...
...
Next Story

త్రివిక్రమ్ మూవీ అల్లు అర్జున్‌తోనేనా.. జూనియర్ ఎన్టీఆర్ ఔట్ అంటూ వార్తలు.. బన్నీ వాసు ఏం చెప్పాడో చూడండి

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా మరోసాని అల్లు అర్జున్ చేతికే వచ్చిందన్న వార్తల నేపథ్యంలో దీనిపై ప్రొడ్యూసర్ బన్నీ వాసు స్పందించాడు. అంతేకాదు బన్నీ తర్వాతి రెండు ప్రాజెక్టుల గురించి కూడా అతడు క్లారిటీ ఇచ్చాడు.

Updated on: Dec 24, 2025, 15:13:38 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా అని మొదట్లో అన్నారు. కానీ అది కాస్త జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లో వెళ్లిపోయినట్లు తర్వాత వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి అదే ప్రాజెక్ట్ బన్నీ దగ్గరికే వచ్చిందని అంటున్నారు. ఈ ఇండస్ట్రీ టాక్ పై ప్రముఖ ప్రొడ్యూసర్, అల్లు అర్జున్ సన్నిహితుడు బన్నీ వాసు స్పందించాడు.

బన్నీ వాసు ఏమన్నాడంటే?

త్రివిక్రమ్ మూవీ అల్లు అర్జున్‌తోనేనా.. జూనియర్ ఎన్టీఆర్ ఔట్ అంటూ వార్తలు.. బన్నీ వాసు ఏం చెప్పాడో చూడండి
త్రివిక్రమ్ మూవీ అల్లు అర్జున్‌తోనేనా.. జూనియర్ ఎన్టీఆర్ ఔట్ అంటూ వార్తలు.. బన్నీ వాసు ఏం చెప్పాడో చూడండి

అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ ఏంటి? త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరో సినిమా చేస్తున్నాడా లేదా? అతని భవిష్యత్తు ప్రాజెక్టులు ఏంటి అన్న ప్రశ్నలకు ప్రొడ్యూసర్ బన్నీ వాసు సమాధానమిచ్చాడు. ఈషా మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో అతడు మాట్లాడాడు. అయితే ఇలాంటి వాటిపై అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలని అతడు చెప్పాడు.

“ఇండస్ట్రీలో ప్రాజెక్టులు అటుఇటూ కావడం జరుగుతుంటాయి. హీరోలు, డైరెక్టర్లు, మాకు అందరికీ మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి. ఇలాంటి విషయాలు ఫ్యాన్స్ మధ్య యుద్ధానికి దారి తీయకుండా ఉండటానికి మేము ప్రయత్నిస్తున్నాం. అందుకే వీటిపై అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి” అని బన్నీ వాసు అన్నాడు. అల్లు అర్జున్ చేతికి త్రివిక్రమ్ సినిమా తిరిగి వచ్చిందా అని ప్రశ్నించినప్పుడు అతడు ఇలా స్పందించాడు.

అల్లు అర్జున్ చేతిలో రెండు ప్రాజెక్టులు

ఇక అల్లు అర్జున్ తర్వాతి రెండు ప్రాజెక్టులపై తమకు క్లారిటీ ఉందని కూడా బన్నీ వాసు తెలిపాడు. “అల్లు అర్జున్ చేతుల్లో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో ఒకదానిపై జనవరిలో అనౌన్స్ మెంట్ ఉంటుంది. వచ్చే ఏడాది జులై లేదా ఆగస్టులో ప్రాజెక్టు మొదలవుతుంది. ఇక మరొకటి 2027 మార్చిలో ఉండబోతోంది” అని బన్నీ వాసు స్పష్టం చేశాడు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe