నాలుగేళ్ల తర్వాత మరో ఓటీటీలోకి పాయల్ రాజ్‌పుత్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌.. డ‌బ్బు, న‌గ‌ల కోసం హ‌త్య కుట్ర‌

నాలుగేళ్ల తర్వాత మరో ఓటీటీలోకి పాయల్ రాజ్‌పుత్ సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చేసింది. డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు మరో ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ సినిమా వివరాలు ఇక్కడ చూసేయండి. 

Published on: Nov 09, 2025 6:30 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నాలుగేళ్ల తర్వాత హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ‘అనగనగా ఓ అతిథి’ మూవీ మరో ఓటీటీలోకి వచ్చేసింది. ఇన్ని రోజులూ ఆహాలో స్ట్రీమింగ్ అయిన ఈ సినిమా ఇప్పుడు మరో ఓటీటీలోని అందుబాటులోకి వచ్చింది. ఓ హత్య కుట్ర చుట్టూ సస్పెన్స్ రేపుతూ సాగుతోంది ఈ సినిమా.

ఓటీటీలో పాయల్ థ్రిల్లర్ మూవీ (youtube)
ఓటీటీలో పాయల్ థ్రిల్లర్ మూవీ (youtube)

అనగనగా ఓ అతిథి ఓటీటీ

హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ ప్లే చేసిన మూవీ అనగనగా ఓ అతిథి. ఇది డైరెక్ట్ ఓటీటీలోనే రిలీజైంది. ఆహా ఒరిజినల్ ఫిల్మ్ గా ఇది తెరకెక్కింది. దీన్ని 2020, నవంబర్ 20న డైరెక్ట్ గా ఆహా ఓటీటీలో రిలీజ్ చేశారు. పేదరికం, డబ్బు, అత్యాశ, కోరిక చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.

మరో ఓటీటీలోకి

అనగనగా ఓ అతిథి సినిమా ఇప్పుడు మరో ఓటీటీలోకి వచ్చింది. నాలుగేళ్ల తర్వాత ఇంకో డిజిటల్ స్ట్రీమింగ్ లో అడుగుపెట్టింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ తెలుగు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ థ్రిల్లర్ లో పాయల్ రాజ్ పుత్, చైతన్య కృష్ణ, వీణ సుందర్, ఆనంద చక్రపాణి తదితరులు నటించారు. అనగనగా ఓ అతిథి సినిమాకు దయాళ్ పద్మనాభన్ డైరెక్టర్.

ఆ మూవీ రీమేక్

కన్నడలో సూపర్ హిట్ గా నిలిచిన ‘ఆ కరాళ రాత్రి’ మూవీకి రీమేక్ ఈ అనగనగా ఓ అతిథి సినిమా. 2018లో వచ్చి ఆ కరాళ రాత్రి హిట్ గా నిలిచింది. ఆ సినిమాను తెలుగులో అనగనగా ఓ అతిథి పేరుతో ఆహా ఓటీటీ రీమేక్ చేసింది. తెలుగు ప్రేక్షకులకు తగ్గట్లుగా సినిమాకు కాస్త మార్చి డైరెక్ట్ గా తెలుగులో రిలీజ్ చేసింది.

అనగనగా ఓ అతిథి కథ

మల్లిక (పాయల్ రాజ్ పుత్)ది పేద కుటుంబం. తల్లి, తండ్రితో కలిసి జీవిస్తుంది. ఎన్నో కలలు కంటుంది. ధనవంతురాలిని అయిపోవాలని, కనక వర్షం కురవాలని ఆశ పడుతుంది. కానీ కుటుంబ పరిస్థితి చూస్తే అప్పుల కారణంగా పొలం కూడా తాకట్టు పెట్టాల్సి వస్తుంది.

ఆ సమయంలోనే శ్రీనివాస్ (చైతన్య కృష్ణ) మల్లిక కుటుంబంలోకి వస్తాడు. అతను బాగా ధనవంతుడు. అతనికి మల్లిక కుటుంబం మర్యాదలు చేస్తుంది. ఆ క్రమంలో అతని దగ్గర పెట్టెనిండా డబ్బు, నగలు చూసి మల్లికకు దురాశ మొదలవుతుంది. అతణ్ని టెంప్ట్ చేయాలని చూస్తుంది. శ్రీనివాస్ ను చంపి ఆ డబ్బు, నగలు తీసుకోవాలని అనుకుంటుంది. మరి శ్రీనివాస్ ను మల్లిక కుటుంబం చంపిందా? అసలు శ్రీనివాస్ ఎవరు? అన్నది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.

News/Entertainment/నాలుగేళ్ల తర్వాత మరో ఓటీటీలోకి పాయల్ రాజ్‌పుత్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌.. డ‌బ్బు, న‌గ‌ల కోసం హ‌త్య కుట్ర‌
News/Entertainment/నాలుగేళ్ల తర్వాత మరో ఓటీటీలోకి పాయల్ రాజ్‌పుత్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌.. డ‌బ్బు, న‌గ‌ల కోసం హ‌త్య కుట్ర‌