Karishma Tanna: ఈరోజు అంటే జులై 29 గురు పౌర్ణమి పవిత్ర పర్వదినాన బాలీవుడ్ ప్రముఖ నటి కరిష్మా తన్నా ఇంట సరికొత్త వెలుగులు విరబూశాయి. తన భర్త వరుణ్ బంగేరాతో (Varun Bangera) కలసి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఈ గుడ్ న్యూస్ విన్న వెంటనే సినీ, టీవీ రంగానికి చెందిన ప్రముఖులతో పాటు ఫ్యాన్స్ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో కరిష్మా ఒక ఎమోషనల్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేశారు. ఆ పిక్లో పాపాయి చిన్న పాదాలు కనిపిస్తూ, 'హి ఈజ్ హియర్' (He's Here) అని రాసి ఉన్న ట్యాగ్ అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. "ఈ పవిత్రమైన గురు పౌర్ణమి రోజున మా జీవితంలోకి అతిపెద్ద బ్లెస్సింగ్ వచ్చింది. జులై 29, 2026న మా చిన్ని ప్రపంచంలోకి నీకు స్వాగతం" అంటూ ఆనందంతో ఒక క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. ఆమె 42 ఏళ్ల వయసులో తల్లి కావడం విశేషం.
సినీ దిగ్గజాల శుభాకాంక్షలు.. సోషల్ మీడియాలో వైరల్
కరిష్మా తన్నా దంపతులకు బాబు పుట్టాడనే వార్త తెలిసిన వెంటనే సినీ లోకం నుంచి ప్రశంసల జల్లు కురిసింది. ప్రముఖ రాజకీయ నాయకురాలు, నటి స్మృతి ఇరానీ, బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఖుషీ కపూర్, పాపులర్ కమెడియన్ కికు శార్దా, సోను సూద్, సోనాల్ చౌహాన్, వామికా గబ్బి, నేహా దూపియా లాంటి ఎందరో సెలబ్రిటీలు కామెంట్ సెక్షన్లో తమ లవ్ను తెలియజేశారు.
"మీ ఇద్దరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.. దేవుడి చల్లని చూపు మీ బాబుపై ఎప్పుడూ ఉండాలి" అంటూ స్మృతి ఇరానీ కామెంట్ చేయగా, "వావ్.. చాలా సంతోషంగా ఉంది" అని ఖుషీ కపూర్ రాసారు.
ప్రేమ వివాహం.. తుళు సాంప్రదాయంలో సీమంతం
{{/usCountry}}"మీ ఇద్దరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.. దేవుడి చల్లని చూపు మీ బాబుపై ఎప్పుడూ ఉండాలి" అంటూ స్మృతి ఇరానీ కామెంట్ చేయగా, "వావ్.. చాలా సంతోషంగా ఉంది" అని ఖుషీ కపూర్ రాసారు.
ప్రేమ వివాహం.. తుళు సాంప్రదాయంలో సీమంతం
{{/usCountry}}కరిష్మా తన్నా, బిజినెస్మ్యాన్ వరుణ్ బంగేరా 2021లో ప్రేమలో పడ్డారు. ఏడాది పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట.. 2022 ముంబైలో చాలా గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు. హల్దీ, మెహందీ వేడుకలతో పాటు గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించి సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు.
ఈ ఏడాది ఏప్రిల్లో కరిష్మా తాను గర్భవతిననే విషయాన్ని ఫ్యాన్స్తో పంచుకున్నారు. మే నెలలో తన భర్త కుటుంబ సాంప్రదాయం ప్రకారం తుళు శైలిలో చాలా డిఫరెంట్గా సీమంతం వేడుక జరుపుకున్నారు. ఆ ఫోటోలు, వీడియోలు కూడా నెట్టింట విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. "మా హృదయాలు ఆనందంతో నిండిపోయాయి" అని ఆ సమయంలో కరిష్మా ఆనందం వ్యక్తం చేశారు.
'స్కూప్' వెబ్ సిరీస్తో నేషనల్ వైడ్ క్రేజ్
టీవీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న కరిష్మా తన్నా.. ఆ తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్లపై కూడా తన మార్క్ చూపించారు. ప్రముఖ దర్శకుడు హన్సల్ మెహతా తెరకెక్కించిన 'స్కూప్' (Scoop) వెబ్ సిరీస్లో జర్నలిస్ట్ జాగృతి పాఠక్ పాత్రలో నటించి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. ఈ నెట్ఫ్లిక్స్ సిరీస్ ద్వారా ఆమె నటనకు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్ వచ్చింది.
దీనికి తోడు 2024లో అనన్య పాండే నటించిన 'కాల్ మీ బే' సిరీస్లో స్పెషల్ కేమియో రోల్లో మెరిసారు. గతంలో 'లాహోర్ కాన్ఫిడెన్షియల్' సినిమాతో పాటు పలు పాపులర్ రియాలిటీ షోలలో మెరిసిన కరిష్మా, ఇప్పుడు మదర్హుడ్ ఎంజాయ్ చేసేందుకు కొన్ని రోజులు షూటింగ్లకు విరామం ఇవ్వనున్నారు.