బాహుబలి ది ఎపిక్ మూవీకి 3 కోట్లు దాటిన అడ్వాన్స్ బుకింగ్స్.. అమెరికాలోనే ఎక్కువగా అమ్ముడు పోయిన టికెట్స్.. ఎంతంటే?
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్ సిరీస్ బాహుబలి. రెండు పార్టులుగా విడుదలైన ఈ సిరీస్ను ఒక్క మూవీ బాహుబలి ది ఎపిక్గా విడుదల కానుంది. అక్టోబర్ 31న రిలీజ్ కానున్న బాహుబలి ది ఎపిక్కు అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా ఉన్నాయి. ఇప్పటికే అవి రూ. 3 కోట్ల కలెక్షన్స్ దాటాయి.
దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఇండియన్ ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం బాహుబలి. రెండు పార్ట్స్గా విడుదలైన ఈ సిరీస్ ప్రపంచానికి భారతీయ సినిమా సత్తా ఏంటో చూపించాయి. ఇందులో మొదటి సినిమా వచ్చి పదేళ్లు అవుతున్న బాహుబలి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఇంకా పోలేదు.
బాహుబలి ది ఎపిక్ మూవీకి 3 కోట్లు దాటిన అడ్వాన్స్ బుకింగ్స్.. అమెరికాలోనే ఎక్కువగా అమ్ముడు పోయిన టికెట్స్.. ఎంతంటే?
రెండు సినిమాలకు ఒక్కటిగా
2015లో బాహుబలి ది బిగినింగ్, 2017లో బాహుబలి ది కంక్లూజన్గా రెండు సినిమాలు చరిత్ర క్రియేట్ చేశాయి. అలాంటి రెండు సినిమాలను కలిపి ఒక్క చిత్రంగా మలిచారు జక్కన్న. ఇది ఇప్పుడు మరో ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ రెండు పార్ట్స్ను ఒక్కటిగా బాహుబలి: ది ఎపిక్ అనే టైటిల్తో అక్టోబర్ 31న థియేటర్లలో విడుదల చేయనున్నారు మేకర్స్.
బాహుబలి ది ఎపిక్ రన్టైమ్
రీమాస్టర్ చేసిన విజువల్స్, హై క్వాలిటీ సౌండ్ రెండు పార్ట్స్లో తొలగించిన సన్నివేశాలతో బాహుబలి ది ఎపిక్ సినిమాను రిలీజ్ చేయనున్నారు. దీంతో ఈ మూవీ రన్ టైమ్ సుమారుగా 3 గంటల 44 నిమిషాలుగా ఉంది. అయితే, అక్టోబర్ 29న యుఎస్, యూకే, ఐర్లాండ్లో బాహుబలి ది ఎపిక్ రిలీజ్ కానుంది.
బాహుబలి ది ఎపిక్ అడ్వాన్స్ బుకింగ్స్
ఆ తర్వాత అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ 'బాహుబలి: ది ఎపిక్' విడుదల కానుంది. అయితే, రిలీజ్కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్తో బాహుబలి ది ఎపిక్ వండర్స్ సృష్టిస్తోంది.
అమెరికాలోనే ఎక్కువ
బాహుబలి ది ఎపిక్ విదేశాల్లో దాదాపు రూ. 2 కోట్ల వసూళ్లు సంపాదించింది. ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే రూ.3 కోట్లు దాటినట్లు సమాచారం. హైదరాబాద్లో టికెట్స్ కొన్ని గంటల్లోనే అమ్ముడయ్యాయి. ఒక్క యుఎస్ మార్కెట్లోనే ఈ చిత్రం అడ్వాన్స్ టికెట్ అమ్మకాలలో రూ. 1.80 కోట్ల మార్కును దాటింది. అంటే అధికంగా అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ ఎక్కువగా ఉన్నాయి.
బాహుబలి నటీనటులు
3 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్తో అబ్బురపరిచిన బాహుబలి ది ఎపిక్ కలెక్షన్లతో మరెంత రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే, ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ ముఖ్య పాత్రలు పోషించిన విషయం తెలిసిందే.
ఒక్క ప్రశ్నతో అంచనాలు
బాహుబలి మొదటి పార్ట్ వరల్డ్ వైడ్గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న సంగతి విదితమే. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్న యావత్ ఆడియెన్స్ను ఆలోచింపజేసింది. దీనిపై పలు విధాలుగా సమాధానాలతో మీమ్స్ కూడా వచ్చాయి. ఈ ఒక్క ప్రశ్నతోనే బాహుబలి 2పై విపరీతమైన క్యూరియాసిటీ, అంచనాలు పెరిగాయి.