అఖండ 2కు షాక్.. సండే తగ్గిన కలెక్షన్లు.. ఫస్ట్ వీకెండ్ లో బాలయ్య సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
అఖండ 2: తాండవం చిత్రం సండే రోజు బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది. ఈ మూవీకి ఆదివారం షాక్ తగిలింది. ఈ సినిమా వీకెండ్ లో ఎన్ని కోట్లు రాబట్టిందో ఇక్కడ చూసేయండి.
అఖండ 2: తాండవం చిత్రం మూడవ రోజు కూడా థియేటర్లలో స్థిరమైన ప్రదర్శన కనబరుస్తూ తన ప్రస్థానాన్ని కొనసాగించింది. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ఈ చిత్రం డిసెంబర్ 12న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు ఇక్కడున్నాయి. అయితే సండే రోజు మాత్రం షాకింగ్ వసూళ్లు నమోదయ్యాయి.

అఖండ 2 కలెక్షన్లు
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ 2 సినిమా ఆదివారం (డిసెంబర్ 14) బాక్సాఫీస్ దగ్గర తన జోరు కొనసాగించలేకపోయింది. ఈ మూవీ మూడో రోజు ఇండియాలో రూ.15 కోట్ల నెట్ కలెక్షన్లు ఖాతాలో వేసుకున్నట్లు ట్రేడ్ అనలిస్ట్ వెబ్ సైట్ సక్నిల్క్ పేర్కొంది. ఇది శనివారం వసూళ్ల కంటే తక్కువ. దీంతో మూడు రోజుల ఇండియా నెట్ వసూళ్లు రూ.61 కోట్లకు చేరాయని తెలిపింది.
మూడు రోజులు ఇలా
బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన అఖండ 2 ప్రధానంగా తెలుగు రాష్ట్రాల మార్కెట్ల మద్దతుతో మొదటి వారాంతంలో చెప్పుకోదగిన వసూళ్లను నమోదు చేసింది. ఈ చిత్రం గురువారం ప్రీమియర్లతో రూ.8 కోట్లు వసూలు చేసింది. శుక్రవారం మొదటి రోజున రూ.22.5 కోట్లు ఖాతాలో వేసుకుంది. అయితే రెండవ రోజు (శనివారం) వసూళ్లు రూ.15.5 కోట్లకు తగ్గాయి. ఇది 31.11 శాతం తగ్గుదల. మూడవ రోజు (ఆదివారం) మరింత పడిపోయాయి. రూ.15 కోట్లు వచ్చాయి.
ముంబైలో ఎక్కువ
ప్రాంతాల వారీగా చూస్తే అఖండ 2 సినిమాకు ముంబై 65.33 శాతం ఆక్యుపెన్సీతో అత్యంత బలమైన కేంద్రాలలో ఒకటిగా నిలిచింది. తరువాత విజయవాడ 62.33 శాతం, గుంటూరు 62.00 శాతం ఉన్నాయి. హైదరాబాద్ 55.33 శాతంతో, విశాఖపట్నం 54.00 శాతంతో చెప్పుకోదగిన పనితీరు కనబరిచాయి. బెంగళూరు 51.00 శాతంతో, చెన్నై 37.00 శాతంతో సాపేక్షంగా తక్కువగా నమోదయ్యాయి. చిన్న కేంద్రాలలో కాకినాడ 57.00 శాతం, వరంగల్ 52.33 శాతం, మహబూబ్నగర్ 52.00 శాతం నమోదు చేయగా, నిజామాబాద్ 29.00 శాతంతో వెనుకబడింది.
అఖండ 2 గురించి
బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ 2: తాండవం మూవీ, 2021లో వచ్చిన హిట్ 'అఖండ'కు సీక్వెల్. ఇది నందమూరి బాలకృష్ణను మరోసారి ఒక పవర్ ఫుల్ అవతార్లో చూపించింది. ఈ చిత్రంలో సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా, కబీర్ దుహాన్ సింగ్, శశ్వత ఛటర్జీ కీలక పాత్రలు పోషించారు. రామ్ అచంట, గోపి అచంట, ఇషాన్ సక్సేనా కలిసి 14 రీల్స్ ప్లస్, ఐవీవై ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మించిన ఈ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ కు తమన్ ఎస్ సంగీతం అందించారు. సి.రామప్రసాద్ సినిమాటోగ్రఫీ, తమ్మీరాజు ఎడిటింగ్ చేశారు.














