Pallaburusu Movie: బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ చిన్న తెలుగు సినిమా 'పళ్లబురుసు' చూసి కళ్లు తేలేశారు. బాక్సాఫీస్ వద్ద రొటీన్ యాక్షన్, ధమాకా సినిమాల రచ్చ నడుస్తున్న టైమ్లో వచ్చిన ఈ రూరల్ ఎమోషనల్ డ్రామాకి ఏకంగా 5 స్టార్ రేటింగ్ ఇచ్చి నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు.

డెబ్యూ డైరెక్టర్ ఉదయ్ చౌహాన్ తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చి ఆడియన్స్ మనసు గెలుచుకుంది. సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను చూసిన అనురాగ్ కశ్యప్.. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లెటర్బాక్స్, ఇన్స్టాగ్రామ్లలో అద్భుతమైన రివ్యూస్ ఇచ్చారు.
'వెంకటేష్ మహా' తర్వాత ఆ రేంజ్ టాలెంట్
ఈ పళ్లబురుసు సినిమాపై లెటర్బాక్స్లో రివ్యూ రాస్తూ అనురాగ్ కశ్యప్ చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. "ఒకేలా ఉండే నాన్స్టాప్ యాక్షన్ సినిమాల రొటీన్ ఫార్మాట్ నుంచి 'పళ్లుబురుసు' చాలా రిఫ్రెషింగ్ ఛేంజ్ ఇచ్చింది. ముఖంపై నిరంతరం చిరునవ్వులు పూయించేంత అందమైన సినిమా ఇది. 'కేరాఫ్ కంచరపాలెం' డైరెక్ట్ చేసిన వెంకటేష్ మహా తర్వాత నేను అంతగా ఆసక్తిగా వెయిట్ చేసే డైరెక్టర్ ఉదయ్ చౌహానే" అని ప్రశంసించారు.
అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తూ.. "పళ్లబురుసు అంటే టూత్ బ్రష్ అని నా అనుమానం. తెలుగు సినిమా నుంచి వచ్చిన మోస్ట్ ఫన్, ఫాసినేటింగ్ డ్రామా ఇది. తన కొడుకు పళ్లు తోముకునే బ్రష్ కొనివ్వలేదని పోలీస్ స్టేషన్, కోర్టు మెట్లు ఎక్కే తండ్రి కథ. పెద్ద నటులు లేరు, చెవులు చిల్లులు పడే మ్యూజిక్ లేదు. జస్ట్ ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్" అని కొనియాడారు.
పళ్లు తోముకునే బ్రష్ చుట్టూ తిరిగే లీగల్ డ్రామా
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా కథ చాలా డిఫరెంట్గా ఉంటుంది. వయసు మళ్లిన తండ్రి (సుధాకర్ రెడ్డి) తన కొడుకు (మురళీధర్ గౌడ్)పై పోలీస్ స్టేషన్లో కేసు పెడతాడు. కారణం ఏంటంటే.. తనకు కావలసిన పళ్ల బురుసు కొనివ్వలేదని. మొదట్లో ఇది చాలా చిన్న ఈగో గొడవలా కనిపించినా, ఆ తర్వాత తండ్రీ కొడుకుల మధ్య ఏళ్ల తరబడి దాగి ఉన్న ఒంటరితనం, ఆవేదన, ప్రేమ, బంధాల అసలు రంగు బయటపడుతుంది.
{{/usCountry}}తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా కథ చాలా డిఫరెంట్గా ఉంటుంది. వయసు మళ్లిన తండ్రి (సుధాకర్ రెడ్డి) తన కొడుకు (మురళీధర్ గౌడ్)పై పోలీస్ స్టేషన్లో కేసు పెడతాడు. కారణం ఏంటంటే.. తనకు కావలసిన పళ్ల బురుసు కొనివ్వలేదని. మొదట్లో ఇది చాలా చిన్న ఈగో గొడవలా కనిపించినా, ఆ తర్వాత తండ్రీ కొడుకుల మధ్య ఏళ్ల తరబడి దాగి ఉన్న ఒంటరితనం, ఆవేదన, ప్రేమ, బంధాల అసలు రంగు బయటపడుతుంది.
{{/usCountry}}ఈ కథ వెనుక ఉన్న రియల్ ఇన్స్పిరేషన్ గురించి డైరెక్టర్ ఉదయ్ చెబుతూ.. "పొలాల్లోని ఒక శ్మశానం మధ్యలో 70 ఏళ్ల వృద్ధుడు వెక్కి వెక్కి ఏడవడం చూశాను. అంతపెద్ద మనిషిని అంతగా కుంగదీసిన బాధ ఏంటని ఆలోచించడం నుంచే ఈ 'పళ్లబురుసు' ఐడియా పుట్టింది" అని తెలిపారు.
అన్నపూర్ణ స్టూడియోస్ బిగ్ సపోర్ట్
ఈ చిన్న చిత్రాన్ని అక్కినేని నాగార్జునకు చెందిన ప్రఖ్యాత అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. సినిమా అవుట్పుట్ చూసి ఇంప్రెస్ అయిన నాగార్జున, నాగ చైతన్యలు ఈ ప్రాజెక్ట్కు పూర్తి సపోర్ట్ అందించారు.
పెద్ద స్టార్ డమ్, భారీ బడ్జెట్ హంగులు లేకపోయినా.. వినూత్నమైన కథనం, నేచురల్ యాక్టింగ్తో వచ్చిన 'పళ్లబురుసు' థియేటర్లలో సక్సెస్ఫుల్ రన్ సాధించడమే కాకుండా, అనురాగ్ కశ్యప్ లాంటి నేషనల్ ఫిల్మ్మేకర్స్ ప్రశంసలు అందుకోవడం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.