...
...
Next Story

పెళ్లికీ ఎక్స్‌పైరీ డేట్ ఉండాలట.. బాలీవుడ్ నటి కామెంట్స్ వైరల్.. పెళ్లయిన 26 ఏళ్లకు ఇలా..

బాలీవుడ్ నటి కాజోల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. పెళ్లికీ ఓ ఎక్స్‌పైరీ, రెనివల్ డేట్ ఉండాలట. తన పెళ్లయిన 26 ఏళ్లకు ఆమె ఈ కామెంట్స్ చేయడం విశేషం. ఇప్పుడామె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Nov 12, 2025, 15:07:00 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

బాలీవుడ్ నటీమణులు కాజోల్, ట్వింకిల్ ఖన్నా కలిసి హోస్ట్ చేస్తున్న ప్రముఖ సెలబ్రిటీ టాక్ షో 'టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్' లేటెస్ట్ ఎపిసోడ్‌కు నటులు విక్కీ కౌశల్, కృతి సనన్ వచ్చారు. ఈ సందర్భంగా వివాదాస్పద, ఆసక్తికరమైన అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా వివాహ బంధానికి కూడా గడువు తేదీ ఉండాలి, దానిని మళ్లీ రెనివల్ చేసుకునే అవకాశం ఇవ్వాలని కాజోల్ అభిప్రాయపడటం చర్చనీయాంశమైంది.

పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్ ఉండాలి: కాజోల్ సంచలన వ్యాఖ్యలు

పెళ్లికీ ఎక్స్‌పైరీ డేట్ ఉండాలట.. బాలీవుడ్ నటి కామెంట్స్ వైరల్.. పెళ్లయిన 26 ఏళ్లకు ఇలా..
పెళ్లికీ ఎక్స్‌పైరీ డేట్ ఉండాలట.. బాలీవుడ్ నటి కామెంట్స్ వైరల్.. పెళ్లయిన 26 ఏళ్లకు ఇలా..

కాజోల్, ట్వింకిల్ హోస్ట్ చేస్తున్న ఈ టూమచ్ షోలో భాగంగా 'దిస్ ఆర్ దట్' (This or That) అనే సెగ్మెంట్‌లో ట్వింకిల్ ఖన్నా ఒక ప్రశ్న అడిగింది. "వివాహానికి గడువు తేదీ, రెనివల్ ఆప్షన్ ఉండాలా?" అని. దీనికి నో చెబుతూ కృతి సనన్, విక్కీ కౌశల్, ట్వింకిల్ ఖన్నా రెడ్ జోన్‌లో నిలబడ్డారు. కాజోల్ మాత్రం ఈ ఆలోచనకు మద్దతు ఇచ్చి గ్రీన్ జోన్‌లోకి వెళ్లింది. ట్వింకిల్ వెంటనే స్పందిస్తూ.. "అది పెళ్లి, వాషింగ్ మెషీన్ కాదు కదా!" అని చమత్కరించింది.

కాజోల్ దానికి గట్టిగా బదులిస్తూ.. “నేను కచ్చితంగా అలా అనుకుంటున్నాను. సరైన సమయంలో సరైన వ్యక్తిని పెళ్లి చేసుకుంటారనే గ్యారెంటీ ఏముంది? అందుకే రెనివల్ ఆప్షన్ ఉంటే అర్ధవంతంగా ఉంటుంది. ఒకవేళ గడువు తేదీ ఉంటే ఎవరూ ఎక్కువ కాలం బాధపడాల్సిన అవసరం ఉండదు” అని వివరించింది. ఈ విషయంలో తనతో కలవమని ఆమె ట్వింకిల్‌ను కూడా ఒప్పించే ప్రయత్నం చేసింది.

డబ్బుతో ఆనందం కొనుగోలుపై చర్చ

ఇక ఇదే సెగ్మెంట్ లో ట్వింకిల్ మరో ప్రశ్న అడుగుతూ.. "డబ్బుతో ఆనందాన్ని కొనుగోలు చేయవచ్చా" అని చెప్పింది. ఈసారి ట్వింకిల్, విక్కీ అంగీకరించి గ్రీన్ జోన్‌లో నిలబడగా, కాజోల్ వ్యతిరేకించింది. దీనికి కాజోల్ వివరణ ఇస్తూ.. “మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నప్పటికీ, అది కొన్నిసార్లు అడ్డంకిగా కూడా మారవచ్చు. నిజమైన సంతోషాన్ని అర్థం చేసుకోకుండా అది మిమ్మల్ని మొద్దుబారేలా చేస్తుంది” అని అనడం విశేషం. కొద్దిసేపు ఆలోచించిన తర్వాత కృతి సనన్ డబ్బు కొంతవరకు ఆనందాన్ని కొనుగోలు చేయగలదని అంగీకరించింది.

'మా ఇద్దరికీ ఒకే ఎక్స్ ఉన్నాడు'

దీనికి కాజోల్ వెంటనే నవ్వి ఏ రహస్యాలు బయటపెట్టకుండా ఉండటానికి "నోరు మూయ్" అని సరదాగా మందలించింది. ఈ ఇద్దరు తారలు తమ వ్యక్తిగత జీవితాల గురించి చేసిన ఈ పరోక్ష వ్యాఖ్యలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి.

'టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్' ఈ ఏడాది విడుదలైన అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన సెలబ్రిటీ టాక్ షోలలో ఒకటి. కాజోల్, ట్వింకిల్ ఖన్నా హోస్ట్ చేస్తున్న ఈ షోలో సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ వంటి సీనియర్ తారలతో పాటు వరుణ్ ధావన్, అలియా భట్, అనన్యా పాండే వంటి యువ తారలు కూడా పాల్గొన్నారు. ఈ షో ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రతి గురువారం కొత్త ఎపిసోడ్ విడుదలవుతుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe