బ్రహ్మముడి డిసెంబర్ 4 ఎపిసోడ్: కేరళలో రాజ్, కావ్య ప్రాణాలకు ప్రమాదం- వారం రోజుల్లో జీవితాలన్ని నాశనం చేస్తానన్న రాహుల్
బ్రహ్మముడి సీరియల్ డిసెంబర్ 4 ఎపిసోడ్లో వారం రోజుల్లో కావ్యను పూర్తిగా నయంతో ఇంటికి తీసుకు రావాలని రాజ్, కేసు క్లోజ్ చేయాలని అప్పు అనుకుంటే.. అందరి జీవితాలను నాశనం చేస్తానని రాహుల్ అనుకుంటాడు. కేరళలో కావ్యకు గురూజీ చికిత్స ప్రారంభిస్తాడు. కానీ, రాజ్, కావ్యకు రౌడీల వల్ల ప్రమాదం ఏర్పడుతుంది.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో వారం రోజుల్లో నీకు పూర్తిగా నయం అయ్యాకే ఇంట్లో అడుగుపెట్టాలని కావ్యతో రాజ్ అంటాడు. వారం రోజుల్లో కేసు పూర్తి చేసి అత్త కోరుకున్న కోడలిగా ఇంట్లోనే ఉంటాను అప్పు అంటుంది. వారం రోజుల్లో మీ జీవితాలన్నీ పూర్తిగా నాశనం చేస్తాను అని రాహుల్ అనుకుంటాడు.

ఇల్యూజనేషన్ ఎక్కువవుతోంది
మరోవైపు తన కూతురును చూసిన ప్లేసును అప్పుకు రేణుక చూపిస్తుంది. రేణుక భర్త వచ్చి మళ్లీ అలాగే మీకు చెప్పిందా. రోజు రోజుకు తన సమస్య ఎక్కువ అవుతుంది. ఇల్యూజనేషన్ ఎక్కువ అవుతుంది. మళ్లీ మీరు వచ్చి ఆశలు రేపుతున్నారు అని రేణుక భర్త అంటాడు. నిజ నిజాలు నేను తేలుస్తాను. మీరు రేణుకను లోపలికి తీసుకెళ్లండని అప్పు అంటుంది.
ఇంటి పక్కన ఉన్న ఒక ఆవిడను అడిగితే పాప చనిపోయిందని, ఆమె మాత్రం బతికే ఉందని చెబుతుందని చెబుతుంది. చుట్టు పక్కల వాళ్లను అడిగితే అదే చెబుతారు. రాజ్, కావ్య కేరళ వెళ్తారు. మరోవైపు కావ్య డిజైన్స్ దొంగతనంగా సతీష్ తీసుకొస్తాడు. అవి చూసి రాహుల్ మురిసిపోతాడు. కానీ, సతీష్ భయపడతాడు. రాజ్ సర్ చంపేస్తాడేమో అంటే పచ్చనోట్లతో బతికిస్తా అని రాహుల్ అంటాడు.
వీటిలాగే డిజైన్ చేయాలి
ఇప్పుడు ఈ డిజైన్స్ మనవి అనేలా లోకాన్ని నమ్మించాలి. మనకో కొత్త డిజైనర్ కావాలి. వాడు అచ్చం ఇలాగే వీటిని డిజైన్ చేయాలని రాహుల్ అంటాడు. సరేనని సతీష్ వెళ్లిపోతాడు. కేరళలోని సింధూర గ్రామంలో వరసిద్ధి ఆచార్యుల శిష్యుడు ఆశ్రమాన్ని చూపిస్తాడు. అక్కడ ఒకావిడ యాక్సిడెంట్లో కాళ్లు విరిగి నయం కావడాన్ని చెబుతుంది.
గురువు దగ్గరికి కావ్య, రాజ్ వెళ్తారు. కావ్య రిపోర్ట్స్ చూపిస్తాడు రాజ్. సమస్య అర్థమైందన్న గురూజీ సైన్స్కు అందనివి ప్రకృతి చూపిస్తుంది. ప్రకృతి అంటే అమ్మవారు. మన రుగ్మలతన్నీ దూరం చేస్తుంది అంటాడు. కావ్యను గదిలో చెక్ చేస్తాడు గురూజీ. పక్కనున్న కోమలితో తైలం రాయిస్తాడు. తర్వాత మళ్లీ చూసిన గురూజీ బయటకు వెళ్లి రాజ్తో మాట్లాడుతాడు.
గురూజీ ప్రకృతి వైద్యం
కంగారుపడాల్సిన అవసరం లేదు. మీరు బస చేసిన చోట నేను ఇచ్చిన కషాయం వాడాలి, అలాగే గుళికలు వేసుకోవాలి. తర్వాత తైలం తయారు చేస్తాను. దాన్ని సాయంత్రం అమ్మాయి పొట్ట మీద సున్నితంగా రాయాలి. ప్రతిరోజు ఉదయం ఇక్కడికి తీసుకురండి. ఆ ప్రకృతి ఒడిలో ధ్యానం చేయించాలి. కానీ, కషాయం, గుళికలను నిర్లక్ష్యం చేయొద్దు అని గురూజీ చెబుతాడు.
ఎంతో నమ్మకంతో వచ్చాం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి అని రాజ్ అంటాడు. వ్యతిరేక భావన వదిలేయండి. ప్రకృతిని విమర్శించకండి. మా శిష్యుడు అన్ని మీకు చెబుతాడు అని పంపిస్తాడు గురూజీ. తాము ఉండేచోటుకు రాజ్, కావ్య వెళ్తారు. రాజ్ తెగ సంతోషంగా ఉంటాడు. నా కళావతి నాకు ఎప్పటికీ దూరం కాదని రాజ్ సంబరపడిపోతాడు.
శాలువ కప్పి
అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఆ పంతులు గారికి శాలువ కప్పి సన్మానం చేయాలని రాజ్ అంటాడు. మరోవైపు ఓ వ్యక్తిని రౌడీలు తరుముతుంటారు. ఆ వ్యక్తి రక్తపు మరకలతో రాజ్ కారుకు ఎదురుగా వచ్చి పడతాడు. దాంతో రాజ్ కారు ఆపుతాడు. అతనితో మాట్లాడుతాడు. అతను ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అదంతా రౌడీలు చూస్తారు.
రాజ్కు వాళ్ల గురించి ఏదో చెప్పారని, రాజ్, కావ్యను వదలకూడదని రౌడీలు అనుకుంటారు. దాంతో కేరళలో రాజ్, కావ్యకు ప్రమాదం ఏర్పడుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

E-Paper












