నటి ఐశ్వర్య రాయ్ ఎప్పుడూ తన మనసులో మాట చెప్పడానికి వెనుకాడదు. ముఖ్యంగా మహిళలను ప్రభావితం చేసే అంశాల విషయానికి వస్తే ఆమె చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. తాజాగా వీధుల్లో మహిళలు ఎదుర్కొనే వేధింపులపై ఐశ్వర్య గట్టిగా గళం విప్పింది. ఈ సమస్యకు సంబంధించిన భారం మహిళపై, ఆమె వేసుకునే దుస్తులు, పెట్టుకునే లిప్స్టిక్ పై ఎప్పుడూ వేయకూడదని ఆమె అనడం విశేషం.
ఐశ్వర్య రాయ్ ఏమన్నదంటే?

లోరియాల్ పారిస్ (L'Oreal Paris) స్టాండ్ అప్ శిక్షణా కార్యక్రమంలో భాగంగా ఐశ్వర్య రాయ్ వీధుల్లో వేధింపుల గురించి మాట్లాడింది. ఆమె ఒక దశాబ్దానికి పైగా ఈ బ్యూటీ బ్రాండ్తో కలిసి పనిచేస్తోంది. ఈ సమస్యను ప్రశ్నించడానికి, నిలదీయడానికి ఎవరూ వెనుకాడకూడదని ఆమె తేల్చి చెప్పింది. దీనికి సంబంధించిన ఒక వీడియోను ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. ఈ విషయంలో ఐశ్వర్య తన స్పష్టమైన వైఖరిని తెలిపింది.
వీధుల్లో వేధింపులను మీరు వాటిని ఎలా ఎదుర్కొంటారు అని ప్రశ్నించగా.. ఆమె ఇలా స్పందించింది. "కళ్లలోకి చూడకుండా ఉండొద్దు. నేరుగా కళ్ళలోకి చూడండి. మీ తల ఎత్తుకొని తిరగండి. ఫెమినైన్, ఫెమినిస్ట్. నా శరీరం, నా విలువ. మీ విలువను ఎప్పుడూ తగ్గించుకోవద్దు. మీపై మీరు సందేహపడొద్దు. మీ విలువ కోసం నిలబడండి. మీ దుస్తులు లేదా మీ లిప్స్టిక్ తప్పు కాదు. వీధుల్లో వేధింపులు ఎప్పుడూ మీ తప్పు కాదు" అని ఆమె బలంగా చెప్పింది.
సోషల్ మీడియా ప్రశంసలు
చాలా మంది మహిళలు తరచుగా ఎదుర్కొంటున్నా బహిరంగంగా చర్చించని ఈ సమస్యపై మాట్లాడినందుకు సోషల్ మీడియా యూజర్లు ఐశ్వర్యను ప్రశంసించారు. కామెంట్ల సెక్షన్లో ఆమెకు మద్దతు తెలిపారు. "వీధుల్లో వేధింపులు నిజం. దీని గురించి తగినంతగా మాట్లాడటం లేదు. ఈ సందేశం నచ్చింది" అని ఒకరు రాశారు. "యువతులు, మహిళలందరికీ ఇది శక్తివంతమైన సందేశం" అని మరొకరు అన్నారు. "గొప్ప ప్రోత్సాహం అమ్మాయిలారా" అని ఇంకొకరు అభిప్రాయపడ్డారు.
ఐశ్వర్య రాయ్ కెరీర్ ఇలా..
ఐశ్వర్య రాయ్ చివరగా మణిరత్నం దర్శకత్వం వహించిన చారిత్రక యాక్షన్ డ్రామా 'పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 2' చిత్రంలో కనిపించింది. విక్రమ్, రవి మోహన్, కార్తీ, త్రిష కృష్ణన్ వంటి నటులు కూడా నటించిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.344.63 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.
{{/usCountry}}ఐశ్వర్య రాయ్ చివరగా మణిరత్నం దర్శకత్వం వహించిన చారిత్రక యాక్షన్ డ్రామా 'పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 2' చిత్రంలో కనిపించింది. విక్రమ్, రవి మోహన్, కార్తీ, త్రిష కృష్ణన్ వంటి నటులు కూడా నటించిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.344.63 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.
{{/usCountry}}ఈ సినిమాలో ఆమె నటనకు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్లో (SIIMA) ఉత్తమ నటి (క్రిటిక్స్ కేటగిరీ) అవార్డును గెలుచుకుంది. ఆమె భర్త, నటుడు అభిషేక్ బచ్చన్ కూడా ఆమె నటనను ప్రశంసించారు. ఈ మధ్యే పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు వచ్చిన ఐశ్వర్య.. మంచి ప్రసంగం ఇవ్వడంతోపాటు ప్రధాని మోదీ కాళ్లు మొక్కి వార్తల్లో నిలిచింది.