Nivetha Pethuraj: టాలీవుడ్లో తనదైన నటన, అందంతో గుర్తింపు తెచ్చుకున్న నటి నివేదా పేతురాజ్ తన సినీ కెరీర్కు సంబంధించి సంచలన విషయాలు వెల్లడించింది. ఒక దశలో సినిమాలు మానేద్దామని డిసైడ్ అయినట్లు పేర్కొంది. సింగ్ గీతం మూవీతో రీ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది.
నివేదా పేతురాజ్ కామెంట్లు

గ్లామర్ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యమున్న క్యారెక్టర్లు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరైంది బ్యూటీఫుల్ హీరోయిన్ నివేదా పేతురాజ్. అయితే గతంలో తాను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణను, తీసుకున్న కొన్ని నిర్ణయాలను తాజాగా ఆమె బయటపెట్టింది.
ఒకానొక దశలో చిత్ర పరిశ్రమకు పూర్తిగా గుడ్బై చెప్పాలని భావించినట్లు నివేదా సంచలన ప్రకటన చేసింది. ఆ సమయంలో మానసికంగా ఎలాంటి గందరగోళానికి గురైంది, ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది అనే విషయాలను ఆమె చాలా ఓపెన్గా మాట్లాడింది.
సినిమాలకు దూరం కావాలని
తాజాగా సింగ్ గీతం మూవీలో కీ రోల్ ప్లే చేసింది నివేదా పేతురాజ్. ఈ మూవీ సక్సెస్ మీట్ లో ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
{{/usCountry}}తాజాగా సింగ్ గీతం మూవీలో కీ రోల్ ప్లే చేసింది నివేదా పేతురాజ్. ఈ మూవీ సక్సెస్ మీట్ లో ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
{{/usCountry}}"2023 సంవత్సరంలో నేను ఒక కీలక నిర్ణయం తీసుకున్నాను. ఇకపై సినిమాలు పూర్తిగా మానేయాలని, ఇండస్ట్రీకి దూరం కావాలని డిసైడ్ అయ్యాను" అని నివేదా పేతురాజ్ ఆనాటి పరిస్థితులను గుర్తుచేసుకుంది.
తప్పుడు నిర్ణయాలు
పరిశ్రమను వదిలి వెళ్లాలనే ఆలోచనతో పాటు ఆ సమయంలో కొన్ని పొరపాట్లు కూడా చేశానని ఈ ముద్దుగుమ్మ నివేదా పేతురాజ్ అంగీకరించింది. సింగ్ గీతం మూవీతో మంచి ఛాన్స్ దొరికిందని చెప్పుకొచ్చింది.
"సినిమాలు వదిలేయాలనే ఆలోచనల నుంచి బయటకు వచ్చి, ఫైనల్గా 'సింగ్ గీతం' సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇవ్వడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. నాగ్ అశ్విన్ నాకు ఈ అవకాశం ఇవ్వకపోతే ఇప్పుడు హిమాలయాల్లో ఉండేదాన్ని" అని నివేదా పేతురాజ్ పేర్కొంది.
పెళ్లి క్యాన్సిల్
నిజానికి నివేదా పేతురాజ్ తన పెళ్లి క్యాన్సిల్ గురించే తప్పుడు నిర్ణయమంటూ పరోక్షంగా ప్రస్తావించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ భామ దుబాయ్ కు చెందిన రజిత్ ఇబ్రాన్ అనే బిజినెస్ మ్యాన్ ను లవ్ చేసింది. ఈ ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత విడిపోయారు. ఆ డిప్రెషన్ నుంచి బయటకొచ్చిన నివేదా ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తోంది.
సింగ్ గీతం మూవీలో అదరగొట్టిన నివేదా పేతురాజ్ ఇప్పుడు వెంకటేష్, చిరంజీవి సినిమాల్లో నటిస్తోంది. త్రివిక్రమ్-వెంకటేష్ కాంబినేషన్లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’తో పాటు చిరు-బాబీ మూవీలోనూ కీ రోల్స్ ప్లే చేస్తోంది నివేదా పేతురాజ్.
People Also Ask- తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: నటి నివేదా పేతురాజ్ 2023లో ఎలాంటి నిర్ణయం తీసుకుంది?
జవాబు: 2023 సంవత్సరంలో సినిమాలు పూర్తిగా మానేయాలని, యాక్టింగ్ కెరీర్కు ముగింపు పలకాలని నివేదా పేతురాజ్ నిర్ణయించుకుంది?
ప్రశ్న: నివేదా పేతురాజ్ రీఎంట్రీ ఇచ్చిన సినిమా పేరేంటి?
జవాబు: కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల బ్రేక్ తీసుకున్న నివేదా.. 'సింగ్ గీతం' అనే సరికొత్త చిత్రంతో మళ్లీ వెండితెరపైకి రీఎంట్రీ ఇచ్చింది.
ప్రశ్న: తన కెరీర్ పొరపాట్లపై నివేదా ఏమని స్పందించింది?
జవాబు: సినిమాలు మానేయాలనుకున్న సమయంలో తాను కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నానని, అయితే ఇప్పుడు 'సింగ్ గీతం' సినిమాతో తిరిగి రావడం చాలా ఆనందంగా ఉందని ఆమె పేర్కొంది.