Bigg Boss Pallavi Prashanth: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజేత 'రైతు బిడ్డ' పల్లవి ప్రశాంత్ ప్రైజ్ మనీ, గిఫ్ట్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. షో నిర్వాహకులు ప్రకటించిన మొత్తం నగదు, బహుమతులు తనకు పూర్తిగా అందలేదని, పెద్ద మొత్తంలో కోతలు విధించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించడంతో సోషల్ మీడియాలో ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ప్రకటించిన బహుమతులు ఏంటి? చేతికి వచ్చింది ఎంత?

బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలే రోజున హోస్ట్ అక్కినేని నాగార్జున విన్నర్గా పల్లవి ప్రశాంత్ను ప్రకటించారు. ఆ సమయంలో విజేతకు రూ. 50 లక్షల క్యాష్ ప్రైజ్, మారుతి సుజుకి బ్రెజా కార్ తో పాటు రూ. 15 లక్షల విలువైన జోయాలుక్కాస్ జ్యువెలరీ వోచర్ ఇస్తున్నట్లు అనౌన్స్ చేశారు.
అయితే టాక్స్, టీడీఎస్ డిడక్షన్స్ పేరుతో ప్రైజ్మనీ రూ.35 లక్షల్లో దాదాపు 40 శాతం కోత విధించినట్లు ప్రశాంత్ తెలిపారు. ప్రైజ్ మనీలో టీడీఎస్ కట్ అవ్వడం సాధారణమే అయినప్పటికీ, స్పాన్సర్లు ఇచ్చిన వోచర్లు, ఇతర బహుమతుల విషయంలో కూడా రకరకాల కండిషన్లు పెట్టి పూర్తి ప్రయోజనం అందకుండా చేశారని ప్రశాంత్ సంచలన ఆరోపణలు చేశారు.
కార్ గిఫ్ట్, జ్యువెలరీ వోచర్పై క్లారిటీ
ఫినాలే స్టేజ్ మీద చూపించిన బ్రెజా కార్ కూడా వెంటనే హ్యాండోవర్ చేయలేదని, దానికి సంబంధించిన ప్రాసెస్ పూర్తయ్యేసరికి చాలా సమయం పట్టిందని ప్రశాంత్ వెల్లడించారు. ఆ కారేదో తాను కొన్నట్లుగా రూ.8.5 లక్షలు కట్టించుకున్నారని చెప్పడం గమనార్హం. ప్రైజ్ మనీ రూ.35 లక్షల్లో 40 శాతానికి పైగా పోయిందని, అలాగే నెక్లెస్ విషయంలోనూ అదే జరిగిందని చెప్పారు. జ్యువెలరీ వోచర్ విషయంలో కూడా కొన్ని నిబంధనల వల్ల పూర్తి స్థాయి బెనిఫిట్ దక్కలేదని చెప్పారు.
తనలాంటి సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి ఇదొక పెద్ద దెబ్బ అని, బయటకు కనిపించే ఆర్భాటానికి, చేతికి వచ్చే అసలు మొత్తానికి చాలా తేడా ఉంటుందని పల్లవి ప్రశాంత్ స్పష్టం చేశారు. భారీగా ప్రైజ్ మనీ వచ్చిందని తాను స్టేజ్ మీదే అది చేస్తా, ఇది చేస్తానని చెప్పానని.. తీరా చూస్తే తన జేబులో నుంచి డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చిందని ప్రశాంత్ వెల్లడించారు. ఇప్పటికీ తాను సంపాదించిన దాంట్లో 50 శాతం సేవ కోసమే వినియోగిస్తానని స్పష్టం చేశారు.
రైతు బిడ్డ ప్రయాణం.. వివాదాలు, కంబ్యాక్
{{/usCountry}}తనలాంటి సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి ఇదొక పెద్ద దెబ్బ అని, బయటకు కనిపించే ఆర్భాటానికి, చేతికి వచ్చే అసలు మొత్తానికి చాలా తేడా ఉంటుందని పల్లవి ప్రశాంత్ స్పష్టం చేశారు. భారీగా ప్రైజ్ మనీ వచ్చిందని తాను స్టేజ్ మీదే అది చేస్తా, ఇది చేస్తానని చెప్పానని.. తీరా చూస్తే తన జేబులో నుంచి డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చిందని ప్రశాంత్ వెల్లడించారు. ఇప్పటికీ తాను సంపాదించిన దాంట్లో 50 శాతం సేవ కోసమే వినియోగిస్తానని స్పష్టం చేశారు.
రైతు బిడ్డ ప్రయాణం.. వివాదాలు, కంబ్యాక్
{{/usCountry}}కంటెంట్ క్రియేటర్గా సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన పల్లవి ప్రశాంత్.. 'రైతు బిడ్డ' అనే టాగ్ తో బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టారు. హౌస్లోని ఇతర కంటెస్టెంట్లతో పోటీపడి భారీగా ఓట్లు సాధించి అమర్దీప్ చౌదరిని ఓడించి విన్నర్గా నిలిచారు.
అయితే ఫినాలే ముగిసిన వెంటనే అన్నపూర్ణ స్టూడియోస్ బయట జరిగిన గొడవలు, ఆర్టీసీ బస్సు ధ్వంసం కేసులో పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చి మళ్లీ డిజిటల్ కంటెంట్ క్రియేషన్పై దృష్టి పెట్టారు. ఇప్పుడు ప్రైజ్ మనీ కోతలపై ఆయన చేసిన కామెంట్స్ బుల్లితెర వర్గాల్లో వేడి రాజేస్తున్నాయి.