఏమిటని అడిగినప్పుడు.. అతడు నవ్వుతూ ఇలా అన్నాడు. "మూడు నెలలు జుట్టు పెంచడం. వాళ్లు నాకు విగ్గు పెట్టాలనుకున్నారు. కానీ నేను నా సొంత జుట్టుతోనే చేస్తానని పట్టుబట్టాను" అని చెప్పాడు.

'కార్తికేయ 2' విజయంతో స్వయంభు

"కథ కాగితంపై అద్భుతంగా కనిపించింది. కానీ మాకు మంచి బడ్జెట్, గ్రాఫిక్స్ అవసరం. 2021లో 'కార్తికేయ 2' విజయం తరువాత మాకు అవసరమైన బడ్జెట్ లభించింది. మొత్తం బృందం అద్భుతమైన పని చేసింది" అని నిఖిల్ అన్నాడు.

ఫిబ్రవరి 13, 2026న విడుదల కానున్న 'స్వయంభు' తర్వాత నిఖిల్ చేతిలో ఆసక్తికరమైన సినిమాలు ఉన్నాయి. "నేను 'ది ఇండియా హౌస్' 50% షూటింగ్ పూర్తి చేశాను. అది నాకు పూర్తిగా భిన్నమైన జానర్. ఆ తర్వాత 'కార్తికేయ 3' ఉంది. కాబట్టి మంచి రోజులు ముందున్నాయని ఆశిస్తున్నాను" అని నటుడు అన్నాడు.

అయితే సుదీర్ఘ షూటింగ్ షెడ్యూల్స్ కారణంగా తన కెరీర్లో బెస్ట్ ఇయర్స్ వృథా అవుతున్నాయేమోనని భయపడుతున్నట్లు నిఖిల్ నిజాయితీగా అంగీకరించాడు. "ఒకప్పుడు మేము ఆరు నెలల్లో సినిమాలను పూర్తి చేయగలిగేవాళ్లం. కానీ ఇప్పుడు అది జరగడం లేదు. ఒక నటుడిగా నా యంగ్ ఏజ్ వృథా అవుతున్నాయేమోనని నేను భయపడుతున్నాను. కానీ మీరు అంత సమయాన్ని కేటాయించకపోతే ప్రేక్షకులు సినిమాలను చూడరు. నా ప్రయత్నాలు ఫలించాలని మాత్రమే నేను కోరుకుంటున్నాను" అని నిఖిల్ ముగించాడు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe