రాశి గారి ఫలాలు కామెంట్స్.. మూడేళ్ల తర్వాత క్షమాపణ చెప్పిన అనసూయ.. అప్పుడు వాళ్లనేమీ చేయలేకపోయానంటూ..
అనసూయ భరద్వాజ్ నటి రాశికి క్షమాపణ చెప్పింది. మూడేళ్ల కిందటి జబర్దస్త్ షోలో తాను చేసిన రాశి గారి ఫలాలు కామెంట్స్ పై విమర్శలు వస్తుండటంతో ఆమె ఇన్స్టా స్టోరీస్ లో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
నటి రాశికి అనసూయ భరద్వాజ్ క్షమాపణ చెప్పింది. నటుడు శివాజీ చేసిన కామెంట్స్, దానికి అనసూయ కౌంటర్.. దీనికి ప్రతిగా ఆమె మూడేళ్ల కిందట జబర్దస్త్ షోలో చేసిన కామెంట్స్ దుమారం రేపడంతో అనసూయ దిగి వచ్చింది. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో రాశికి క్షమాపణ చెబుతూ ఆమె ఓ పోస్ట్ చేసింది. తనను అవమానించేలా మాట్లాడిన అనసూయపై రాశి మండిపడిన తర్వాత ఆమె క్షమాపణ చెప్పడం గమనార్హం.

అనసూయ క్షమాపణ
అనసూయ భరద్వాజ్ సినిమాల్లోకి వచ్చే ముందు ఈటీవీలో వచ్చే జబర్దస్త్ షోలో యాంకర్ గా ఉన్న విషయం తెలుసు కదా. అప్పట్లో ఓ స్కిట్ లో రాశి గారు ఫలాలు అని అనసూయ అనడం, అవి రాశి ఫలాలు అని హైపర్ ఆది కౌంటర్ వేసిన వీడియో ఈ మధ్య బాగా వైరల్ అయింది.
శివాజీ కామెంట్స్ విషయంలో అనసూయ గట్టిగా రిప్లై ఇచ్చిన నేపథ్యంలో మూడేళ్ల కిందటి ఈ వీడియోను మళ్లీ తెరపైకి తెచ్చి ట్రోల్ చేశారు. నటి రాశి కూడా దీనిపై మండిపడిన వీడియో ఒకటి బయటకు రావడంతో అనసూయ దిగి వచ్చి క్షమాపణ చెప్పింది. ఆ పోస్టులో ఆమె ఏం రాసిందో చూడండి.
నా శక్తి సరిపోలేదు
“డియర్ రాశి గారు.. మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నాను.. మూడు సంవత్సరాల క్రితం నేను చేసిన ఒక షోలో “ తెలుగు సరిగ్గా రానితనంపై చేసిన స్కిట్ లో మీ పేరును ఉపయోగించి నా నోటి నుంచి డబల్ మీనింగ్ డైలాగ్ చెప్పించడం జరిగింది. ఇది రాయించి డైరెక్ట్ చేసిన వ్యక్తుల్ని నేను ఆ రోజే నిలదీసి అడిగి ఉండాల్సింది కానీ అప్పటికి నాకు ఉన్నటువంటి శక్తి అందుకు సహకరించలేదు. అది పొరపాటే.. దానికి క్షమించండి" అని అనసూయ రాసింది.
అంతేకాదు ఇంకా కొనసాగిస్తూ.. "వెనక్కి వెళ్లి ఇప్పుడు నేను దాన్ని సరిదిద్దలేను. మనుషులు మారతారు, పరిణతి సాధిస్తారు. ఆ షో లో ద్వంద్వార్ధపు మాటలని ఖండించడం దగ్గర నుంచి ఆ షో విడిచి పెట్టడం వరకు నాలోని ఆ మార్పు మీరు గమనించవచ్చు. ఈరోజు మహిళలందరి భద్రత గురించి గట్టిగా మాట్లాడుతున్న నాకు వ్యతిరేకంగా అప్పటి ఆ మాటలు తీసి విద్వేష ప్రచారం నడిపిస్తున్నారు. నన్ను షేమ్ చేయడానికి చేస్తున్న ఈ కథనాలు మీకు ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయో ఊహించగలను. ఆ కార్యక్రమం దర్శక రచయిత నిర్మాతలు మీకు క్షమాపణలు చెప్పినా చెప్పకపోయినా నా బాధ్యతగా నా తప్పుని అంగీకరిస్తూ మీకు క్షమాపణ చెప్తున్నాను” అని అనసూయ చెప్పింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


