పదేళ్లయినా మీ ప్రేమ తగ్గలేదు.. అందుకే ఈ ఎపిక్ రూపంలో తీసుకొచ్చాం: థియేటర్లో రాజమౌళి సందడి.. రూ.10 కోట్లు దాటిన బుకింగ్స్
బాహుబలి ది ఎపిక్ రిలీజ్ కు ముందు రోజు డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి థియేటర్లో సందడి చేశాడు. మూవీ ప్రారంభమయ్యే ముందు సడెన్ గా వచ్చి అభిమానులతో ముచ్చటించాడు. పదేళ్లయినా ఈ సినిమాపై ఈ ప్రేమ ఏమాత్రం తగ్గలేదని అతడు అన్నాడు.
బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్ కలిపి బాహుబలి ది ఎపిక్ రూపంలో రిలీజ్ అవుతున్న విషయం తెలుసు కదా. శుక్రవారం (అక్టోబర్ 31) ఈ మూవీ రిలీజ్ కానుండగా.. గురువారం రాత్రి నుంచే థియేటర్లలో సందడి నెలకొంది. ఈ సందర్భంగా డైరెక్టర్ రాజమౌళి ప్రసాద్ సినిమాస్ లోని పీసీఎక్స్ స్క్రీన్ కి వెళ్లి అభిమానులతో ముచ్చటించాడు.

అందుకే ఈ ఎపిక్ నిర్ణయం
రాజమౌళి సడెన్ గా థియేటర్లోకి వచ్చేసరికి అభిమానులు ఆశ్చర్యానికి గురై పెద్దగా అరిచారు. మొదట వాళ్లతో బాహుబలి మాహిష్మతి భాషలో జక్కన్న మాట్లాడాడు. మాహిష్మతి రాజ్య ప్రజలు ఎలా ఉన్నారు.. ఆ ముసలోడు బిజ్జలదేవుడు ఉన్నాడా ఇంకా అని సరదాగా అడిగాడు.
ఆ తర్వాత ఈ సినిమాపై పదేళ్లయినా మీ ప్రేమ తగ్గలేదని, అందుకే రీరిలీజ్ చేద్దామా లేక ఏదైనా కొత్తగా చేద్దామా అని ఆలోచించి.. ఇలా ఎపిక్ రూపంలో తీసుకొస్తున్నామని రాజమౌళి అన్నాడు. మీరు మెచ్చిన సీన్లంటినీ అలాగే ఉంచానని అనుకుంటున్నానని, మూవీ చూసి ఎంజాయ్ చేయాలని అతడు కోరాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రూ.10 కోట్లు దాటిన బుకింగ్స్
'బాహుబలి: ది ఎపిక్' ఇప్పటికే ఇండియన్ సినిమాల రీ-రిలీజ్లలో అతిపెద్ద ఓపెనింగ్ను సాధించింది. ఇది ఇండియాలో ప్రీ-సేల్స్ ద్వారా రూ.5 కోట్లు, ఉత్తర అమెరికాలో రూ.5 కోట్లు వసూలు చేసింది. ఓపెనింగ్ రోజున ప్రపంచవ్యాప్తంగా రూ.10 కోట్ల మార్కును చేరుకున్న మొదటి తెలుగు రీ-రిలీజ్ కూడా ఇదే. కొత్త బాహుబలి మూవీ భారతీయ రీ-రిలీజ్ల రికార్డులను బద్దలు కొట్టి, ప్రపంచవ్యాప్తంగా కొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉంది.
గతంలో విజయ్ దళపతి ‘గిల్లీ’.. అత్యధిక వసూళ్లు సాధించిన రీ-రిలీజ్గా చెబుతారు. అయితే ఓపెనింగ్ రోజున ప్రపంచవ్యాప్తంగా రూ.7.9 కోట్లు మాత్రమే వసూలు చేసింది. కొందరు రూ.10 కోట్లు అని కూడా అంటారు. దీనిపై స్పష్టత లేదు. ఇక పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' ప్రపంచవ్యాప్తంగా రూ.8 కోట్లు వసూలు చేయగా, మహేష్ బాబు 'ఖలేజా' రూ.6.85 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం హర్షవర్ధన్ రాణే 'సనమ్ తేరీ కసమ్' రీ-రిలీజ్లన్నిటిలోనూ అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రూ.41 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది.
బాహుబలి: ది ఎపిక్ గురించి
ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా ప్రధాన పాత్రలు పోషించిన 'బాహుబలి: ది ఎపిక్' సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించాడు. అర్కా మీడియా వర్క్స్ నిర్మించింది. ఈ సినిమా రన్టైమ్ 3 గంటల 45 నిమిషాలు. ఈ మూవీ ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 1150 థియేటర్లలో రీ-రిలీజ్ అవుతోంది.
అమెరికాలో 'బాహుబలి: ది ఎపిక్' 400 థియేటర్లలో.. యూకే, ఐర్లాండ్లో 210, యూఏఈ, జీసీసీలలో 150కి పైగా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో 144, ఆగ్నేయాసియాలో 100కి పైగా థియేటర్లలో విడుదల అవుతుంది. ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


