2016లో నా జీవితం నరకంలా మారింది: హృతిక్ రోషన్ కేసుపై పరోక్షంగా కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
2016 సంవత్సరంలో తన జీవితం వృత్తిపరమైన విజయాలతో పాటు వ్యక్తిగత ఆటుపోట్లతో నిండిపోయిందని కంగనా రనౌత్ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్లో తెలిపారు. అప్పట్లో హృతిక్ రోషన్ తో జరిగిన న్యాయ పోరాటాలను పరోక్షంగా ప్రస్తావించారు. ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వ్యాఖ్యలు తరచూ వివాదాస్పదమవుతూనే ఉంటాయి. ఈ హీరోయిన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హృతిక్ రోషన్ గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ ఇన్స్టాగ్రామ్ లో పోస్టు పెట్టింది. ‘‘2016 అనేది కొత్త 2016’’ అనే ట్రెండ్ లో భాగంగా కంగనా ఈ కాంట్రవర్సీ పోస్టు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.

కంగనా రనౌత్ పోస్ట్
శనివారం (జనవరి 17) కంగనా రనౌత్ 2016 నాటి తన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ కొన్ని ఫోటోల కారౌసెల్ను పంచుకున్నారు. ఆ సంవత్సరం వృత్తిపరంగా విజయవంతమైనా, వ్యక్తిగతంగా తీవ్రంగా దెబ్బతీసిందని ఆమె అభివర్ణించారు. ఒక కో స్టార్ నుంచి వచ్చిన లీగల్ నోటీసు గురించి కంగనా ప్రస్తావించారు. ఎవరి పేరునూ నేరుగా చెప్పనప్పటికీ నటుడు హృతిక్ రోషన్ తనకు పంపిన వివాదాస్పద న్యాయ నోటీసు గురించే కంగనా గుర్తు చేసుకున్నారు.
ఇండస్ట్రీ షేక్
‘‘అకస్మాత్తుగా అందరూ 2016ను ఎందుకు మిస్ అవుతున్నారు? 'క్వీన్', 'తను వెడ్స్ మను రిటర్న్స్' వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్బస్టర్ల తర్వాత నా కెరీర్ గ్రాఫ్ అనివార్యంగా పెరిగింది. నేను అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా మారినప్పటికీ, 2016 జనవరిలో నా కో స్టార్ ఒకరు నాకు ఆ వివాదాస్పద లీగల్ నోటీస్ పంపారు. అది పరిశ్రమను షేక్ చేసి, ఇన్సైడర్లు, అవుట్ సైడర్లుగా విభజించింది’’ అని కంగనా తన పోస్ట్ లో పేర్కొన్నారు.
జీవితం నరకంలా
‘‘విజయం విషపూరితమైంది. జీవితం నరకంలా మారింది. పక్షాలుగా చీలిక వచ్చింది. మరిన్ని న్యాయ పోరాటాలు కూడా జరిగాయి. పదేళ్ల క్రితం, 2026లో నేను నా ప్రతి భోజనంలో కార్బోహైడ్రేట్లు తింటానని, చాలా నవ్వుతానని, 2016 నాటి డ్రామా కొన్ని సంవత్సరాల తర్వాత ఎవరికీ పెద్దగా గుర్తుండదని నాకు తెలిసి ఉంటే, అంతగా బాధపడి ఉండేదాన్ని కాదు. 2016 కాదు, మనం 2026లో ఉన్నందుకు దేవుడికి ధన్యవాదాలు" అని కంగనా పోస్ట్ చేశారు.
కంగనా, హృతిక్ వివాదం
2016 ప్రారంభంలో కంగనా తన ఇంటర్వ్యూలలో హృతిక్ను 'ఎక్స్'గా పేర్కొంటూ, వ్యక్తిగత సంబంధం గురించి మాట్లాడారు. దీని తర్వాత కంగనా రనౌత్, హృతిక్ రోషన్ మధ్య వివాదం వెలుగులోకి వచ్చింది. హృతిక్ ఆ ఆరోపణలను ఖండించి, ఆమె క్షమాపణ చెప్పాలని కోరుతూ లీగల్ నోటీసు పంపారు. కంగనా దానిని తిరస్కరించి, ఆ చర్య తనను నిశ్శబ్దం చేయడానికి ప్రయత్నమని అన్నారు. ఆ తరువాత ఆరోపణలు, ప్రతి ఆరోపణలు, లీకైన ఈమెయిల్లు, సైబర్ క్రైమ్ ఫిర్యాదులు, ఫోరెన్సిక్ దర్యాప్తులు వంటి సుదీర్ఘమైన న్యాయ, మీడియా యుద్ధం జరిగింది.
కంగనా రాబోయే ప్రాజెక్టులు
రాబోయే సంవత్సరాలలో కంగనా రనౌత్ నటిగా అనేక ఆసక్తికరమైన చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆమె రాబోయే ప్రాజెక్టులలో 'భారత్ భాగ్య విధాత', 2026 ప్రారంభంలో ప్రారంభం కానున్న ‘క్వీన్ 2’, 'తను వెడ్స్ మను 3' అనే అత్యంత ఆసక్తికరమైన సినిమాలున్నాయి. 2026లో విడుదల కానున్న 'మణికర్ణికా రిటర్న్స్: ది లెజెండ్ ఆఫ్ దిద్దా'లో కూడా ఆమె కనిపించనున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


