బాలకృష్ణ అఖండ 2 మూవీ టికెట్ల ధర భారీగా పెంపు.. ప్రీమియర్ షో చూడాలంటే రూ.600.. ఏపీ ప్రభుత్వం జీవో జారీ

బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2 మూవీ ఈ శుక్రవారం (డిసెంబర్ 5) రిలీజ్ కానున్న విషయం తెలుసు కదా. ఈ సినిమా టికెట్ల ధరలను భారీ పెంచడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంతేకాదు ప్రీమియర్ షో చూడాలంటే మాత్రం రూ.600 ఖర్చు చేయాల్సిందే.

Published on: Dec 2, 2025, 20:59:14 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నందమూరి బాలకృష్ణ మోస్ట్ అవేటెడ్ మూవీ అఖండ 2. నాలుగేళ్ల కిందట వచ్చిన అఖండ సినిమాకు సీక్వెల్ ఇది. బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వరుసగా నాలుగో హిట్ కోసం బాలయ్య చూస్తున్నాడు. ఈ మూవీ శుక్రవారం (డిసెంబర్ 5) ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సినిమా టికెట్ల ధర పెంపుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

బాలకృష్ణ అఖండ 2 మూవీ టికెట్ల ధర భారీగా పెంపు.. ప్రీమియర్ షో చూడాలంటే రూ.600.. ఏపీ ప్రభుత్వం జీవో జారీ
బాలకృష్ణ అఖండ 2 మూవీ టికెట్ల ధర భారీగా పెంపు.. ప్రీమియర్ షో చూడాలంటే రూ.600.. ఏపీ ప్రభుత్వం జీవో జారీ

ఏపీలో అఖండ 2 టికెట్ల ధరలు ఇలా..

ఆంధ్రప్రదేశ్ లో అఖండ 2 మూవీ టికెట్ల ధరలు భారీగా పెరిగాయి. ఈ మేరకు మంగళవారం (డిసెంబర్ 2) అక్కడి ప్రభుత్వం జీవో జారీ చేసింది. రిలీజ్ కు ముందు రోజు అంటే గురువారం (డిసెంబర్ 4) రాత్రి 10 గంటలకు ప్రీమియర్ షోల కోసం టికెట్ల ధరను రూ.600 గా నిర్ణయించారు.

అన్ని థియేటర్లలోనూ ఇదే ధర ఉంటుంది. ఇక మూవీ రిలీజయ్యే డిసెంబర్ 5 నుంచి తొలి పది రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్ అయితే రూ.75, మల్టీప్లెక్స్ అయితే రూ.100 పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఈ పెంపుతో సింగిల్ స్క్రీన్లలో టికెట్ల ధర రూ.222.50 కాగా.. మల్టీప్లెక్స్ లలో రూ.277గా ఉండనుంది.

అఖండ 2 మూవీ గురించి..

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో గతంలో సింహా, లెజెండ్, అఖండ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూడూ బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. దీంతో ఇప్పుడు రాబోయే అఖండ 2పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రాలాంటి వాళ్లు కూడా నటించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్లో రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమాను నిర్మించారు. తమన్ మ్యూజిక్ అందించాడు.

ఈ సినిమా ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దేశభక్తికి సనాతన ధర్మం అనే కాన్సెప్ట్ ను జోడించి తీసిన మూవీగా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఇందులో రెండు వేర్వేరు పాత్రల్లో బాలయ్య నటించాడు. తొలిసారి అఘోరా పాత్రలో అతడు నట విశ్వరూపం చూపించినట్లు ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ చూస్తే తెలుస్తోంది. ఆ లెక్కన డిసెంబర్ 5 నుంచి థియేటర్లలో అభిమానుల పూనకాలు ఖాయంగా కనిపిస్తోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More