Venky Anil 5 First Look: 40 ఇయర్స్ ఇండస్ట్రీ.. వెంకీ మామను ఆర్మీ ఆఫీసర్‌ను చేసిన అనిల్ రావిపూడి.. ఫస్ట్ లుక్ పోస్టర్

Venky Anil 5 First Look: వెంకటేష్ ను ఇండియన్ ఆర్మీ లెఫ్ట్‌నెంట్ కల్నల్ వెంకట్ రెడ్డిగా మార్చేశాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఐదో సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

Published on: Aug 14, 2026, 17:22:57 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Venky Anil 5 First Look: విక్టరీ వెంకటేష్ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి ఏకంగా 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఫ్యాన్స్‌కు మైండ్ బ్లోయింగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ (#VenkyAnil5) నుంచి వెంకీ మాస్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా గ్రాండ్‌గా రివీల్ చేశారు.

Venky Anil 5 First Look: 40 ఇయర్స్ ఇండస్ట్రీ.. వెంకీ మామను ఆర్మీ ఆఫీసర్‌ను చేసిన అనిల్ రావిపూడి.. ఫస్ట్ లుక్ పోస్టర్
Venky Anil 5 First Look: 40 ఇయర్స్ ఇండస్ట్రీ.. వెంకీ మామను ఆర్మీ ఆఫీసర్‌ను చేసిన అనిల్ రావిపూడి.. ఫస్ట్ లుక్ పోస్టర్

40 ఏళ్ల కెరీర్ మైల్‌స్టోన్.. ఆర్మీ ఆఫీసర్‌గా విక్టరీ వెంకటేష్

ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ 'లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి' అనే పవర్‌ఫుల్ ఆర్మీ ఆఫీసర్ రోల్‌లో కనిపిస్తున్నారు. కౌంటర్ టెర్రరిజం, బందీలుగా చేసుకునే పరిస్థితుల్లో చర్చలు జరిపే స్పెషలిస్ట్‌గా ఉన్న ఈ క్యారెక్టర్ లుక్ పోస్టర్‌లో పర్ఫెక్ట్ ఇంటెన్స్ వైబ్‌తో ఆకట్టుకుంటోంది.

1986లో 'కలియుగ పాండవులు' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్, గత నాలుగు దశాబ్దాలుగా ఫ్యామిలీ, యాక్షన్, కామెడీ కాన్సెప్ట్‌లతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చెరగని ముద్ర వేశారు. 40 ఏళ్ల మైల్‌స్టోన్ టైమ్‌లోనే ఈ మోస్ట్ ఇంటెన్స్ రోల్‌ని అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పండుగ చేసుకుంటున్నారు.

అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్..

'మన శంకర వరప్రసాద్ గారు' లాంటి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న పక్కా ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఇందులో నందమూరి కళ్యాణ్ రామ్ మరో కీలకమైన రోల్‌లో వెంకటేష్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటుండటంతో మూవీపై ట్రేడ్ వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

'ఎఫ్ 2', 'ఎఫ్ 3' లాంటి బిగ్గెస్ట్ హిట్స్ తర్వాత అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అనిల్ రావిపూడి తన నైపుణ్యంతో రాసుకున్న క్యారెక్టరైజేషన్, కామిక్ టైమింగ్, యాక్షన్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయని టాక్.

కీర్తి సురేష్, కృతి శెట్టి నయా కాంబినేషన్..

ఈ భారీ ప్రాజెక్ట్‌లో నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్, గ్లామరస్ బ్యూటీ కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. వెంకటేష్, కళ్యాణ్ రామ్‌ల కాంబోకు జోడీగా వీరు అలరించనుండటంతో స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉండబోతోంది.

'అమరన్', 'లక్కీ భాస్కర్' లాంటి చార్ట్‌బస్టర్ ఆల్బమ్స్‌తో దూసుకుపోతున్న తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. ఆయన అందించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

సంక్రాంతి 2027 బాక్సాఫీస్ టార్గెట్..

షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు.

సంక్రాంతి పండుగ వెంకటేష్, అనిల్ రావిపూడి ఇద్దరికీ బాగా కలసివచ్చిన సెంటిమెంట్. అందుకే ఈ బిగ్గీని 2027 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ పక్కా ప్లాన్ చేశారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More