ఆంధ్రా కింగ్ తాలూకా ఓటీటీ రిలీజ్ డేట్.. రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే మూవీ డిజిటల్ ప్రీమియర్ ఆరోజేనా?

రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ ఆంధ్రా కింగ్ తాలూకా ఓటీటీ రిలీజ్ పై బజ్ నెలకొంది. నవంబర్ 27న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. ఈ నెల చివర్లో డిజిటల్ ప్రీమియర్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ లోకి ఈ సినిమా రానుంది.

Published on: Dec 14, 2025 9:31 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన 'ఆంధ్రా కింగ్ తాలూకా' థియేట్రికల్ రన్ ముగించుకుని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేయడానికి సిద్ధమైంది. నవంబర్ 27న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా డిసెంబర్ 25న అంటే క్రిస్మస్ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

ఆంధ్రా కింగ్ తాలూకా ఓటీటీ రిలీజ్ డేట్.. రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే మూవీ డిజిటల్ ప్రీమియర్ ఆరోజేనా? (YouTube)
ఆంధ్రా కింగ్ తాలూకా ఓటీటీ రిలీజ్ డేట్.. రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే మూవీ డిజిటల్ ప్రీమియర్ ఆరోజేనా? (YouTube)

ఆంధ్రా కింగ్ తాలూకా డిజిటల్ ప్రీమియర్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనికి మరో నిరాశనే మిగిల్చిన మూవీ 'ఆంధ్రా కింగ్ తాలూకా'. థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, వసూళ్ల పరంగా మాత్రం ఈ సినిమా వెనుకబడిపోయింది. దీంతో నెల రోజుల్లోపే ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) దక్కించుకుంది. క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ 25న ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఈ చిత్రం అందుబాటులో ఉండనుంది. అయితే దీనిపై నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

ఆంధ్రా కింగ్ తాలూకా బాక్సాఫీస్ రిపోర్ట్

నవంబర్ 27న విడుదలైన ఈ సినిమాకు విమర్శకుల నుంచి పర్వాలేదనిపించే స్పందన వచ్చింది. కానీ కమర్షియల్ గా మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. తొలి రోజు రూ. 4.15 కోట్లతో మొదలు పెట్టింది. ఆదివారం నాటికి కాస్త పుంజుకుని రూ. 3.7 కోట్లు రాబట్టినా.. సోమవారం నుంచి వసూళ్లు దారుణంగా పడిపోయాయి.

మొత్తంగా 15 రోజుల్లో ఈ సినిమా ఇండియాలో కేవలం రూ. 23.1 కోట్ల నెట్ మాత్రమే వసూలు చేయగలిగింది. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఫేమ్ మహేష్ బాబు పాచిగొళ్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.

సాగర్ (రామ్) అనే యువకుడు, సినిమా స్టార్ 'ఆంధ్రా కింగ్' సూర్య కుమార్ కు వీరాభిమాని. తన అభిమాన హీరో చుట్టూ తిరిగే సాగర్ జీవితం, ఆ పిచ్చి ఎలాంటి మలుపులు తిరిగింది అనేదే కథ.

రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో మెరిశారు. రావు రమేష్, మురళి శర్మ, సత్య ఇతర పాత్రల్లో నటించారు. వివేక్-మెర్విన్ సంగీతం అందించగా, సిద్ధార్థ్ నూని సినిమాటోగ్రఫీ అందించారు.