మాజీ నటి, మాజీ మిస్ ఇండియా రన్నరప్ సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్ పై డొమెస్టిక్ వయోలెన్స్ కేసు దాఖలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్రలోని ముంబై అంధేరి కోర్టులో జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ ముందు ఆమె ఈ కేసు వేసింది. పీటర్ హాగ్ ఆస్ట్రియాకు చెందిన వ్యక్తి. ఆ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
భర్తపై సెలీనా కేసు వివరాలు

బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తెలుసు కదా. ఇప్పుడామె తన భర్తపైనే కోర్టుకెక్కింది. గృహ హింస, క్రూరత్వం, మోసం ఆరోపణల కింద డొమెస్టిక్ వయొలెన్స్ చట్టం ప్రకారం సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్ పై కేసు దాఖలు చేసింది. ఈ కేసు ధృవీకరణ, నోటీసు కోసం మంగళవారం (నవంబర్ 25)నాడు అంధేరిలోని లీగల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ ఎస్.సి. టడ్యే కోర్టు ముందు విచారణకు వచ్చింది.
ఏఎన్ఐ వార్తా సంస్థ ప్రకారం తన ఆదాయ వనరులు, ఆస్తుల నష్టానికి బదులుగా సెలీనా జైట్లీ రూ.50 కోట్ల నష్టపరిహారం, ఇతర మొత్తాలను కోరినట్లు తెలిసింది. సెలీనా 2011లో ఆస్ట్రియన్ వ్యవస్థాపకుడు, హోటలియర్ అయిన పీటర్ను వివాహం చేసుకుంది. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. 2012లో విన్స్టన్, విరాజ్ అనే కవలలు జన్మించారు. 2017లో శంషేర్, ఆర్థర్ అనే మరో కవలలు జన్మించారు. అయితే 2017లో జన్మించిన కవలల్లో ఒకరైన శంషేర్ గుండె సమస్య కారణంగా మరణించాడు.
సెలీనా సోదరుడి వ్యవహారం
మాజీ మిస్ ఇండియా విజేత అయిన సెలీనా జైట్లీ ఇటీవల తన సోదరుడు, మేజర్ (రిటైర్డ్) విక్రాంత్ జైట్లీ విషయంలోనూ వార్తల్లో నిలిచింది. సెప్టెంబర్ 2024లో తన సోదరుడిని యూఏఈలో అక్రమంగా నిర్బంధించారని ఆమె ఆరోపించింది. ఈ నెల ప్రారంభంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ.. సెలీనా జైట్లీ సోదరుడికి సాధ్యమైన అన్ని సహాయాలను అందిస్తున్నట్లు తెలిపింది.
నవంబర్ 7న వీక్లీ మీడియా బ్రీఫింగ్లో విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. "మా రాయబార కార్యాలయం ఈ విషయాన్ని పరిశీలిస్తోంది. మేము అతన్ని నాలుగు సార్లు కాన్సులర్ విజిట్స్ చేశాం" అని తెలిపారు.
{{/usCountry}}నవంబర్ 7న వీక్లీ మీడియా బ్రీఫింగ్లో విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. "మా రాయబార కార్యాలయం ఈ విషయాన్ని పరిశీలిస్తోంది. మేము అతన్ని నాలుగు సార్లు కాన్సులర్ విజిట్స్ చేశాం" అని తెలిపారు.
{{/usCountry}}తన సోదరుడికి చట్టపరమైన సహాయం అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సెలీనా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు.. మాజీ ఆర్మీ అధికారి అయిన విక్రాంత్కు చట్టపరమైన సహాయం అందించాలని విదేశాంగ శాఖకు స్పష్టం చేసింది.