Adivi Sesh Dacoit: గంటకు 5 వేల టికెట్లు.. నాకు అది చాలా గొప్ప.. మనసుకు నచ్చిందే చేస్తా: హిందుస్థాన్ టైమ్స్‌తో అడివి శేష్

Adivi Sesh Dacoit: విమర్శకుల రేటింగ్స్‌కు, ప్రేక్షకుల పల్స్‌కు అస్సలు సంబంధం లేదని 'డెకాయిట్' సినిమా మరోసారి నిరూపించింది. మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, థియేటర్ల వద్ద అడివి శేష్ మేనియా కొనసాగుతోంది. కేవలం వారం రోజుల్లోనే ఈ చిత్రం సాధించిన వసూళ్లు ఇప్పుడు ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి.

Apr 15, 2026, 15:30:42 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Adivi Sesh Dacoit: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంట్ హీరో అడివి శేష్ తన సక్సెస్ ట్రాక్‌ను దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. అతని లేటెస్ట్ మూవీ 'డెకాయిట్' (Dacoit) బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. సుమారు రూ.65 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా.. విడుదలైన మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఒక సినిమా బడ్జెట్‌లో సగానికి పైగా మొత్తాన్ని కేవలం వారం రోజుల్లోనే రికవరీ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఈ క్రమంలో అడివి శేష్ తన సినిమా సక్సెస్ గురించి హిందుస్థాన్ టైమ్స్ తో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

Adivi Sesh Dacoit: గంటకు 5 వేల టికెట్లు.. నాకు అది చాలా గొప్ప.. మనసుకు నచ్చిందే చేస్తా: హిందుస్థాన్ టైమ్స్‌తో అడివి శేష్
Adivi Sesh Dacoit: గంటకు 5 వేల టికెట్లు.. నాకు అది చాలా గొప్ప.. మనసుకు నచ్చిందే చేస్తా: హిందుస్థాన్ టైమ్స్‌తో అడివి శేష్

బుకింగ్స్‌లో సునామీ.. మంగళవారం కూడా ఫుల్

సాధారణంగా మీడియం రేంజ్ హీరోల సినిమాలకు సోమవారం నుంచి వసూళ్లు తగ్గుముఖం పడతాయి. కానీ 'డెకాయిట్' విషయంలో సీన్ రివర్స్‌లో ఉంది. "మంగళవారం ఉదయం బుక్ మై షో ఓపెన్ చేసి చూస్తే.. గంటకు 5,000 టిక్కెట్లు అమ్ముడవుతున్నాయి. ఇది నా కష్టానికి లభించిన గుర్తింపుగా భావిస్తున్నాను. ఇది నాకు చాలా గొప్ప" అని శేష్ సంతోషం వ్యక్తం చేశాడు.

విమర్శకుల నుంచి ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో రివ్యూలు రాలేదు. గతంలో శేష్ నటించిన 'మేజర్' చిత్రానికి 75% రేటింగ్ లభిస్తే.. 'డెకాయిట్'కు మాత్రం కేవలం 30% మాత్రమే దక్కింది. అయినప్పటికీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టడం గమనార్హం.

నాది 'మెదడు'తో చేసే పెట్టుబడి కాదు.. 'మనసు'తో చేసేది

సినిమాల ఎంపికలో అడివి శేష్ తనదైన శైలిని అనుసరిస్తాడు. 'గూఢచారి', 'మేజర్' వంటి చిత్రాలతో మిడ్-బడ్జెట్ సినిమాల పవర్ ఏంటో చూపించిన శేష్.. తన కెరీర్ ప్లానింగ్ గురించి మాట్లాడాడు.

"నేను రెండేళ్లకో సినిమా చేస్తాను. నా మనసుకు నచ్చిన పని చేయకపోతే ఈ కష్టమంతా దేనికి? సినిమా అనేది నాకు కేవలం వ్యాపారం కాదు.. అది నా మనసుతో చేసే పెట్టుబడి.. మెదడుతో చేసేది కాదు" అని పేర్కొన్నాడు. కమర్షియల్ లెక్కల కంటే కథలోని భావోద్వేగాలకే తాను పెద్దపీట వేస్తానని అతడు స్పష్టం చేశాడు.

ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా చేయాలని ఉంది.. కానీ..

భవిష్యత్తులో చేయబోయే సినిమాల గురించి శేష్ తన మనసులోని కోరికను బయటపెట్టాడు. "నాకు ఒక వైపు 'ఆర్ఆర్ఆర్' లాంటి భారీ బడ్జెట్ యాక్షన్ విజువల్ వండర్‌లో భాగం కావాలని ఉంది.. మరోవైపు 'ఎటర్నల్ సన్‌షైన్ ఆఫ్ ది స్పాట్లెస్ మైండ్' వంటి సున్నితమైన కళాత్మక చిత్రాలు చేయాలని ఉంది. హాలీవుడ్ నటుడు రాబర్ట్ ప్యాటిన్సన్ లాగా కమర్షియల్ సినిమాలతో పాటు ఇండీ చిత్రాలు కూడా చేస్తూ వైవిధ్యం చూపించడమే నా లక్ష్యం" అని శేష్ చెప్పుకొచ్చాడు.

దర్శకుడు షానీల్ దేవ్ తెరకెక్కించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించగా, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో మెరిశాడు. ఓపెనింగ్ వీకెండ్‌లోనే రూ.40 కోట్లు రాబట్టిన డెకాయిట్.. వీక్ డేస్‌లో మరో రూ.10 కోట్లు జోడించి బాక్సాఫీస్ వద్ద స్టడీగా దూసుకుపోతోంది. అంతకుముందు ఓటీటీ, శాటిలైట్, ఆడియో డీల్స్ కూడా చూస్తే.. తొలి మూడు రోజుల్లోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించేసింది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. 'డెకాయిట్' సినిమా ఇప్పటివరకు ఎంత వసూలు చేసింది?

నిర్మాతల సమాచారం ప్రకారం, 'డెకాయిట్' చిత్రం విడుదలైన మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

2. డెకాయిట్ సినిమా బడ్జెట్ ఎంత?

ఈ సినిమాను సుమారు రూ.65 కోట్ల వ్యయంతో నిర్మించారు. ప్రస్తుత వసూళ్ల వేగం చూస్తుంటే త్వరలోనే పూర్తి పెట్టుబడి రికవరీ అయ్యే అవకాశం ఉంది.

3. డెకాయిట్ కు రివ్యూలు తక్కువగా ఉన్నా సినిమా ఎందుకు ఆడుతోంది?

విమర్శకుల నుంచి 30% రేటింగ్ మాత్రమే లభించినప్పటికీ, అడివి శేష్‌పై ఉన్న నమ్మకం, సినిమాలోని భారీ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. ముఖ్యంగా మంగళవారం కూడా గంటకు 5,000 టిక్కెట్లు అమ్ముడవ్వడం సినిమా సక్సెస్‌కు నిదర్శనం.

4. 'డెకాయిట్'లో ప్రధాన తారాగణం ఎవరు?

అడివి శేష్ సరసన మృణాల్ ఠాకూర్ నటించగా, బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ విలన్ పాత్రలో మెరిసి మెప్పించారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More