బోల్డ్ వెబ్ సిరీస్ చివరి సీజన్ వచ్చేస్తోంది.. సెక్స్ అండ్ ద సిటీకి దేశీ వెర్షన్‌లాంటి సిరీస్.. నలుగురు అమ్మాయిల చుట్టూ..

ఇండియన్ ఓటీటీల్లో వచ్చిన బోల్డ్ వెబ్ సిరీస్ లలో ఒకటైన ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ చివరి సీజన్ వచ్చేస్తోంది. ఈ విషయాన్ని ప్రైమ్ వీడియో మంగళవారం (జులై 1) వెల్లడించింది. నలుగురు అమ్మాయిల చుట్టూ తిరిగే స్టోరీ ఇది.

Published on: Jul 1, 2025, 13:18:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బోల్డ్ టైటిల్, అంతకంటే బోల్డ్ కంటెంట్ తో ఇండియన్ ఓటీటీ స్పేస్ లో సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్ ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్. 2019లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో తొలి సీజన్ రాగా.. ఇప్పుడు చివరి సీజన్ రాబోతోంది. ఈ విషయాన్ని ప్రైమ్ వీడియో ఓటీటీ వెల్లడించింది. కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.

బోల్డ్ వెబ్ సిరీస్ చివరి సీజన్ వచ్చేస్తోంది.. సెక్స్ అండ్ ద సిటీకి దేశీ వెర్షన్‌లాంటి సిరీస్.. నలుగురు అమ్మాయిల చుట్టూ..
బోల్డ్ వెబ్ సిరీస్ చివరి సీజన్ వచ్చేస్తోంది.. సెక్స్ అండ్ ద సిటీకి దేశీ వెర్షన్‌లాంటి సిరీస్.. నలుగురు అమ్మాయిల చుట్టూ..

ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ ఫైనల్ సీజన్

అమెజాన్ ప్రైమ్ వీడియో బోల్డ్ వెబ్ సిరీస్ ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ (Four More Shots Please). ముంబైలోని ఓ బార్ లో టెకీలా షాట్స్ తో పరిచయమైన నలుగురు ఫ్రెండ్స్ చుట్టూ తిరిగే స్టోరీతో వచ్చిన ఈ సిరీస్ ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. త్వరలోనే నాలుగోది, చివరి సీజన్ వస్తున్నట్లు ప్రైమ్ వీడియో మంగళవారం (జులై 1) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

“సీజన్ ఫినాలే కోసం ఏం చేయాలో చెప్పడానికి వస్తున్నాం. ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ చివరి సీజన్ త్వరలోనే రాబోతోంది” అనే క్యాప్షన్ తో ఈ చివరి సీజన్ గురించి ప్రైమ్ వీడియో తెలిపింది. మూడో సీజన్ వచ్చిన సుమారు రెండున్నర ఏళ్ల తర్వాత నాలుగో సీజన్ రాబోతుండటం విశేషం. ఐఎండీబీలో 6.6 రేటింగ్ ఉన్న ఈ సిరీస్ మూడు సీజన్లు బోల్డ్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరించింది.

ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ వెబ్ సిరీస్ గురించి..

ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ వెబ్ సిరీస్ ఇంగ్లిష్ లో వచ్చిన సెక్స్ అండ్ ద సిటీకి దేశీ వెర్షన్ గా పేరుగాంచింది. ముఖ్యంగా ఇందులోని బోల్డ్ కంటెంట్ ఇండియన్ ఓటీటీ ఆడియెన్స్ ను ఆశ్చర్యపరిచింది.

ఈ సిరీస్ ముంబైలో ఉండే దామిని రిజ్వీ రాయ్ (సయానీ గుప్తా), ఉమంగ్ సింగ్ (బానీ జే), అంజనా మేనన్ (కీర్తి కుల్హరి), సిద్ధీ పటేల్ (మాన్వీ గగ్రూ) చుట్టూ తిరిగే స్టోరీ. జీవితంలో స్వతంత్రంగా ఉంటూ తమకు నచ్చినట్లుగా జీవించే ఈ నలుగురు అమ్మాయిల జీవితాల్లోని ఎత్తుపల్లాలను ఈ ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ వెబ్ సిరీస్ ఆవిష్కరించింది.

అయితే ఇందులోని బోల్డ్ సీన్స్ వల్లే ఈ సిరీస్ పాపులర్ అయింది. ఇప్పటి వరకూ మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఒక్కో సీజన్ ను ఒక్కొక్కరు డైరెక్ట్ చేశారు. మూడు సీజన్లు కలిపి మొత్తం 30 ఎపిసోడ్లు ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పుడు చివరిదైన నాలుగో సీజన్ రానుంది. మరి ఈ చివరి సీజన్ ఎలా ఉంటుందో అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

మూడో సీజన్లో ఏం జరిగిందంటే?

ఫెమినిజం, ఇండివిడ్యువాలిటీ, మోడర్న్‌ రిలేషన్‌షిప్స్‌, పేజ్‌ త్రీ లుకింగ్స్ తో నాలుగు మెయిన్ క్యారెక్ట‌ర్స్‌ డిఫ‌రెంట్ కాన్‌ ఫ్లిక్ల్ న్ డీల్ చేస్తూ మూడో సీజ‌న్‌ను న‌డిపించారు. ఫోర్ మోర్ షాట్స్ సీజ‌న్ 2కు కొన‌సాగింపుగా సీజ‌న్ 3 సాగుతుంది.

ఉమంగ్ పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడం, సిద్ధి వాళ్ల నాన్న చనిపోవడం, అంజనా రిలేషన్‌ షిప్‌ బయటపడడం, దామిని మిస్‌ క్యారేజ్‌..ఇ లా ఒక్కో పాత్రకి ఒక్కో కాన్ ఫ్లిక్ట్ తో సీజ‌న్ 2ను ఎండ్ చేయడం వల్ల థర్డ్ సీజన్‌ కోసం ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూసేలా చేశారు. మూడో సీజన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో చివరి సీజన్ లో మేకర్స్ ఏం చేయబోతున్నారో చూడాలి.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More