బాలీవుడ్ స్టార్ నటుడు రణవీర్ సింగ్ ఈ సంవత్సరం సినీ రంగంలోకి తిరిగి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అతడు నటించిన 'ధురంధర్' మూవీ వచ్చే నెలలో విడుదల కాబోతుండగా.. ప్రస్తుతం ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. సినిమా కెరీర్లో పునరుత్తేజం పొందుతున్న రణవీర్ సింగ్.. తన వ్యాపారంలో కూడా భారీ లాభాలను చవిచూస్తున్నాడు. రణవీర్ సింగ్ సహ-యజమానిగా ఉన్న వేఫర్ బ్రాండ్ 'SuperYou' కేవలం ఏడాదిలోనే రూ.100 కోట్ల ఆదాయాన్ని దాటినట్లు రిపోర్టులు చెబుతున్నాయి.
రణవీర్ సింగ్ బ్రాండ్కు రూ.100 కోట్ల ఆదాయం

రణవీర్ సింగ్, నికుంజ్ బియానీతో కలిసి స్థాపించిన స్నాకింగ్ బ్రాండ్ ‘SuperYou’. ఈ కంపెనీ ప్రకటన ప్రకారం రూ.100 కోట్ల ఆదాయాన్ని దాటేసింది. తాజాగా కొత్త మల్టీగ్రెయిన్ ప్రోటీన్ చిప్స్ను కూడా మార్కెట్లోకి విడుదల చేసిన ఈ బ్రాండ్.. రాబోయే ఐదేళ్లలో రూ.500 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా చేసుకుంది.
ఈ విజయంపై రణవీర్ సింగ్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. "మేము స్నాకింగ్లోని అపరాధ భావాన్ని తొలగిస్తున్నాము. ప్రోటీన్ అధికంగా ఉండే స్నాక్స్ను మరింత ఆనందదాయకంగా, మెయిన్ స్ట్రీమ్ లోకి తీసుకురావడంలో ఇది ఒక ముందడుగు" అని పేర్కొన్నాడు.
నవంబర్ 2024లోనే ప్రారంభమైన ఈ బ్రాండ్.. కేవలం గత నెల వరకు నాలుగు ఉత్పత్తులను మాత్రమే కలిగి ఉండగా.. ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయిలో ఆదాయం పెరగడం ఒక అద్భుతమైన విజయం.
SuperYou వేగవంతమైన వృద్ధికి కారణాలు
SuperYou ప్రోటీన్ వేఫర్ బార్లు నవంబర్ 2024లో విడుదలైన 90 రోజుల్లోనే 1.6 మిలియన్ యూనిట్లను విక్రయించాయి. ఇది బ్రాండ్కు బలమైన పురోగతిని ఇచ్చింది. ఎకనామిక్ టైమ్స్ ప్రకారం క్లీన్-లేబుల్, ఫంక్షనల్ స్నాక్స్కు ఉన్న డిమాండ్తో సూపర్యు నెలవారీగా 25–30% వృద్ధిని నమోదు చేసింది.
ఈ అద్భుతమైన వృద్ధి కారణంగా డిసెంబర్ 2024లో జెరోధాకు చెందిన రైన్మ్యాటర్ క్యాపిటల్ నుంచి సంస్థకు నిధులు సమకూరాయి. ఈ పెట్టుబడితో ఉత్పత్తిని విస్తరించి, ఉత్పత్తుల శ్రేణిని పెంచాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
రణవీర్ సింగ్ రాబోయే మూవీ
{{/usCountry}}ఈ అద్భుతమైన వృద్ధి కారణంగా డిసెంబర్ 2024లో జెరోధాకు చెందిన రైన్మ్యాటర్ క్యాపిటల్ నుంచి సంస్థకు నిధులు సమకూరాయి. ఈ పెట్టుబడితో ఉత్పత్తిని విస్తరించి, ఉత్పత్తుల శ్రేణిని పెంచాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
రణవీర్ సింగ్ రాబోయే మూవీ
{{/usCountry}}సిల్వర్ స్క్రీన్పై రణవీర్ సింగ్ తదుపరి సినిమా 'ధురంధర్' డిసెంబర్ 5న విడుదల కానుంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్, గూఢచర్యం నేపథ్యంలో రూపొందించారు. ఈ సినిమాలో అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా వంటి అగ్ర నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీ నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కినట్లు సమాచారం.